ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి

ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ.[1]

జివిత విశేషాలు మార్చు

మజ్లిస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మస్కతీ రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచి యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండుసార్లు శాసన మండలి సభ్యులుగా కొనసాగారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.[2] మస్కతి పేరిట పాల డెయిరీ కూడా స్థాపించారు.

మరణం మార్చు

పాతబస్తీలోని తన స్వగృహంలో ఆగష్టు 24 2015 సోమవారం తుదిశ్వాస విడిచారు.[3]

మూలాలు మార్చు

  1. తెలంగాణ టిడిపి సీనియర్ నేత మస్కతి మృతి: చంద్రబాబు, నేతల నివాళి(పిక్చర్స్)
  2. "మాజీ శాసన సభ్యులు మస్కతి కన్నుమూత". Archived from the original on 2015-08-26. Retrieved 2015-08-25.
  3. "టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్సీ అల్లీ మస్కతి కన్నుమూత". Archived from the original on 2016-03-05. Retrieved 2015-08-25.

ఇతర లింకులు మార్చు