మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం
నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా తాజాగా గట్టుప్పల్ మండలంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 6 మండలాలుగా కొనసాగుతుంది. 6 మండలాలు కాదు 7 మండలాలు. చౌటుప్పల్,నారాయణపురం,మునుగోడు,నాంపల్లి,చండూరు,మర్రిగూడ, గట్టుప్పల్,
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు సవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు సవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2022 | (ఉపఎన్నిక) | మునుగోడు | జనరల్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | పు | టీఆర్ఎస్ | 97,006 | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | పు | బీజేపీ | 86,697 |
2018 | 93 | మునుగోడు | జనరల్ | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | పు | కాంగ్రెసు | 97239 | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | పు | తెరాస | 74687 |
2014 | 93 | మునుగోడు | జనరల్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | పు | TRS | 65496 | పాల్వాయి స్రవంతి | స్త్రీ | IND | 27441 |
2009 | 93 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని యాదగిరిరావు | పు | CPI | 57383 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 53789 |
2004 | 293 | మునుగోడు | జనరల్ | పల్లా వెంకట్ రెడ్డి | పు | CPI | 55252 | చిలువేరు కాశీనాథ్ | పు | తె.దే.పా | 43967 |
1999 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 45134 | మార్కండేయ జెల్ల | పు | తె.దే.పా | 41095 |
1994 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 55209 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | IND | 23655 |
1989 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 51445 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 43183 |
1985 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 44733 | పుంగల నారాయణరావు | పు | INC | 23950 |
1983 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 30084 | బొమ్మగాని ధర్మభిక్షం | పు | CPI | 19773 |
1978 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 31635 | కంచర్ల రామకృష్ణారెడ్డి | పు | JNP | 18004 |
1972 | 286 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 24995 | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 16266 |
1967 | 286 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 26204 | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 10582 |
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిలువెరు కాశీనాథ్పై 11285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకటరెడ్డి 55252 ఓట్లు పొందగా, కాశీనాథ్ 43967 ఓట్లు సాధించాడు.
2022 ఉప ఎన్నిక సవరించు
మునుగోడు ఎమ్మెల్యేగా లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 7న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, అక్టోబర్ 14 చివరి తేదీగా, నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 15వ తేదీని గడువు ప్రకటించింది.[1] నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఇవ్వగా, ఈ ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, 47 మంది నామినేషన్లు తిరస్కరించబడగా మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 47 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు.[2] మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నవంబర్ 1న ముగిసింది.[3]
మునుగోడు నియోజకవర్గంలో 2022 ఉప ఎన్నిక నాటికీ మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.[4] మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3న జరగగా 93.13 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, 686 పోస్టల్ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.[5] నవంబర్ 6న జరిగిన కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[6][7]
ప్రధాన పార్టీ అభ్యర్థులు సవరించు
- టీఆర్ఎస్ - కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- బీజేపీ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్ - పాల్వాయి స్రవంతి రెడ్డి
- బీఎస్పీ - ఆందోజు శంకరాచారి
- టీజేఎస్ - పల్లె వినయ్కుమార్ గౌడ్[8]
ఉప ఎన్నిక 2022: మునుగోడు | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ||
టీఆర్ఎస్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | 97,006 | 42.95 | ||
బీజేపీ | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | 86,697 | 38.38 | ||
కాంగ్రెస్ | పాల్వాయి స్రవంతి రెడ్డి | 23,906 | 10.58 | ||
నోటా | పైవేవీ కాదు | 482 | 0.21 | ||
మెజారిటీ | 10309 | ||||
పోలింగ్ శాతం | |||||
నమోదైన ఓటర్లు | 2,41,805 | ||||
పోలైన ఓట్లు | 2,25,192[9] | ||||
బీజేపీ పై టీఆర్ఎస్ గెలిచింది[10] |
మూలాలు సవరించు
- ↑ "మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదే : మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదే." 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు". 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే." 1 November 2022. Retrieved 1 November 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Namasthe Telangana (2 November 2022). "మునుగోడు ఉపఎన్నిక.. పోలింగ్కు సర్వంసిద్ధం". Archived from the original on 2 November 2022. Retrieved 2 November 2022.
- ↑ Eenadu (4 November 2022). "ఓటుకు పోటెత్తారు". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
- ↑ 10TV Telugu (6 November 2022). "'మునుగోడు'లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ Andhra Jyothy (7 November 2022). "గెలవడమే పదివేలు". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ Andhra Jyothy (18 October 2022). "చిన్న పార్టీలతో పెద్ద సవాల్!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Election Commission of India". 7 November 2022. Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ "Munugode bypoll: తెరాస విజయహాసం". EENADU. 2022-11-07. Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.