అడయారు గ్రంథాలయము

'అడయారు గ్రంథాలయము', పరిశోధనా కేంద్రం 1886లో హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్ ద్వారా ప్రారంభించబడింది. ఇది చెన్నై లోని అడయారు థియసాఫికల్ సొసైటీలో ఉంది.

థియసాఫికల్ సొసైటీ అడయార్ మద్రాసు

చరిత్ర మార్చు

డిసెంబరు 1886లో హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్ లైబ్రెరీ ఆఁల్కాట్ట్ను స్థాపించాడు. ఈ గ్రంథాలయంలో ఆఁల్కాట్ట్ తన జీవితకాలంలో సేకరించిన 24 భాషల్లో ఉన్న 200 పుస్తకాలు ఉండేవి. ఆసియాకు అతను వచ్చిన ప్రతీ సారీ మరిన్ని పుస్తకాలను, కొన్ని అరుదయిన వాటిని సేకరించాడు. 1907లో ఆఁల్కాట్ట్ మరణానంతరం మరికొందరు మతజ్ఞులు ఆ గ్రంథాలయాన్ని నిర్వహించారు. ఈనాడు ఈ గ్రంథాలయంలో దాదాపు రెండున్నర లక్షల (2,50,000) పుస్తకాలు, ఇరవై వేల (20,000) తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నేడు ఈ గ్రంథాలయం అన్ని ప్రపంచ ప్రాచ్య గ్రంథాలయాల్లోకీ ముఖ్యమయినదిగా ఉంది.

ఈ గ్రంథాలయం మొదట థియసాఫికల్ సొసైటీ లోపల ఉండేది. 1966లో వేరే ప్రత్యేక భవనానికి మార్చబడింది. ఇదే అడయారు గ్రంథాలయ భవనం. ఇక్కడ పబ్లిక్ మ్యూజియం అనే సంగ్రహాలయం కూడా ఉంది. ఈ సంగ్రహాలయంలో పాత పుస్తకాలు, తాళపత్ర, తామ్రపత్ర గ్రంథాలు ప్రదర్శనకు ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయం స్నాతకోత్తర విద్యార్థులు సంస్కృతం, భారతీయత చదివేవారు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగిస్తారు.

1990 లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్టన్ కాయ్ంప్బెల్ (1891-1990) అడయారు గ్రంథాలయానికి మరిన్ని నిధులు సమకూర్చి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్యాంప్బెల్

 
హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్

థియసాఫికల్ రిసెర్చ్ లైబ్రెరీని స్థాపించాడు.[1]

షికాగో విశ్వవిద్యాలయం వారు (యూనివర్సిటీ ఆఫ్ షికాగో) అడయారులోని పురాతన కృతులను భద్రపరిచేందుకు అత్యాధునిక సాంకేతికాలను వాడుతున్నారు.[2]

మూలములు మార్చు

  1. క్యాంప్బెల్ థియసాఫికల్ రీసెర్చ్ లైబ్రెరీ 25 జూలై 2013 నాటి స్థితి.
  2. షికాగో వారి ప్రణాళికలో దక్షిణాసియా ప్రాజెక్టులు

బయటి లింకులు మార్చు