పి. పుల్లయ్య

సినీ దర్శకుడు
(పి.పుల్లయ్య నుండి దారిమార్పు చెందింది)

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

పి. పుల్లయ్య
జననం
పోలుదాసు పుల్లయ్య

(1911-05-02)1911 మే 2
మరణం1987 మే 29(1987-05-29) (వయసు 76)
వృత్తిసినీ నిర్మాత
సినీ దర్శకుడు
జీవిత భాగస్వామిపి.శాంతకుమారి
తల్లిదండ్రులు
  • రాఘవయ్య (తండ్రి)
  • రంగమ్మ (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు. 1937 లో ఈయనకు సినీనటి శాంతకుమారితో వివాహం జరిగింది. వీరికి పద్మావతి, రాధ అని ఇద్దరు కుమార్తెలు.

కెరీర్ మార్చు

పుల్లయ్య తన కుమార్తె పేరు మీదుగా పద్మశ్రీ ప్రొడక్షన్స్ అనే సినీనిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. 1959 లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ప్రధాన పాత్రధారులుగా ఈయన దర్శకత్వం వహించిన జయభేరి సినిమా మంచి విజయం సాధించింది.[1] 1960 లో ఎన్. టి. ఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్మ్యం సినిమాకు ఈయనే నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు వహించాడు. ఈ సినిమా కూడ ఘన విజయం సాధించింది.[2]

చిత్రసమాహారం మార్చు

దర్శకత్వం మార్చు

నిర్మాత మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు