పొత్తూరి వెంకటేశ్వరరావు
పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగు పాత్రికేయుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా పలు హోదాలలో పనిచేశాడు. ఆంధ్రభూమి పత్రికతో ఆతనికి అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశాడు.
పొత్తూరి వెంకటేశ్వరరావు | |
---|---|
పొత్తూరి వెంకటేశ్వరరావు | |
జననం | గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1934 ఫిబ్రవరి 8
మరణం | 2020- మార్చి-5 |
వృత్తి | పాత్రికేయుడు,,రచయిత |
వ్యక్తిగత జీవితంసవరించు
పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించాడు. ఉద్యోగరీత్యా అనేక పదవులను పోషించాడు. హైద్రాబాదు, విజయనగర్ కాలనీ, పి ఎస్ నగర్లో స్థిరపడ్డారు.ఇతని తండ్రి పేరు వెంకట సుబ్బయ్య తల్లి పేరు పన్నగేంగ్రమ్మ [1]
క్యాన్సర్తో 2020, మార్చి 5న ఉదయం తన నివాసంలో కన్నుమూశాడు[2]
వృత్తి జీవితంసవరించు
1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు, వార్త లలో పనిచేశాడు.
రచనలుసవరించు
ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహనీయులు, పత్రికా విలువలు, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయం మొదలైన వివిధ అంశాలపై రచనాలు చేశాడు. ఈయన రచనలలో కొన్ని వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు, పారమార్థిక పదకోశం . విధి నా సారథి అనేపేరుతో తన ఆత్మకథని వ్రాశాడు.
పురస్కారాలుసవరించు
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[3][4]
మూలాలుసవరించు
- ↑ పరిణతవాణి 6వ సంపుటి. పొత్తూరి వెంకటేశ్వర రావు (సాయి లిఖిత ప్రింటర్స్ ed.). ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 8.
- ↑ "ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత". www.andhrajyothy.com. Retrieved 2020-03-05.[permanent dead link]
- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.