అన్నమయ్య గ్రంథాలయం

(అన్నమయ్య గ్రంధాలయం నుండి దారిమార్పు చెందింది)

అన్నమయ్య గ్రంథాలయం బృందావన్ గార్డెన్స్, గుంటూరులో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం.1,41,000 పైగా పుస్తకాలు ఉన్నాయి. 90 శాతం పైగా పుస్తకాలు లంకా సూర్యనారాయణ సేకరించి దానం చేసినవి.

అన్నమయ్య గ్రంథాలయం
అన్నమయ్య గ్రంథాలయం (ధార్మిక విజ్ఞాన ప్రాంగణం) ప్రవేశ ద్వారం
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
స్థాపితము1999
ప్రదేశముగుంటూరు
భౌగోళికాంశాలు016°18′03″N 080°26′34″E / 16.30083°N 80.44278°E / 16.30083; 80.44278
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య1,41,000 [1]

చరిత్ర మార్చు

1999లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. వెలగా వెంకటప్పయ్య తొలిగా తనదగ్గరున్న విస్తారమైన గ్రంథ సంపదను దానం చేశాడు. ఆ తరువాత లంకా సూర్యనారాయణ చిన్నతనం నుంచి తాను చదివేందుకు సేకరించిన అత్యధికంగా సుమారు 60,000 పుస్తకాలు దానం చేసాడు.[2] దీని అభివృద్ధికి కృషి చేసినవారిలో కంభం శ్రీనివాస్, పెద్ది వెంకటేశ్వరరావు, కొండబోలు బసవ పున్నయ్య ఉన్నారు.

ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా రూపుదిద్దటానికి చేయూతనిస్తున్నారు.

గ్రంథ సంపద మార్చు

 
అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం

దీనిలో సుమారు 1,41,000 గ్రంథాలున్నాయి. భాషా పరంగా 97,216 తెలుగు భాషవి 42,900 ఆంగ్లభాషవి.[1] 500 రామాయణ సంబంధిత పుస్తకాలు, 100 మహాభారతం, భగవద్గీత సంబంధించిన పుస్తకాలు, 5000 జీవిత చరిత్రలు, 750 నిఘంటువులు, 3000 తెలుగు కథ, వ్యాస, నాటక సంకలనాలున్నాయి. 1205 హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడపుస్తకాలు, ఇవి కాకుండా తెలుగు పత్రికలు-1,091, ఇంగ్లీషు పత్రికలు-1,155, హిందీ మరుయు సంస్కృతం పత్రికలు-25 మొత్తం 2,271 పత్రికల టైటిల్స్ ఉన్నాయి. పుస్తకాలలో తెలుగులో భగవద్గీత, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు, గాయత్రీ, వివాహం, వ్యాకరణం, శ్లోకాలు, శతకాలు, నాటకాలు, సంగీతం, శ్రీశ్రీ, విశ్వనాథ, యం.యస్. సుబ్బలక్ష్మి, బాపు, చిత్రకళ, నిఘంటువులు, జీవిత చరిత్రలు, ట్రావెల్, మహాత్మ్యాలు, చరిత్ర, హాస్యం, సూక్తులు, దేశభక్తి, గురజాడ, నవలలు, సంకలనాలు, స్టాంపులు, కాఫీటేబుల్ బుక్స్, అభినందన, గ్రంథాలయ సమాచారశాస్త్ర గ్రంథాలు, జర్నలిజం మొదలగునవి 161 సబ్జెక్ట్స్ లోను ఇంగ్లీషులో మరొక 100 సబ్జెక్ట్స్ లోను జాగ్రత్త చేయబడినవి. ఈ మొత్తం 3 హాల్స్ లో బీరువాలలో ఉంచబడినవి.[2]

పురస్కారాలు మార్చు

  1. 2015 నూతనాంధ్ర రాష్ట్ర తొలి ఉగాది "కళారత్న" (హంస) పురస్కారం ( 2023 మార్చి 21)
  2. అజో విభో కందాళం ఫౌండేషన్ (USA) వారి రజతోత్సవ "ప్రతిభామూర్తి పురస్కారం" (2018)
  3. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 "కీర్తి పురస్కారం” (2018 అక్టోబరు 27)
  4. శ్రీ జానుమద్ది హనుమత్ శాస్త్రి గారి బ్రౌన్ గ్రంథాలయం, కడప వారి సన్మానం
  5. ఆం.ప్ర. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారిచే "విభిన్న ప్రతిభావంతుల" పురస్కారం-2018
  6. పాతూరి నాగభూషణం గ్రంథాలయ పురస్కారం – 2019
  7. రోటరీ క్లబ్ వారిచే సన్మానం, భారతీయ విద్యాభవన్, గుంటూరు వారిచే సన్మానం
  8. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారి (గ్రంథాళ్వార్-శ్రీరమణగారిచే) విశిష్ట సేవా పురస్కారం ( 2023 ఫిబ్రవరి 3)
  9. NTR శతజయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరులో సన్మానం (26.06.2023)
  10. AFA (Akkineni Foundation Of America) వారిచే ‘సేవారత్న’ పురస్కారం (23.09.2023)

సందర్శకులు మార్చు

గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రముఖులలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్ట్ జజ్డీలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మహాసహస్రావధాని మేడసాని మోహన్‌, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, తానా పూర్వాధ్యక్షులు జంపాలా చౌదరి, తోటకూర ప్రసాద్, ఆలపాటి రవీంద్రనాథ్ (మిసిమి ఫౌండర్), తణికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీరావు, మండలి బుద్ధప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వరరావు, డా. వి. చంద్రశేఖరరావు I.R.A.S, అద్దంకి శ్రీధర్‌బాబు I.A.S., పి.వి.ఆర్.కె. ప్రసాద్‌, జస్టిస్ బట్టు దేవానంద్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌గారు, నందిని సిథారెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డా. కడియాల వాసుదేవరావు, యస్.రఘునాథ్ (స్పెషల్ ఆఫీసర్- టి.టి.డి, కుర్రా జితేంద్రబాబు, పెద్ది రామారావు ఉన్నారు.

చిత్రమాలిక మార్చు

ఇవీచూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Ravi P.Benjamin (2014-11-02). "Annamayya Library: a treasure trove of knowledge". The Hans India.
  2. 2.0 2.1 P. Samuel Jonathan (2012-03-15). "Source of literary and spiritual nourishment". The Hindu.