గోండ్వానా (భారతదేశం)

గోండ్వానా అనేది భారతదేశంలోని ఒక ప్రాంతం. అక్కడ నివసించే గోండు ప్రజల పేరిట ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. అయితే వారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తారు. పురాతన ఖండమైన గోండ్వానాలాండ్‌కు ఆ పేరు ఈ గోండ్వానా నుండే వచ్చింది. ఎందుకంటే ఆ పురాతన ఖండానికి చెందిన కొన్ని తొలి రాతి నిర్మాణాలు ఈ ప్రాంతానికి చెందిన ఆధునిక ఒడిషా లోనే మొదట కనిపించాయి.

గోండ్వానా
—  ప్రతిపాదిత రాష్ట్రం  —
దేశం భారతదేశం
ప్రాంతం మధ్య భారతదేశం
ప్రతిపాదిత రాజధాని నాగపూర్
ప్రతిపాదిత డివిజన్లు
List
భాష గోండి
గోండ్వానా

గోండు ప్రజలు మధ్య భారతదేశం అంతటా విస్తృతంగా వ్యాపించి ఉన్నారు. దాదాపు అన్ని చోట్లా వీరు మైనారిటీగానే ఉన్నారు. ఈ ప్రాంతానికి స్పష్టమైన సరిహద్దు లేదు. అయితే, మహారాష్ట్రలోని విదర్భకు తూర్పు భాగం, గార్హా రాజ్యం, దానికి ఉత్తరంగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని భాగాలు, పశ్చిమ ఛత్తీస్‌గఢ్‌ లోని కొన్ని ప్రాంతాలను గోండ్వానాలో ప్రధానమైన భాగంగా పరిగణించవచ్చు. మరింత విస్తృత ప్రాంతంలో ఉత్తర తెలంగాణ, పశ్చిమ ఒడిషా, దక్షిణ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలనూ కలపవచ్చు.

ఈ ప్రాంతం ఉత్తర దక్కన్ పీఠభూమిలో భాగం. సముద్ర మట్టం నుండి దీని సగటు ఎత్తు 600 – 700 మీటర్లు. ఇందులో ఎక్కువ భాగం కఠినమైన, కొండలతో కూడుకుని ఉంటుంది. భౌగోళికంగా ఇందులో చాలావరకు ప్రీ-కేంబ్రియన్ శిలలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పెర్మియన్, ట్రయాసిక్ కాలానికి చెందినవి ఉంటాయి. దానిలో కొంత భాగం ఒండ్రుమట్టితో కప్పబడి ఉంటుంది. పశ్చిమాన డెక్కన్ ట్రాప్స్ కు చెందిన అగ్నిశిలలతో కప్పబడి ఉంటుంది.

వాతావరణం వేడిగా, పాక్షికంగా పొడిగా ఉంటుంది. ఇక్కడీ సహజ వృక్షసంపదలో పొడి రుతుపవనాల అడవులు లేదా రుతుపవనాల అడవి ఉంటాయి. దానిలో ఎక్కువ భాగం ఇప్పటికీ అటవీప్రాంతమే. ఇందులో పులులతో సహా అనేక జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి.

గోండ్వానాలో భారతదేశంలోని "షెడ్యూల్డ్ తెగల" ప్రజలు సాపేక్షంగా అధిక సంఖ్యలో ఉన్నారు, ఇందులో గోండులు కూడా ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తింపు పొందారు. అనేక జిల్లాలలో వారు మెజారిటీగా ఉన్నారు.

గోండులు హిందూ మతంపై ఆధారపడిన మతాన్ని అనుసరిస్తారు. [1]

గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశంలోని రాయగఢ్ - హజ్రత్ నిజాముద్దీన్ ల మధ్య నడుస్తుంది. ఇది వారంలో 5 రోజులు నడుస్తుంది.

గోండ్వానా రాజ్యపు మ్యాప్ మార్చు

గోండ్వానా రాష్ట్ర చిహ్నం మార్చు

దక్షిణాసియాలో ఒక సహస్రాబ్దికి పైగా, విజయవంతమైన సింహం ఏనుగులను మర్దిస్తున్న దృశ్యం వాస్తు శిల్పంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మూలాంశం పట్ల అందుబాటులో ఉన్న జ్ఞానంపై ఆధారపడి, విభిన్న వివరణలు ఉన్నాయి. కాలక్రమంలో దాని ఉనికి చాలా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో అనేక చిన్న వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ఆ మార్పుల్లో వ్యాలాలు లేదా యాలీలు అంటూ వర్ణించబడిన సింహాల ఉపయోగం, ఆ పోరాటాలలో మకరాలను చేర్చడం వంటివి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో, శరభ అని పిలువబడే అద్భుతమైన మిశ్రమ జంతువు గాథ ఈ చిత్రాలను మరింత ముందుకు తీసుకువెళుతుంది. అయినప్పటికీ, ఏనుగులపై విజయం సాధిస్తున్న సింహపు చిత్రం నిర్దిష్ట కాలాలు ప్రదేశాల్లో నిర్దిష్ట నిర్మాణ కార్యక్రమాలలో చాలా వ్యూహాత్మకంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు, గోండ్వానా కింగ్‌డమ్ కోటలు, పదిహేనవ, పదిహేడవ శతాబ్దాల మధ్య నిర్మించిన దక్కనీ కోటల ముఖద్వారాలపై ఈ చిత్రాన్ని చూడవచ్చు.

మూలాలు మార్చు

  1. Mehta, Behram H. (1984). "Gonds of the Central Indian Highlands".

వనరులు మార్చు