ఆంధ్రప్రదేశ్ శాసనసభ
తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.[1] ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
---|---|
15 వ శాసనసభ (నవ్యాంధ్ర 2వ శాసనసభ) | |
రకం | |
రకం | |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకర్ | |
నిర్మాణం | |
సీట్లు | 175 |
![]() | |
శాసనసభ రాజకీయ వర్గాలు | YSRC: 151 seats TDP: 23 seats JSP: 1 seat |
ఎన్నికలు | |
శాసనసభ ఓటింగ్ విధానం | First past the post |
శాసనసభ చివరి ఎన్నికలు | 2019 |
సమావేశ స్థలం | |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అమరావతి | |
వెబ్సైటు | |
http://www.aplegislature.org |

చరిత్ర సవరించు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ తెలుపు భవనం ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు [1]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు సవరించు
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | రాజకీయ పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | అయ్యదేవర కాళేశ్వరరావు | 1956 | 1962 | కాంగ్రెస్ | ||
2 | బి. వి. సుబ్బారెడ్డి | 1962 | 1970 | కాంగ్రెస్ | ||
3 | జి. నారాయణ రావు | కాంగ్రెస్ | ||||
4 | దీవి కొండయ్య చౌదరి | కాంగ్రెస్ | ||||
5 | కోన ప్రభాకరరావు | 1980 | 1981 | కాంగ్రెస్ | ||
6 | తంగి సత్యనారాయణ | 1983 | 1985 | తె.దే.పా | ||
7 | డి. శ్రీపాదరావు | 1991 | 1995 | కాంగ్రెస్ | ||
8 | యనమల రామకృష్ణుడు | 1995 | 1999 | తె.దే.పా | ||
9 | కె. ప్రతిభా భారతి | 1999 | 2004 | తె.దే.పా | ||
10 | కె. ఆర్. సురేష్ రెడ్డి | 2004 | 2009 | కాంగ్రెస్ | ||
11 | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | 2009 | 2010 | కాంగ్రెస్ | ||
12 | నాదెండ్ల మనోహర్ | 2011 | 2014 | కాంగ్రెస్ |
నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు సవరించు
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | రాజకీయ పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | కోడెల శివప్రసాద్ | 2014 | 2019 | తె.దే.పా | ||
2 | తమ్మినేని సీతారాం | 2019 | ప్రస్తుతం | వై.ఎస్.ఆర్.సి.పి |
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ "ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షా.. అనబోయేది రేపే". సమయం. 5 Mar 2017. Archived from the original on 30 June 2017. Retrieved 11 June 2019.