తూర్పు గంగవరం
తూర్పు గంగవరం (East Gangavaram), ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన [1] పిన్ కోడ్ నం. 523 264., ఎస్.టి.డి.కోడ్ = 08592.
తూర్పు గంగవరం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°ECoordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తాళ్ళూరు మండలం |
మండలం | తాళ్ళూరు ![]() |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Match not found |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08592 ![]() |
పిన్(PIN) | 523264 ![]() |
గ్రామ చరిత్రసవరించు
ఈ గ్రామం తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనే గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామం పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపార పరంగా గాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వము తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో నాగంభొట్లపాలెం, రామభద్రాపురం, సోమవరప్పాడు, మాధవరం అను మరి నాల్గు గ్రామాలు కూడా కలిసి ఉండి పాత నెల్లూరు జిల్లాలోని దర్శి తాలూకా, పొతకమూరు ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం, నాగంభొట్లపాలెం గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈ పంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది. ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. నాగార్జున సాగర్ కాలువ. బోరు బావులు, నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగా కూడా చాలా కీలక గ్రామంగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.
గ్రామ భౌగోళికంసవరించు
సమీప గ్రామాలుసవరించు
సమీప మండలాలుసవరించు
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
ప్రభుత్వ పాఠశాలలుసవరించు
- శ్రీ గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
ప్రైవేటు పాఠశాలలు/కళాశాలలుసవరించు
- Ganga Residential School.
- Pragathi School.
- Some Private Degree Colleges.
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
శుద్ధజల కేంద్రంసవరించు
ఈ గ్రామంలో 4 లక్షల రూపాయల వ్యయంతో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2016, నవంబరు-26న ప్రారంభించారు. [2]
ప్రాధమిక ఆరోగ్య కేంద్రంసవరించు
బ్యాంకులుసవరించు
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయంసవరించు
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం, తూర్పు గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటి గంగ లో ఉంది. ఈ ఆలయ ఆవరణలో ఒక కోనేరు ఉంది. సమీపంలోని కొండ నుండి వచ్చేనీటితో ఈ కోనేరు ఎప్పుడూ నిండుకుండలాగా ఉంటుంది. ఈ కోనేటి నీరు, కర్నూలు జిల్లా మహానందిలోని కోనేటి నీటి లాగా ఉంటుందని ప్రశస్తి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు, పిల్లలూ ఈ కోనేరు చెంత కూర్చుని సేదతీరుతారు. ఇక్కడి నీరే తూములద్వారా సమీపంలోని గంగ వాగుకు వెళుతుంది. ఆ నీటితోనే భక్తులు స్నానమాచరించి, పొంగళ్ళు వండి, పూజాదికాలు నిర్వహించెదరు. ఈ వాగు ఆధారంగా పలు సాగునీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి ఈ కోనేరు వంద సంవత్సరాల తరువాత ఇప్పుడు మొదటిసారిగా ఎండిపోయింది. అందువలన, తూములనుండి నీరు వచ్చే పరిస్థితి లేక, వాగు, దానిపై ఆధారపడిన సాగునీటి పథకాలు, వట్టిపోయినవి. ఏటికేడు ఎండలు పెరగటం, వర్షపాతం తగ్గడం వలన, ఈ పరిస్థితి తలెత్తినదని గ్రామస్థులు వాపోతున్నారు. [1]
ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది.
గ్రామ విశేషాలుసవరించు
శ్రీ తెనాలి మురళి, ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు వంశీకృష్ణ , నెల్లూరులోని రవీంద్ర భారతి పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నాడు. ప్రస్తుతం భూమిపై వాతావరణ కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురౌతున్న నేపథ్యంలో కాలుష్యం లేకుండా జీవించేటందుకు, అనువైన భూమికి సంబంధించిన ప్లానెట్ ప్రాజెక్టును, ఈ విద్యార్థి రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా నాసా 1500 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. ఇందులో వంశీకృష్ణ రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి లభించింది. అమెరికాలో నిర్వహించు ఒక ప్రత్యేక కార్యక్రమంలో, వంశీకృష్ణకు, ప్రశంసా పత్రంతోపాటు, బహుమతిని అందజేసెదరు. [3]
మూలాలుసవరించు
వెలుపలి లంకెలుసవరించు
[1] ఈనాడు ప్రకాశం; 2015, మే-26; 8వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016, నవంబరు-27; 6వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-27; 2వపేజీ.