జార్ఖండ్ డిసోమ్ పార్టీ

భారతదేశంలోని రాజకీయ పార్టీ

జార్ఖండ్ డిసోమ్ పార్టీ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. ఈ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సల్ఖాన్ ముర్ము 2002లో స్థాపించాడు. ఆదివాసీల హక్కుల కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. ఉదాహరణకు, ఆదివాసీలకు ఎక్కువ కోటాలు, రిజర్వేషన్ల కోసం పార్టీ పనిచేస్తుంది.

2003లో, జార్ఖండ్ డిసోమ్ పార్టీ జార్ఖండ్ పీపుల్స్ పార్టీ, జార్ఖండ్ పార్టీ (నరేన్), జార్ఖండ్ పార్టీ (హోరో), జార్ఖండ్ వికాస్ దళ్ అనే నాలుగు ఇతర పార్టీలతో కలిసి జార్ఖండ్ ఫ్రంట్‌ను ప్రారంభించింది.

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, జార్ఖండ్ డిసోమ్ పార్టీ పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు, బీహార్ నుండి ఇద్దరు, జార్ఖండ్ నుండి ఒక అభ్యర్ధులను నిలబెట్టింది.

మహారాష్ట్రలో ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేస్తున్న ఆందోళనలకు జార్ఖండ్ డిసోమ్ పార్టీ మద్దతు ఇస్తుంది.[1]

2014 ఆగస్టులో, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సమక్షంలో సల్ఖాన్ ముర్ము తన జార్ఖండ్ డిసోమ్ పార్టీని బిజెపిలో విలీనం చేశాడు.[2][3][4][5]

మూలాలు

మార్చు
  1. "JDP supports Raj Thackeray". The Hindu. February 6, 2008. Retrieved 2008-12-07.
  2. Jharkhand Disom Party merges with BJP
  3. "Salkhan Murmu merges JDP into BJP". Archived from the original on 30 September 2019. Retrieved 4 June 2016.
  4. Jharkhand Disom Party merges with BJP
  5. Jharkhand Vikas Morcha to merge with BJP on August 20

బాహ్య లింకులు

మార్చు