కదిరి పురపాలక సంఘం

కదిరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం హిందూపురం లోకసభ నియోజకవర్గంలోని, కదిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

కదిరి పురపాలక సంఘం
కదిరి
స్థాపన1964
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
కదిరి
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

కదిరి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 474 కి.మీ దూరంలో ఉంది.1964 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 36 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 1999 లో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్చబడింది.కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు కు పేరుగాంచినది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 89,429 జనాభా ఉండగా అందులో పురుషులు 44,375, మహిళలు 45,054 మంది ఉన్నారు.అక్షరాస్యత 70.57% ఉండగా అందులో పురుష జనాభాలో 79.40% ,స్త్రీ జనాభాలో 61.96% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 10,096 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 20,781 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్సవరించు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా యస్.సురయ భాను పనిచేస్తుంది.[2]వైస్ చైర్మన్‌గా జి.వసంత పనిచేస్తుంది.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

  • లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
  • వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం
  • మరకత మహాలక్ష్మి దేవాలయం

ఇతర వివరాలుసవరించు

ఈ పురపాలక సంఘం 25.88 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,36 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలో 42696 జనాభా ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,32 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "Kadiri Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-30.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలుసవరించు