కడలెకాయి పరిశే (కన్నడ: ಕಡಲೆಕಾಯಿ ಪರಿಶೆ), సంవత్సరానికి ఒక సారి బెంగుళూరులో జరుపుకునే వేరుశనగకాయల సంత. ఈ రెండు రోజుల సంత బసవన్గుడి లోని దొడ్డ గణపతి ఆలయం వద్ద జరుగుతుంది. వేరుశనగలే కాకుండా ఈ సంతలో గాజులు, సాంప్రదాయ బొమ్మలు, మట్టి వస్తువులు, ప్లాస్టిక్ గాజుతో చేసిన బొమ్మలు, గోరింటాకు పెట్టే అంగళ్ళు ఉంటాయి. బజ్జీ, బోండా, పంచదార చిలకలు, చక్కరతో చేసిన కొన్ని మిఠాయిలు, రంగు రంగు సోడా నీళ్ళు అమ్ముతారు. ఈ సంతని ప్లాస్టిక్ రహితంగా పర్యావరణానికి హాని కలగకుండా ఉండటం కోసం 2015లో బీఎంఎస్ కళాశాల విద్యార్థులు 50,000 వస్త్రపు సంచులని అమ్మకపుదారులకి పంచారు.

పేరు వెనుక కథ

మార్చు

కడలెకాయి పరిశే, కన్నడ భాష పదం, దీనర్ధం వేరుశనగకాయల సంత అని వస్తుంది.[1]

చరిత్ర

మార్చు

ఒకప్పుడు బసవన్గుడి ప్రాంతం సుంకేనహళ్ళి, గుట్టహళ్ళి, మావళి, దాసరహళ్లి ఇంకా ఇతర గ్రామాల మధ్య ఉండేది. ఈ అన్ని ఊర్లలోనూ వేరుశనగ ప్రధాన పంట. ప్రతి పొర్ణమి నాడు ఒక ఎద్దు ఈ పంట పొలాల్లోకి చొరబడి పంటకు నష్టం కలిగించేది. రైతులంతా కలిసి బసవ (శివుడి వాహనమైన నంది) ని ప్రార్థించి, పూజలు చేసి వారి తోలి కోతను సమర్పిస్తామని మొక్కుకున్నారు. కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో ఒక నంది విగ్రహం బయట పడింది. ఆ విగ్రహం పెరుగుతూ ఉంటే రైతులు దాని తలపై ఒక మేకును గుచ్చారు, అక్కడితో ఆ విగ్రహం పెరగటం ఆగిపోయింది. ఈనాటికీ ఆ మేకు త్రిశూలం ఆకారంలో నంది విగ్రహం పై కనిపిస్తుంది. తరువాత 1537లో కెంపెగౌడ దొడ్డ బసవకి ఒక గుడి కట్టి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ గుడిని ఎద్దు గుడి అంటారు. అప్పటి నుండి ప్రతి ఏడాది రైతులు తమ తొలి పంటను ఇక్కడకు తెచ్చి సమర్పించుకుంటారు. ఆ పూజ జరిగే సమయంలోనే సంత కూడా జరుగుతుంది.

బయటి లంకెలు

మార్చు

వేరుశనగ పండగ : http://bangalore.citizenmatters.in/articles/view/52-arts-and-culture-heritage-fun-in-a-nutshell-kadlekai-parishe

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-26. Retrieved 2015-02-11.