చండూరు (చండూరు మండలం)
చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.[2] 1956లో చండూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
చండూరు | |
---|---|
నిర్దేశాంకాలు: 16°59′N 79°04′E / 16.98°N 79.06°ECoordinates: 16°59′N 79°04′E / 16.98°N 79.06°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 484 మీ (1,588 అ.) |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 10,762 |
భాష | |
• అధికారక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ISO 3166 కోడ్ | IN-TG |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | TS |
జాలస్థలి | telangana |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలోసవరించు
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]
ప్రముఖులుసవరించు
ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[5]
అభివృద్ధి పనులుసవరించు
2022 జనవరి 6న తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ గ్రామాన్ని సందర్శించి పట్టణంలో రెండు వరుసల ప్రధాన రహదారి (30 కోట్లు), పట్టణంలో సీసీ రహదారులు-మురుగుకాల్వలు (5.5 కోట్లు), సమీకృత వెజ్ - నాన్వెజ్ మార్కెట్ (2 కోట్లు), షాపింగ్ కాంప్లెక్స్ (50 లక్షలు), నూతన పురపాలిక భవనం (2 కోట్లు) లకు శంకుస్థాపనలు చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రి జి. జగదీశ్రెడ్డి, ఎంపీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]
మూలాలుసవరించు
- ↑ "District Census Handbook - Nalgonda" (PDF). Census of India. p. 13,398. Retrieved 15 February 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Basic Information of Municipality, Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 9 April 2021.
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మరుగున పడిన మన రచయితలు". Retrieved 2018-05-01.
- ↑ telugu, NT News (2023-01-06). "హుజూర్నగర్లో ఈఎస్ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-14.
- ↑ "మూడేళ్లలో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి: కేటీఆర్". EENADU. 2023-01-07. Archived from the original on 2023-01-07. Retrieved 2023-01-14.