హరిశ్చంద్ర (1935 సినిమా)
1935 తెలుగు సినిమా
హరిశ్చంద్ర టి.ఎ.రామన్ దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ పతాకంపై కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి, భీమారావు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చలన చిత్రం. ఈ సినిమాకు పి. పుల్లయ్య సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఈ సినిమాతో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా మంచి విజయం సాధించింది.
హరిశ్చంద్ర (1935 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎ.రామన్ |
---|---|
రచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
తారాగణం | కన్నాంబ, భీమారావు, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, ఏలేశ్వరపు కుటంబశాస్త్రి |
నిర్మాణ సంస్థ | స్టార్ కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంగీతంసవరించు
చిత్ర బృందంసవరించు
నటీనటులుసవరించు
తర్వాతి కాలంలో ప్రఖ్యాతి పొందిన తెలుగు సినిమా నటులు కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తిలకు ఇది తొలి చలన చిత్రం.[1] నటులు - పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి:
- కన్నాంబ - చంద్రమతి
- అద్దంకి శ్రీరామమూర్తి - హరిశ్చంద్రుడు
- భీమారావు -
- పులిపాటి వెంకటేశ్వర్లు - నక్షత్రకుడు
- ఏలేశ్వరపు కుటుంబశాస్త్రి - కౌశికుడు
- బందరు నాయుడు
- ఆకుల నరసింహారావు
సాంకేతిక వర్గంసవరించు
- రచన - బలిజేపల్లి లక్ష్మీకాంతం
- దర్శకత్వం - టి.ఎ.రామన్
- ఫోటోగ్రఫీ - జినరాజా బోధ్యే
- రికార్డింగ్ - జి.ఎల్.కాలే
- సంగీతం - బి.జి.తెంబే, ఖా సాహెబ్ బూర్జిఖా
- కళా దర్శకత్వం - గణపతిరావు వదాంగేకర్
- సహ దర్శకుడు - అన్నాసాహెబ్ రాజోపాధ్యాయె
- సహాయ దర్శకుడు - పి.పుల్లయ్య
స్పందనసవరించు
హరిశ్చంద్ర చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది విజయవంతం అయింది.[1]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 January 2007. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 7 June 2017.