టెరెన్స్ కీస్

1930-33 మధ్య హైదరాబాదులో బ్రిటిషు రెసిడెంటు

బ్రిగేడియర్-జనరల్ సర్ టెరెన్స్ హంఫ్రీ కీస్, KCIECSICMGFRGSFZS (28 మే 1877-26 ఫిబ్రవరి 1939) భారత సైన్యం లో, భారత రాజకీయ సేవలో పనిచేసిన బ్రిటిష్ అధికారి.[1][2]

సర్ టెరెన్స్ కీస్
జననం(1877-05-28)1877 మే 28
మరణం1939 ఫిబ్రవరి 26(1939-02-26) (వయసు 61)
హేస్టింగ్స్, ఈస్ట్ సస్సెక్స్
రాజభక్తియునైటెడ్ కింగ్డమ్
సేవలు/శాఖబ్రిటిషు భారత సైన్యం
సేవా కాలం1897–1932
ర్యాంకుబ్రిగేడియర్ జనరల్
పోరాటాలు / యుద్ధాలుతిరా దండయాత్ర
మొదటి ప్రపంచ యుద్ధం
రష్యన్ అంతర్యుద్ధం
పురస్కారాలునైట్స్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖెల్ అండ్ సెయింట్ జార్జ్
మెన్షన్ ఇన్ ది డిస్పాచెస్ (4)
ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ క్రౌన్ (రొమేనియా)
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆన్నా, మొదటి తరగతి (రష్యా)
ఆర్డర్ ఆఫ్ సెయింట్ స్టానిస్లాస్, మొదటి తరగతి (రష్యా)
ఆర్డర్ ఆఫ్ సెయింట్ వ్లాదిమీర్, 4వ తరగతి (రష్యా)

ప్రారంభ జీవితం

మార్చు

కీస్ 1877, మే 28న జన్మించాడు. ఈయన జనరల్ సర్ చార్లెస్ కీస్ కుమారుడు. అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ లార్డ్ కీస్ తమ్ముడు. గల్లిపోలి దండయాత్రలో విశిష్ట పాత్ర పోషించిన కమాండర్ అడ్రియన్ కీస్‌కు అన్నయ్య. ఈయన హెయిలీబరీ కళాశాల, ఆ తర్వాత శాంధర్స్ట్ లోని రాయల్ మిలిటరీ కళాశాలలో క్వీన్స్ ఇండియా క్యాడెట్‌గా చదువుకున్నాడు. అక్కడి నుండి ఈయన 1897 జనవరిలో భారత సైన్యంలో రెండవ లెఫ్టినెంట్ నియమించబడ్డాడు.

సైనిక వ్యాసంగం

మార్చు

కీస్, 1897-1898 లో కింగ్స్ ఓన్ స్కాటిష్ బోర్డర్స్ యొక్క 2వ బెటాలియన్ కు అనుబంధంగా ఉంటూ, తిరా దండయాత్రలో పాల్గొన్నాడు. అక్కడ 18 అక్టోబర్ 1897న జరిగిన చాగ్రు కోటల్ యుద్ధంలో చేతిలో ఒక చీలిక కారణంగా కొద్దిగా గాయపడ్డాడు. ఛాతీలో ఒక వాడిన బుల్లెట్ తగిలి గాయపడ్డాడు.[3] ఈ కార్యకలాపాల గురించి పంపిన లేఖలలో ఆయన ప్రస్తావించబడి, ఏప్రిల్ 1899లో లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు.[4][5] 1900లో ఆయన సెంట్రల్ ప్రావిన్సులలో కరువు ఉపశమన కార్యక్రమాల్లో పనిచేస్తున్న దళాలతో పనిచేశాడు.

అక్టోబరు 1904లో, ఈయన పర్షియాలోని సిస్తాన్, కైన్లకు వైస్ కాన్సుల్గా నియమితుడై తన తొలి రాజకీయ ఉద్యోగాన్ని పొందాడు. జనవరి 1906 లో కెప్టెన్ గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో పర్షియాలోని తుర్బతే హైదరి, కరేజ్ కు కౌన్సుల్ అయ్యాడు. 1908లో బలూచిస్తాన్ దండయాత్రలో పాల్గొన్నాడు. 1914లో బహ్రెయిన్లో రాజకీయ ఏజెంట్ గా నియమించబడ్డాడు. కీస్ 1915లో మేజర్ గా పదోన్నతి పొంది, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెసొపొటేమియా పోరాటంలో పనిచేశారు. 1916లో, అతను మెక్రాన్ రాయబార కార్యాలయానికి నాయకత్వం వహించాడు. దీని ఫలితంగా ఈయన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE) గా 1917 జూన్ లో సత్కరించబడ్డాడు. 1917 లో ఈయన రొమేనియాలో రష్యన్ సైన్యంతో అనుబంధితుడిగా చేరాడు. 1918 జనవరి లో తాత్కాలిక లెఫ్టినెంట్-కల్నల్గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం జూన్లో బ్రెవెట్ లెఫ్టినెంటల్-కల్నల్‌గా పదోన్నతి పొందాడు. ఆ తరువాతి రెండు సంవత్సరాలు, ఈయన రష్యన్ విప్లవం సమయంలో రష్యాలో "ప్రత్యేక విధి" లో పనిచేశాడు. ఈయన 1919-1920 లలో రష్యన్ అంతర్యుద్ధంలో కూడా పనిచేశాడు. 1919 డిసెంబర్ నుండి 1920 జూన్ వరకు సౌత్ రష్యా, నల్ల సముద్రపు సైన్యం యొక్క బ్రిగేడియర్-జనరల్ జనరల్ స్టాఫ్‌గా పనిచేశాడు. అదే సమయంలో ఈయన యుద్ధ లేఖల్లో మూడు సార్లు ప్రస్తావించబడ్డాడు. 1919 నవంబర్లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ (సి.ఎం.జి) గా సత్కరించబడ్డాడు. 1919 నుండి 1920 వరకు, ఈయన దక్షిణ రష్యాలో డిప్యూటీ హైకమిషనర్‌గాను, యాక్టింగ్ హైకమిషనర్‌గానూ పనిచేశాడు. తను చేసిన యుద్ధ సేవకుగాను ఈయన అనేక విదేశీ యుద్ధ పురస్కారాలను కూడా అందుకున్నాడు. అవి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది క్రౌన్ ఆఫ్ రొమేనియా విత్ స్వోర్డ్స్, రష్యన్ పురస్కారాలైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ అన్నా , మొదటి తరగతి, ఆర్డర్ ఆఫ్ సెయింట్ స్టానిస్లాస్, మొదటి తరగతి, ఆర్డర్ ఆఫ్ సెయింట్ వ్లాదిమిర్ విత్ స్వోర్డ్స్ 4 వ తరగతి.

యుద్ధం తరువాత కీస్ భారతదేశానికి తిరిగి వచ్చి, 1921 నుండి 1928 వరకు మళ్లీ బలూచిస్తాన్లో పనిచేశాడు. ఈ సేవకు గాను ఈయనకు 1928లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) గా నియమించి సత్కరించబడ్డాడు. 1923 జనవరి లో లెఫ్టినెంట్-కల్నల్గా పదోన్నతి పొందారు.[6] 1928లో నేపాల్ రాజు ఆస్థానంలో బ్రిటిష్ రాయబారిగా నియమితుడయ్యాడు. 1928 నుండి 1929 వరకు గ్వాలియర్ సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్ గా పనిచేశాడు. 1929లో పశ్చిమ భారతదేశంలోని సంస్థానాలలో గవర్నర్ జనరల్ ఏజెంట్‌గా ఉన్నాడు. 1930 నుండి 1933 వరకు హైదరాబాదు రాజ్యంలో బ్రిటీషు రెసిడెంటుగా ఉన్నాడు. వేణు గోపాల్ పిళ్ళై స్థాపించిన, వివిధ ఇళ్ళలో తరగతులను నిర్వహిస్తున్న పాఠశాలకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయడానికి దివాన్ పద్మరావు ముదలియార్ భూమిని పొందడంలో సహాయపడినందున, సికింద్రాబాద్లోని కీస్ బాలికల ఉన్నత పాఠశాలకు ఆయన పేరు పెట్టారు. ఈయన 1932 మే లో బ్రిగేడియర్-జనరల్ గౌరవ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ పొందాడు. ఆ తరువాత సంవత్సరం సస్సెక్స్ నిన్ఫీల్డ్ సమీపంలోని ఫ్రీజ్లాండ్ ఫార్మ్‌లో నివసించడానికి ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళాడు.[7] 1933 న్యూ ఇయర్ హానర్స్‌లో భాగంగా, ఐపిఎస్ నుండి పదవీ విరమణ చేయడానికి కొంతకాలం ముందు అతను నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (కెసిఐఇ) గా నియమించబడ్డాడు.[8]

వ్యక్తిగత జీవితం

మార్చు

టెరెన్స్ కీస్, లెఫ్టినెంట్ జనరల్ సి. ఎ. మెక్ మహోన్ కుమార్తె, ఈడిత్ బియాట్రీస్ మెక్ మహోన్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, రాజర్ (అతను ప్రసిద్ధ బిబిసి పాత్రికేయుడు అయ్యాడు) పాట్రిక్, మైఖేల్. ఇద్దరు కుమార్తెలు - రోజ్ మేరి, లావెండర్. కీస్ ఒక నిబద్ధత కలిగిన క్రైస్తవుడు. ఆక్స్‌ఫర్డ్ గ్రూప్, దాని "నైతిక పునర్వ్యవస్థీకరణ" సూత్రాలకు మద్దతుదారుడు. అలాగే చురుకైన ఫ్రీమేసన్.[2] సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో భాదపడుతూ, 1939 ఫిబ్రవరి 26న హేస్టింగ్స్ లోని ఆసుపత్రిలో కీస్ మరణించాడు.

మూలాలు

మార్చు
  1. Who Was Who
  2. 2.0 2.1 Obituary, The Times, 28 February 1939
  3. "No. 26943". The London Gazette. 1 March 1898. p. 1266.
  4. "No. 26943". The London Gazette. 1 March 1898. p. 1262.
  5. "No. 27100". The London Gazette. 18 July 1899. p. 4446.
  6. "No. 32844". The London Gazette. 13 July 1923. p. 4859.
  7. "No. 33848". The London Gazette. 22 July 1932. p. 4796.
  8. "No. 33898". The London Gazette. 30 December 1932. p. 6.