తిరుపతమ్మ తల్లి (కానూరు)

కానూరు, గ్రామంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం జిల్లాలోనేగాక రాష్ట్రంలోని వివిధప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో చిన్న తిరునాళ్ళు ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి నుండి 5 రోజులు వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు ఉదయం ఆలయంలో అఖండజ్యోతి స్థాపన చేస్తారు. రెండవ రోజున, సాయంత్రం 5 గంటలకు, రథంలో గ్రామోత్సవం జరుగుతుంది. మూడవ రోజున, ప్రత్యేక అభిషేకం, అనంతరం ఆలయంలో వేలమంది మహిళలచే లక్షకుంకుమార్చన పూజ నిర్వహిస్తారు. నాల్గవరోజు సాయంత్రం, ఆలయంలో ఉన్న ఇనుప ప్రభను విద్యుద్దీపాలతో అలంకరించి, దానితో తిరుపతమ్మ, గోపయ్యస్వామి విగ్రహాలను ఉంచి, ఆలయం చూట్టూ ప్రదక్షణ చేస్తారు. ఐదవ రోజున, అమ్మవారికి అనిగండ్లపాడు లోని కొల్లా శ్రీనివాసరావు ఇంటినుండి పుట్టింటి పసుపు, కుంకుమ తీసుకొస్తారు. ఆ బండి వెనుక గ్రామానికి చెందిన వందల బండ్లు పెనుగంచిప్రోలు వరకూ వేడుకగా వస్తాయి.దీనిని అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలులో పెద్ద ఉత్సవంగా చేస్తారు.[1]

శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామి దేవాలయం

మూలాలు మార్చు

  1. ఈనాడు కృష్ణా; 2014, మార్చి-15; 11వ పేజీ.

వెలుపలి లంకెలు మార్చు