అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. అంబర్పేట నియోజకవర్గం 1972 వరకు గగన్మహల్ పేరుతో పునర్విభజనలో భాగంగా 72 తర్వాత హిమాయత్నగర్ అయింది. 2009లో పునర్విభజనలో భాగంగా అంబర్పేటగా మారింది.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు సవరించు
- హైదరాబాదు కార్పోరేషన్లోని కొన్ని భాగాలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం
ఎన్నికైన శాసనసభ్యులు సవరించు
సంవత్సరం | నియోజకవర్గం సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం | నియోజకవర్గం రకం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 59 | అంబర్ పేట్ | జనరల్ | కాలేరు వెంకటేశ్ | పురుష | తెలంగాణ రాష్ట్ర సమితి | 61558 | జి.కిషన్ రెడ్డి | పురుష | భారతీయ జనతా పార్టీ | 60542 |
2014 | 59 | అంబర్ పేట్ | జనరల్ | జి.కిషన్ రెడ్డి | పురుష | భారతీయ జనతా పార్టీ | 81430 | ఆదెల సుధాకర్ రెడ్డి | పురుష | తెలంగాణ రాష్ట్ర సమితి | 18832 |
2009 | 59 | అంబర్ పేట్ | జనరల్ | జి.కిషన్ రెడ్డి | పురుష | భారతీయ జనతా పార్టీ | 59134 | మొహమ్మద్ ఫరీదుద్దీన్ | పురుష | భారతీయ జాతీయ కాంగ్రెస్ | 31891 |
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి, కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో[3] విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.
నియోజకవర్గ ప్రముఖులు సవరించు
జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Sakshi (16 November 2018). "యాది మరిస్తిరా?". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009