పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు

మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీయ యుగం లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణం లోను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వారా వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.

వరంగల్ కోట

బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు మార్చు

సోమనాథుని కాలానికి ముందే తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాశిపదాలు, వాలేశు పదాలు, వేన్నెలపదాలు మొదలైన వెన్నో ఆచరణలో వుండేవి. కాని, ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యంలో విద్యా ప్రచారానికి అవకశాలు చాల వరకు తగ్గిపోయాయి. ప్రజల్లో ఎక్కువమంది పాటలకే ప్రాముఖ్యమిచ్చినట్లు బసవపురాణంలో ఈ క్రింది విధంగా ఉదహరించ బడింది.

  • మేటియై చను భక్తకూతువలందు - పాటలుగా గట్టి పాడేడు వారు,
  • ప్రస్తుతోక్తుల గద్యవద్య కావ్వముల విస్తారముగజేసి వినుతించు వారు
  • అటుగాక సాంగభాషాంగ క్రియాంగ-వటునాటకంబుల నటియించు వారు,
  • మును మాడి వారు నీరనవేల కూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడిదెరు.

భక్త కూటువులనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, రోకటి పాటలు కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజా సామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, భజన సమాజాల్లో భక్తి గీతాలు గాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివ భక్తులు ఇండ్లలో వేదాల్లాగా వల్లీంచేవారట. శిరియాళ చరిత్రను గురించి బసవ పురాణంలో:...............

  • కరర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడేడు వారు
  • అటుగాక పాంగభాషాంగ క్రియాంగ - పటునాటకంబుల నటియించువారు

శిరియాలు చరితను పాటలుగా గట్టి పాడటమే గాక, ఆ కాలంలో నాటక ప్రదర్శనాలు కూడా జరిగినట్లు పై ఉదాహరణల వల్ల తెలుస్తూ ఉంది.

పండితారాద్య చరిత్రలో ప్రజాకళారూపాలు మార్చు

ఆ నాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబంధించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాద్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయన నృత్తరత్నావళిలో వర్ణించి నట్లు జానపద నృత్యాలను కూడా వర్ణించాడు. ఈ గ్రంథంలో సోమనాథుడు శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంద మున్నట్లు కనబడుతూ ఉంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ వృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.

ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు మార్చు

  • ప్రమథ పురాతన వంటి చరిత్రములు - గ్రమమొంద బహునాటకము లాడు వారు,
  • లలితాంగ రస కళాలంకార రేఖ - లలవడ బహురూప మాడేడు వారు
  • గరణముల్, మొరవణుల్ గతులు చిత్రములు - నరుదుగ వెడ్డంగ మాడెడు వారు.

ఆటలు మార్చు

  • అమరాంగనలు దివినాడెడు మాడ్కి -- సమరంగ గడలపైనాడెడు వారు
  • నావియద్గతి బక్షులాడెడునట్టి -- భానమ్రోకుల పై నాడు వారు.
  • పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న

తోలుబొమ్మలాటలు మార్చు

భారతాదికథల జీరమఱుగుల - నారంగబొమ్మలాడించు వారు, గడునద్భుతంబుగ గంబసూత్రంబు లడారంగ బొమ్మల నాడించు వారు.

యక్షగానాలు మార్చు

నాగట గంధర్వ యక్షవిద్యాధ -రాదులై పాడెడు నాడెడు వారు
విధమున బ్రచ్ఛన్న వేషముల్ దాల్చి యధికోత్సవము గులు కాడు నట్లాడు.

జంతు నృత్య విన్యాసాలు మార్చు

పాలు పారుదండనంబులు నొప్ప హంస - గతియును, మాతంగ గతియును వృషభ
గతియును, మర్కట గతియును మేష ... గతియును, మయూర గతియును భోగి
గతియును , నాబెక్కు గతులు, నొప్పారు,రంభయాదిగ నప్సరస్సమూహంబు - గుంభినీ
సతులతో గూడియాడంగ, జప్పట్లు వెట్టంగ జక్కన లేచి- యప్పాట వెడయాట లాడెడు వారు,
వేడుకతో జిందు నాడంగ వచ్చి - కోడంగి యాటల గునిసెడు వారు,, భ్రమరముల్
సాళెముల్ బయకముల్ మెరసి - రమణ అబంచాసి పేరణి యాడువారు.

ఈ విధంగా పండితరాధ్య చరిత్రలో సోమనాథుడు దేశి కళారూఫాల గురించి వర్ణించాడు. వెడయాట (వికట వర్తనం)., చిందు కోడంగి యాటలు, కోణంగి యాట (ఇది హాస్య నృత్యం) పేరణి, బహు నాటకములు, బహురూపులు, వెడ్డంగము, అమర గందర్వాంగనల నృత్యానుకరణలు, పక్షుల ఆటలు, గడాటలు, దొమ్మరాటలు, భారతాదికథల చాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటివేషాలు, మొదలైన వాటి నన్నిటినీ వర్ణించాడు. అంతే గాక నర్తకుల వేషభాషల గురించి ఈ క్రింది విధగా వివరించాడు.

నట్టువ కత్తెల కట్టుబట్టల తీరు మార్చు

నట్టివ కత్తెలు ఆకాలంలో అర్థోరుకములు (చల్లడాలు) ధరించేవారట. అనాటి ప్రదర్శనాలలో, నర్తకుల రంగ ప్రవేశంతో నర్తనగానం ప్రదర్శింప బడేది. దీనినే పూర్వరంగమని పేర్కొన్నారు. అనంతరం నర్కకుల తెర వెడలిన తరువాత కన్నులూ, కనుబొమలూ మెదలైన అంగ, ప్రత్యంగ, ఉపాంగదలనారుల ద్వారా అభినయాన్ని ప్రదర్శించేవారు. తరువాత జంత్ర సంగీత గమకాలతోనూ, వివిధ వాద్యాల దేశి నామాల లోనూ వర్ణించేవారు. ఆనాటి నర్తకుల నర్తన తీరును ఉత్తేజంగా కావ్వ ధోరణిలో వివరించారు. ఈ వర్ణనలో రకరకాల నృత్య రీతులు వర్ణించాడు. ఒంటికాలి నడక, మోకాటి నడక, మరగాళ్ళపై నడక, కూర్చుండే ముందుకు నడుచుట, రొమ్ములతో ప్రాకుట, గిరగిర తిరిగే నృత్యానికి బ్రమర నృత్యమని పేరు. ఈ నృత్యాన్ని ఈ నాడూ అరుదుగా చేస్తూనే ఉన్నారు. అంతే గాక అనేక విధాలైన ఇతర నృత్య భేదాలను గూర్చీ, వివిధ కథలను వివరించే నాటక ప్రదర్శనాలను ఊడ వర్ణించాడు. ఆ నాటి వాడుకలో నున్న నాట్య కళా చరిత్ర గురించి సోమనాథుడు ఎన్నో అమూల్య మైన విషయాలను మనకు అందింఛాడు. దేశిలాస్యాంగాలను వర్ణిచిన సోమనాథుడు వివిధాంగాల పట్టినిచ్చాడు. హంస, నెమలి, పాము, ఎద్దు, కోతి, మేక మొదలైన పక్షుల, మృగాల వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పట్టిక నిచ్చారు.

బసవపురాణంలో జానపద కళలు మార్చు

సోమనాథుడు.... బసవ పురాణంలో కూడా కళల గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలోకోలాటము, గొండ్లి, పేరణీ మొద లైన దేశి రూపాలను పేర్కొన్నాడు. జాతిగీతా లైన ఆనంగీతాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ పుర ప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన ఉంది. ఇది సౌరాష్ట్ర నర్తనాచార్యుల సాంప్రాదాయాను సారంగా నర్తించి నట్లుంది.ఇంకా పూర్వ సంగీతం, తెర తీయడం, దేశీ లాస్యంగాలు, ముహరసం, సౌష్ఠవం, లలి, భావం, ధూకళి, ఝుంకళి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడా ఉంది. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలను ఎన్నింటినో పొందు పరిచాడని వి. రాఘవన్ గారు తెలుగు సంస్కృతి లో ఉదహరించారు.

యివి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  • డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వ్రాసిన తెలుగువారి జానపద కళారూపాలు

యితర లింకులు మార్చు