జమ్మలమడుగు పిచ్చయ్య

జమ్మలమడుగు పిచ్చయ్య (డిసెంబరు 21, 1918 - డిసెంబరు 26, 2021)[1] తొలి తరం బాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు. ఈ క్రీడలో గెలుచుకున్న తొలి అర్జున అవార్డు గ్రహీత ఇతనే.[2]

జమ్మలమడుగు పిచ్చయ్య
దస్త్రం:Jammalamadugu Pichaiah.jpg
జననంజమ్మలమడక పిచ్చయ్య
(1918-12-21)1918 డిసెంబరు 21
India కూచిపుడి గ్రామం, కృష్జా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం26 డిసెంబరు 2021
వరంగల్
నివాస ప్రాంతందేశాయిపేట, వరంగల్‌ జిల్లా , తెలంగాణ
ఇతర పేర్లుజె. పిచ్చయ్య, జమ్మలమడక పిచ్చయ్య, అర్జున పిచ్చయ్య
ప్రసిద్ధిబాల్‌ బాడ్మింటన్‌ క్రీడాకారుడు
మతంహిందూ
భార్య / భర్తసత్యవతి
పిల్లలుసుశీల, జానకిదేవి
తండ్రిపున్నయ్య
తల్లినాగమ్మ

జననం మార్చు

ఈయన 1918, డిసెంబరు 21న కృష్జా జిల్లాలోని కూచిపుడి గ్రామంలో నాగమ్మ, పున్నయ్య దంపతులకు ఏడుగురు సంతానంలో మూడో వాడిగా జన్మించాడు.[3]

క్రీడా ప్రస్థానం మార్చు

ఈయన పదోతరగతి తప్పడంతో ధ్యాసంతా క్రీడలపై మళ్ళింది. ఈ క్రమంలో బందరు పట్టణంలో మినర్వ క్లబ్‌, మోహన్‌ క్లబ్‌లలో బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆడడం అలవాటు చేసుకున్నాడు. 1935-36లో నర్సారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచాడు. 1947-48లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. 1950 దశకంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ క్రీడల్లో పాల్గొనలేకపోయాడు కాని 1954-55లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 1956, 1957 సంవత్సరంలో మద్రాస్‌, పాండిచ్చేరి రాష్ట్రాలలో జరిగిన జాతీయ పోటీల్లో జట్టు కెప్టెన్‌గా వహించి గెలుపొందారు, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వహించి 9 ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించాడు.[4]

పురస్కారాలు మార్చు

భారత బాల్ బాడ్మింటన్‌ క్రీడా రంగానికి ఇతను చేసిన సేవలకు 1970లో అర్జున అవార్డును ప్రకటించింది. కాని 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా ఆ సంవత్సరంలో ఈ అవార్డును అందుకోలేకపోయాడు. 1972లో అప్పటి భారత రాష్ట్రపతి ఐన వి.వి గిరి గారి చేతుల మీదుగా దిల్లీలో ఈ అవార్డును స్వీకరించాడు.

మరణం మార్చు

104 ఏళ్ల వయసులో డిసెంబరు 26, 2021న వరంగల్ లో అనారోగ్యంతో బాధపడుతూ జమ్మలమడుగు పిచ్చయ్య తుది శ్వాస విడిచారు.[1][5] ఈయన భార్య సత్యవతి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు సుశీల, జానకిదేవి ఉన్నారు. ఈయన భార్య సత్యవతి 2007లో మృతి చెందారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "జమ్మలమడక పిచ్చయ్య: బాల్ బ్యాడ్మింటన్ తెలుగు తేజం 104వ ఏట అస్తమయం". BBC News తెలుగు. Retrieved 2021-12-26.
  2. "101 ఏళ్ల అర్జునుడు". 2018-12-21. Archived from the original on 2018-12-21. Retrieved 2018-12-21.
  3. "జమ్మలమడుగు పిచ్చయ్య". 2018-12-21.
  4. "గతం ఘనం.. నేడు దైన్యం". ఆగస్టు 24, 2014.[permanent dead link]
  5. Pavan (2021-12-26). "KTR writes to Bandi Sanjay over unemployment Deeksha, asks how many vacancies did centre fill". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.