నిప్పురవ్వ
నిప్పురవ్వ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. వి. శ్రీనివాస ప్రసాద్ యువరత్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. బప్పీలహరి పాటలు స్వరపరచగా, ఎ. ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు. రాజ్ కోటి కూడా ఒక పాట స్వరపరిచారు.
నిప్పురవ్వ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎ.కోదండరామి రెడ్డి |
నిర్మాత | ఎం. వి. శ్రీనివాస ప్రసాద్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ విజయశాంతి నిళల్ గళ్ రవి శోభన |
సంగీతం | బప్పిలహరి రాజ్ - కోటి (రండి కదలి రండి పాటకు) ఎ.ఆర్.రెహమాన్ (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1993 సెప్టెంబరు 3 |
భాష | తెలుగు |
సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. చిత్రీకరణలో ఒక ప్రమాదం జరిగింది. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రం తో సమానంగా ఒకే రోజు విడుదలై పోటీ పడాల్సి వచ్చింది
కథసవరించు
నటవర్గంసవరించు
విడుదలసవరించు
ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజున బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమా కూడా విడుదలయ్యింది. ఈ రెండింటిలో నిప్పురవ్వ సరిగా ఆడలేదు కానీ బంగారు బుల్లోడు మాత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నిప్పురవ్వ సినిమాను చిత్రీకరిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. దాంతో ఈ సినిమా విడుదలను నిలుపు చేయాలని కొంతమంది కోర్టుకెక్కారు. అందుకని ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యి బంగారు బుల్లోడు చిత్రంతో సమానంగా ఒకే రోజు విడుదలై పొటీ పడాల్సి వచ్చింది.[1]
సాంకేతికవర్గంసవరించు
సంగీతంసవరించు
ఈ చిత్రానికి బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించాడు. రండి కదలిరండి అనే ఒక్క పాట మాత్రం రాజ్ కోటి స్వరపరిచారు. ఎ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ఇలా ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అరుదైన సంఘటన.[1]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "బాలయ్య అరుదైన రికార్డుకు 25 ఏళ్లు". News18 Telugu. 2018-09-03. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.