అబ్బిరాజుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గోదావరి తీర ప్రాంతమైన ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000 వరకూ ఉంటారు. ప్రజల ప్రధానమైన జీవనాధారం వరి పంట. చెరకు కూడా విస్తారంగా పండిస్తారు.

అబ్బిరాజుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అబ్బిరాజుపాలెం is located in Andhra Pradesh
అబ్బిరాజుపాలెం
అబ్బిరాజుపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°30′11″N 81°50′11″E / 16.503030°N 81.836514°E / 16.503030; 81.836514
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం యలమంచిలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534266
ఎస్.టి.డి కోడ్

దేవాలయాలు మార్చు

 
గ్రామంలోని మశేనమ్మ కట్ట సమీపంలో గోదావరిపై బోటు

ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం, శివాలయం. దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ధి పరచబడింది. మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు. గోదావరి తీరం ఆనుకొని నిర్మించుటచే ఇక్కడి వెంకటేశ్వరాలయానికి సుదూరప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.ఇక్కడ 99 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది .

ఇక్కడి వెంకటేశ్వర దేవాలయాన్ని దక్షణ తిరుమల అని పిలుస్తుంటారు.ఈ వూరిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2013 జూన్ 3 న హనుమత్ జయంతినాడు 99 అడుగుల ఎత్తయిన ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ఆంజనేయ విగ్రహం. [1]

ఇతర విశేషాలు మార్చు

అదే దేవాలయమునకు కొద్ది దూరములో తాటిపాక, పొదలాడ (రాజోలు). వెళ్ళేందుకు రేవు ఉంది.ఇక్కడి నుండి పడవల ద్వారా ప్రతి రోజూ చలామంది తాటిపాకకు, పొదలాడకు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ తరచు వరదలు మమూలుగా వస్తూ ఉంటాయి. దానివలన గ్రామాభివృద్ది చాలా తక్కువ. ఎందరో రాకపోకలు సాగించే రేవులో సైతం సరి అయిన సౌకర్యాలు లేవు.

మూలాలు మార్చు