జానంపల్లి కుముదినీ దేవి
రాణీ కుముదినీ దేవి (జనవరి 23, 1911 - 2009) గా ప్రసిద్ధి చెందిన జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక.[1][2]
జానంపల్లి కుముదినీ దేవి | |
---|---|
జననం | జానంపల్లి కుముదినీ దేవి జనవరి 23, 1911 వరంగల్లు జిల్లా, వాడపల్లి |
మరణం | 2009 |
ఇతర పేర్లు | జానంపల్లి కుముదినీ దేవి |
ప్రసిద్ధి | వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | రామ దేవ రావు |
తండ్రి | పింగళి వెంకటరమణారెడ్డి |
జననం మార్చు
వరంగల్లు జిల్లా, వాడపల్లికి (వడ్డెపల్లి) చెందిన జమీందారీ వంశంలో కుముదినీ దేవి 1911 జనవరి 23న వాడపల్లిలో(వడ్డెపల్లి) జన్మించింది. ఈమె తండ్రి పింగళి వెంకట రామా రెడ్డి హైదరాబాదు రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశాడు[3]. కుముదినీ దేవికి 1928 లో వనపర్తి రాజా రామదేవరావుతో వివాహమైంది.[4]
కుముదినీ దేవి శివానంద స్వామిచే ప్రభావితురాలై హైదరాబాదు కూకట్పల్లిలో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958 లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “ సేవాసమాజ బాలికా నిలయం ” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది.
మరణం మార్చు
ఈమె 2009లో తన 98 వ ఏట మరణించింది.
మూలాలు మార్చు
- ↑ Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Correspondent, Special (2020-11-20). "Feisty and kind: the first woman mayor of Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-15.
- ↑ A life less ordinary - The Hindu March 22, 2011