డిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్

డిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నడుపుతున్న రైలు .ఈ రైలు ఈశాన్య భారతదేశములో గల అస్సాం లో గల దిబ్రుఘర్ నుండి భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము తమిళనాడు రాష్ట్రంలోని గల కన్యాకుమారి వరుకు  ఈ   రైలు 4233 కిలో మీటర్ల దూరాన్ని 82 గంటల 30 నిమిషాలు తో ప్రయాణిస్తుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 7 రాష్ట్రాల్లో  ప్రయాణిస్తోంది.[1] వివేక్ ఎక్స్‌ప్రెస్  భారతదేశములోనే అత్యదిక దూరం, అత్యదిక ప్రయాణసమయం కలిగిన రైలు. ఈ రైలు యొక్క సరాసరి వేగం 50.4 కి.మీ/గం. మొత్తం ఈ రైలు మొత్తం 57 స్టేషన్ల లో ఆగుతుంది.

డిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
డిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంవివేక్ ఎక్స్‌ప్రెస్
స్థితినడుస్తోంది
స్థానికతఅసోం,నాగాలాండ్,బీహార్,పశ్చిమ బెంగాల్,ఒడిషా,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు & కేరళ
ప్రస్తుతం నడిపేవారుఈశాన్య సరిహద్దు రైల్వే
మార్గం
మొదలుడిబ్రుఘర్ (DBRG)
ఆగే స్టేషనులు57
గమ్యంకన్యాకుమారి (CAPE)
ప్రయాణ దూరం4233 km
సగటు ప్రయాణ సమయం80hr 15min
రైలు నడిచే విధంవీక్లీ, శని వారం
రైలు సంఖ్య(లు)15905/15906
సదుపాయాలు
శ్రేణులుSecond AC
Third AC
Sleeper
కూర్చునేందుకు సదుపాయాలువుంది
పడుకునేందుకు సదుపాయాలువుంది
ఆహార సదుపాయాలువుంది
బ్యాగేజీ సదుపాయాలువుంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్Loco: WAP-4
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
విద్యుతీకరణYes
వేగం50.4 km/h (31.3 mph)
మార్గపటం
Dibrugarh - Kanyakumari Vivek Express Route map

చరిత్ర మార్చు

 భారతీయ రైల్వే బడ్జెట్  2011-12లో ఈ రైలును అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ స్వామి వివేకనందా 150వ జయంతి సందర్భంగా ప్రకటించారు.

మార్గం మార్చు

వివేక్ ఎక్స్‌ప్రెస్  ఈశాన్య భారతదేశములో గల అస్సాంలో గల దిబ్రుఘర్ నుండి భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము తమిళనాడు రాష్ట్రంలోని గల కన్యాకుమారి వరుకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలో మొదటి రోజు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు  15906 నెంబరుతో బయలుదేరి అయిదవ రోజు ఉదయం 9 గంటల 50 నిమిషాలకు కన్యాకుమారి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 15905 నెంబరుతో రాత్రి 11 గంటలకు బయలుదేరి అయిదవ రోజు ఉదయం 07 గంటల 15 నిమిషాలకు దిబ్రుఘర్ చేరుకుంటుంది. ఈ రైలు అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా  ప్రయాణిస్తుంది. ఈ రైలు ఈశాన్య, తూర్పు, దక్షిణ భారతదేశాల్లో ముఖ్యమయిన రైల్వేస్టేషన్లయిన దిమాపూర్, గౌహతి, న్యూ జలపాయిగురి జంక్షన్, సిలిగురి, మల్దా, దుర్గాపూర్, అసన్సోల్, భువనేశ్వర్, బరంపురం రైల్వేస్టేషను, విజయనగరం రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషన్, కాట్పాడి, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, కోయంబత్తూరు జంక్షన్, పాలక్కడ్ జంక్షన్, ఎర్నాకులం, తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ల మీదుగా ప్రయాణిస్తుంది.

పెట్టెల అమరిక మార్చు

క్లాసిక్ స్లీపర్, మూడవ క్లాసు,  రెండవ క్లాసు పెట్టెలు, అరక్షిత పెట్టెలు అందుబాటులో కలవు.

మూలాలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇవీ చూడండి మార్చు