కోనేరు రంగారావు

కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి.

కోనేరు రంగారావు
కోనేరు రంగారావు

కోనేరు రంగారావు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి.

వ్యక్తిగత వివరాలు

జననం 1935,జూలై 26
కృష్ణాజిల్లా గూడవల్లి
మరణం మార్చి 15, 2010
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ
జీవిత భాగస్వామి కోనేరు అలీసమ్మ.
సంతానం ఇద్దరు కుమారులు , ఇద్దరు కుమార్తెలు.
మతం హిందూమతము
మార్చి 30, 2009నాటికి

కోనేరు రంగారావు, 1935, జూలై 26న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామములో జన్మించాడు.[1] ఈయన తండ్రి తాతయ్య. గూడవల్లి గ్రామానికి పంచాయితీ సర్పంచిగా రాజకీయ జీవితము ప్రారంభించిన రంగారావు సర్పంచిగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత కంకిపాడు నియోజకవర్గము నుండి శాసనసభకు ఎన్నికై, సామాజికాభివృద్ధి శాఖా మంత్రి అయ్యాడు. ఈయన పురపాలక శాఖ, దేవాదాయ శాఖ, సామాజికాభివృద్ధి శాఖలలో మంత్రిగా పనిచేశాడు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాములో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. రంగారావు తిరువూరు నియోజకవర్గము నుండి కూడా శాసనసభకు రెండు పర్యాయములు ఎన్నికైనాడు.

రంగారావు 2010 మార్చి 15 న మరణించాడు. ఆయన సతీమణి కోనేరు అలీసమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

కోనేరు రంగారావు కమిటీ మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూపంపిణీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే కోనేరు రంగారావు కమిటీ. ఈ కమిటీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2004 డిసెంబర్ 1 నాటి జీవో Ms.No.977, 2004 డిసెంబర్ 23 నాటి జీవో Ms.No.1091 ల ద్వారా ఏర్పరచింది.

మూలాలు మార్చు