స్వాతి వారపత్రిక
స్వాతి సపరివార పత్రిక[1] తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొనివచ్చింది. ఇది 1984లో సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005 జాతీయ చదువరుల సర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతి నిలిచింది.
![]() | |
సంపాదకులు | వేమూరి బలరామ్. |
---|---|
వర్గాలు | వారపత్రిక |
ముద్రణకర్త | వేమూరి బలరాం |
స్థాపక కర్త | వేమూరి బలరాం |
మొదటి సంచిక | 1984 |
నిర్వహణ వర్గము సవరించు
- ఎడిటర్-వేమూరి బలరామ్
ఇతర విశేషాలు సవరించు
- ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
- ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు.[ఆధారం చూపాలి]
- బలరామ్ గారి సంపాదకీయాలు స్వాతి చినుకులు [2] అనే పుస్తకంగా వెలువడ్డాయి.
ప్రచురితమైన కొన్ని శీర్షికలు సవరించు
- సద్గురు సుభాషితం.. సద్గురు జగ్గీ వాసుదేవ్
- నన్ను అడగండి..మాలతీ చందూర్
- ఈ శీర్షిక మీదే.. పాఠకులు పంపే ప్రశ్నలు, వాటికి కొంటె జవాబులు
- సెక్స్ విజ్ఞానం .. డా.జి.సమరం
- సెక్స్ అండ్ సైకాలజీ డా కొఠారి
- అనిల్ స్వాతి... పిల్లల పెంపకం, సరియైన తెలుగుగురించిన విషయాలు.
- కథా ఫలే...విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు
- ధర్మ సందేహాలు.. ఉషశ్రీ
పత్రికలో ప్రచురించిన ప్రసిద్ధ రచనలు సవరించు
- "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె ప్రసాద్ తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
- దర్శకుడు, రచయిత వంశీ రాసీన మా పసలపూడి కథలు
- మరొక రచయిత, కథకుడు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన 'కోతికొమ్మచ్చి'
మూలాలు సవరించు
- ↑ "స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు". Archived from the original on 2018-03-21. Retrieved 2020-03-23.
- ↑ - Dew Drops Speak About You స్వాతి చినుకులు ఇంగ్లీషు