హిమ్ లోక్‌తాంత్రిక్ మోర్చా

హిమాచల్ ప్రదేశ్ లోని రాజకీయ ఫ్రంట్

హిమ్ లోక్‌తాంత్రిక్ మోర్చా అనేది హిమాచల్ ప్రదేశ్ లోని రాజకీయ ఫ్రంట్. 2002 సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు హిమ్ లోక్‌తాంత్రిక్ మోర్చా ఏర్పడింది. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఉంది. హిమ్ లోక్‌తాంత్రిక్ మోర్చా కన్వీనర్ మొహిందర్ సింగ్ చౌదరి. ఈ ఫ్రంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కొన్ని లౌకిక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

హెచ్‌ఎల్‌ఎమ్‌ని రాజకీయ పార్టీగా మార్చడానికి సింగ్ తీసుకున్న చర్యపై అసంతృప్తిని అనుసరించి, సమాజ్‌వాదీ పార్టీ, సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ), జనతాదళ్ (సెక్యులర్) 2002 అక్టోబరులో హిమాచల్ జన్ మోర్చా (హిమాల్యానా పీపుల్స్ ఫ్రంట్)ని స్థాపించాడు.

సింగ్ తరువాత లోక్‌తాంత్రిక్ మోర్చా (హిమాచల్ ప్రదేశ్) ను రాజకీయ పార్టీగా నమోదు చేసాడు.

మూలాలు

మార్చు