గోమతి జిల్లా

త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా.

గోమతి జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఉదయ్‌పూర్ దీని ముఖ్య పట్టణం. ఈ జిల్లాలోని మాతా త్రిపుర సుందరి ఆలయం ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఉదయ్‌పూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతాబారి వద్ద ఈ దేవాలయం ఉంది. భారతదేశంలోని 51 మహాపీఠాలలో ఈ ఆలయం ఒకటి. త్రిపుర దేశీయ జానపద కథలు, సంస్కృతి, మతపరమైన ఆచారాలకు సంబంధించిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి.

గోమతి జిల్లా
త్రిపుర జిల్లా
త్రిపురేశ్వరి (త్రిపుర సుందరి) ఆలయం
త్రిపురేశ్వరి (త్రిపుర సుందరి) ఆలయం
త్రిపుర రాష్ట్ర పటం
త్రిపుర రాష్ట్ర పటం
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
ఏర్పాటు2012 జనవరి (2012-01)
ముఖ్య పట్టణంఉదయ్‌పూర్
Area
 • మొత్తం1,522.8 km2 (588.0 sq mi)
Population
 (2011)
 • మొత్తం4,41,538
జనాభా
 • అక్షరాస్యత100% [1]
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

భౌగోళికం మార్చు

పచ్చని, సారవంతమైన గోమతి లోయలతో ఈ గోమతి జిల్లా ఉంది. జిల్లాలోని ఉదయ్‌పూర్, అమర్‌పూర్ ఉపవిభాగాల చుట్టూ కొండలపై చెక్కబడిన సున్నితమైన శిల్పకళా రచనలతో అత్యున్నత డెబ్టమురా కొండ శ్రేణి ఉంది.[2] జిల్లాలో ఒకేఒక మున్సిపాలిటీ (ఉదయ్‌పూర్ మున్సిపాలిటీ) ఉంది. ఈ జిల్లా పరిధిలో 173 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 16 పోలీస్ స్టేషన్లు సేవలు అందిస్తున్నాయి.

విభాగాలు మార్చు

గోమతి జిల్లాలో ఉదయ్‌పూర్ ఉపవిభాగం, అమర్పూర్ ఉపవిభాగం, కార్బుక్ ఉపవిభాగం అనే 3 ఉపవిభాగాలు ఉన్నాయి. గోమతి జిల్లా పరిధిలో మాతాబారి, టెపానియా, కిల్లా, కాక్రాబన్, అమర్‌పూర్, ఓంపి, కార్బుక్, సిలాచారి అనే 8 బ్లాక్‌లు ఉన్నాయి.[3]

పర్యాటక ప్రదేశాలు మార్చు

గోమతి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు[4]:-

  1. త్రిపురేశ్వరి మందిర్: జిల్లాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ ఆలయాన్ని 1501లో మహారాజా ధన్య మణిక నిర్మించాడు.
  2. భువనేశ్వరి ఆలయం: భువనేశ్వరి దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో మహారాజా గోవింద మాణిక్య నిర్మించాడు.[5] గోమతి నది పక్కన ఉన్న ఈ ఆలయం, శిథిలావస్థలో ఉన్న పాత రాజభవనానికి దగ్గరగా ఉంది.
  3. పాత రాజ్‌బరి: కవిగురువు రవీంద్రనాధ టాగూరు ఈ స్థలాన్ని సందర్శించాడు. ఉదయ్‌పూర్ రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు ఈ రాజ్‌బరి నిర్మించారు.
  4. గుణబతి ఆలయం: దీనిని గుణబతి మందిర్ గుచ్చా అని పిలుస్తారు. ఇది మూడు దేవాలయాల సమూహంగా ఉంది. ఇందులోని ఒక ఆలయపు రాతి-శాసనం సా.శ. 1668లో హైనెస్ మహారాణి గుణబతి (మహారాజా గోవింద మణిక భార్య) పేరిట నిర్మించబడిందని తెలుపుతుంది.
  5. చోబిమురా: గోవి నది ఒడ్డున రాతిలో చెక్కిన దేవి దుర్గా, ఇతర దేవతల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
  6. టెపానియా ఎకో పార్క్: 8వ జాతీయ రహదారి వైపు ఈ పార్కు ఉంది. ఇక్కడ పచ్చని అడవి, ఒక చెట్టు ఇల్లు ఉంది.
  7. తీర్థ్ముఖ్: ఈ జిల్లాలో అమర్‌పూర్ ఉపవిభాగంలో ఈ తీర్థయాత్ర కేంద్రం ఉంది.

రవాణా మార్చు

రోడ్డుమార్గం మార్చు

అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతుంది.[6]

రైలుమార్గం మార్చు

ఈశాన్య సరిహద్దు రైల్వేకు చెందిన లమ్డింగ్-సబ్రూమ్ రైలు మార్గం సిపాహీజాల జిల్లా గుండా వెళుతోంది.[7][8] ఈ జిల్లాలో ఉదయ్‌పూర్ త్రిపుర రైల్వే స్టేషను, గార్జీ రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు ఇక్కడినుండి రైల్వే సౌకర్యం ఉంది.[9]

మూలాలు మార్చు

  1. "Gomati district website".
  2. "Gomati district website".
  3. "Gomati district subdivision and blocks".
  4. "Tourism in Gomati district".
  5. "Bhuvaneswari temple".
  6. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 30 December 2020.
  7. First Commercial Broad Gauge Freight Train Arrives In Tripura
  8. BG railhead reaches Udaipur amid cheers Archived 2016-03-21 at the Wayback Machine
  9. "Indian Rail Info".

ఇతర లంకెలు మార్చు