తులాబందుల నాగేశ్వరరావు

తులాబందుల నాగేశ్వరరావు తాడేపల్లి న్యాయవాది.1967 లో మంగళగిరి ఎమ్మెల్యే అధికార భాష సభ్యులు గా పనిచేశారు..1942 లో నేషనల్ హెరాల్డ్ సంపాదకులు కోటంరాజు రామారావు తరుపున వాదించి బ్రిటీష్ ప్రభుత్వంపై గెలిచారు.వెనుకబడిన కులాల ఉధ్యమం సామాజిక ఉధ్యమం అని చాటారు.ఈయన వడ్డేశ్వరం లో 21.5.1917 న చినబ్రాహ్మణయ్య- రోశమ్మ లకు జన్మించారు.1947 లో మద్రాసు హైకోర్టు న్యాయవాది గా పనిచేశారు.గాందేయవాది.ఖద్దరే ధరించేవారు.నలుగురు కూతుళ్ళు,ఇద్దరు కొడుకులు. 1954 లో కాకాసాహెబ్ కాలేల్కర్ కమిషన్ వచ్చినపుడు విజయవాడలో వెనుకబడిన కులాల మహాసభను జరిపారు.1959 వరకు షెడ్యూల్డ్ కులాలు,జాతుల కేంద్ర సహాయ కమీషనర్ గా పనిచేశారు.కొండ జాతుల వారి సమస్యలపై అనేక వ్యాసాలు వ్రాశారు.8.5.1986 న చనిపోయారు.