కోమటినేనివారి పాలెం

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని గ్రామం

కోమటినేనివారి పాలెం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కోమటినేనివారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన రైతు నల్లూరి సాంబశివరావుకి, ఒక అరుదైన అవకాశం లభించింది. ఇతనిని భారత ప్రభుత్వ ప్రత్తి అడ్వైజరీ బోర్డు సభ్యులుగా నియమించుచూ, భారత ప్రభుత్వ టెక్స్టైల్ కమిషనరు ఉత్తర్వులు జారీ చేసారు. ఇతను 2, జూలై-2014న ముంబైలో ప్రత్తిపంట పై విస్తృతంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునుటకు జరిగిన బోర్డు సమావేశంలో తొలిసారిగా పాల్గొన్నాడు. గతంలో వీరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా పనిచేసారు. ప్రతి సంవత్సరం వీరు 30 ఎకరాల వరకు ప్రత్తి సాగుచేయుచూ, మంచి దిగుబడులు సాధించుచూ, తోటిరైతులకు ఆదర్శంగా నిలుచుచున్నారు. ఈ నేపథ్యంలో వీరు, ముంబాయిలో జరిగే సమావేశంలో ప్రతి అంశం మీదా మాట్లాడి, విలువైన సలహాలు, సూచనలూ ఇచ్చేటందుకు సిద్ధమగుచున్నారు.[1]

మూలాలు మార్చు

  1. ఈనాడు గుంటూరు రూరల్; 2014,జులై-1; 11వ పేజీ.