గడికోట మోహన్ రెడ్డి

గడికోట మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2004లో లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

గడికోట మోహన్ రెడ్డి

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి
నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
సుద్దమల్ల, రామాపురం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా,ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
సంతానం గడికోట శ్రీకాంత్ రెడ్డి (కుమారుడు)

రాజకీయ జీవితం మార్చు

గడికోట మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1971 వరకు 1981 రెండు పర్యాయాలు సుద్దమల్ల గ్రామ సర్పంచ్‌గా, 1981 వరకు 1986 వరకు లక్కిరెడ్డిపల్లె సమితి అధ్యక్షుడిగా పనిచేసి, 1989, 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (8 February 2021). "ఒకే గ్రామం, ఒకే కుటుంబం, నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.