సొగసు చూడతరమా

1995 సినిమా

సొగసు చూడతరమా గుణశేఖర్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో నరేష్, ఇంద్రజ ముఖ్యమైన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య జరిగే సరదాలు, అలకలు ఈ సినిమాలో ప్రధాన కథ. ఇది దర్శకుడు గుణశేఖర్ కు రెండవ సినిమా కాగా మొదటి చిత్రం లాఠీ. ఈ చిత్రాన్ని కె. రాంగోపాల్ స్నేహనిధి ఫిలింస్ పతాకంపై నిర్మించగా కర్రి రమణారావు సమర్పకుడిగా వ్యవరించాడు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, చిత్రానువాదం, మాటలు, కాస్ట్యూమ్స్ విభాగాల్లో నాలుగు నంది పురస్కారాలు వచ్చాయి. భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.[1]

సొగసు చూడతరమా
దర్శకత్వంగుణశేఖర్
నిర్మాతకె. రాంగోపాల్, కర్రి రమణారావు
తారాగణంనరేష్,
ఇంద్రజ
సంగీతంభరద్వాజ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 జూలై 14 (1995-07-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. టైటిల్ సాంగ్ ప్రజాదరణ పొందింది.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఓరయ్యో ఏందమ్మో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 4:38
2. "ఆకాశంలో నీలిమబ్బుల"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రోహిణి 4:37
3. "సీతాకోక చిలుకాలమ్మా"  అనురాధ శ్రీరామ్ 5:09
4. "సొగసు చూడతరమా"  కె. జె. ఏసుదాసు 3:33
5. "రన్ను కట్టి పెట్టు పెళ్ళమ్మా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ 4:43
6. "ఓరి బాబోయ్ చూడచక్కని"  సురేష్ పీటర్స్, ఖుషి మురళి 4:59
27:39

మూలాలు మార్చు

  1. "నాలుగు నందుల 'సొగసు చూడ తరమా' @ 25". www.eenadu.net. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
  2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.