కే.కే. మహేందర్ రెడ్డి

కోండం కర్ణ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[2][3]

కే.కే. మహేందర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1961
నామాపూర్, ముస్తాబద్ మండలం, రాజన్న జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కే నారాయణ రెడ్డి

రాజకీయ జీవితం మార్చు

కే.కే. మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో సిరిసిల్ల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ పై 171 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఆగష్టు 4న పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2010లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ చేతిలో ఓడిపోయాడు.

కే.కే. మహేందర్ రెడ్డి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2011లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2018, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

 

మూలాలు మార్చు

  1. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (17 November 2023). "కేటీఆర్‌-హరీశ్‌ మెజారిటీ పోటీ". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.