పి.వి.జి.పల్లె (పోరు వెంగన్న గారిపల్లె) కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వైఎస్‌ఆర్ జిల్లాలో,ఇదే మండలంలో ఉండేది. [1]

పి.వి.జి.పల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
పి.వి.జి.పల్లె is located in Andhra Pradesh
పి.వి.జి.పల్లె
పి.వి.జి.పల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°10′04″N 79°12′44″E / 14.167658°N 79.212340°E / 14.167658; 79.212340
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పుల్లంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

చరిత్ర మార్చు

ఈ గ్రామం పూర్తి పేరు పోరు వెంగన్నగారి పల్లె.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

పోరు వెంగన్న గారి పల్లె (పి.వి.జి.పల్లె) రామసముద్రం గ్రామాల నడుమ దేవరకొండలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. వేదపండితులు తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేకపూజలు చేసి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీరుస్తారు. దూరప్రాంతాల నుండి గూడా భక్తులు విచ్చేసి, అమ్మవారికి పొంగళ్ళు నిర్వహించి, కానుకలు సమర్పించుకుంటారు.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు అరటి నిమ్మ

ప్రధాన వృత్తులు మార్చు

ఈ గ్రామంలో ప్రదాన వృత్తి వ్యవసాయం.వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇటీవల సి.ఈ.ఓ.గా పదవీ స్వీకారం చేసిన సత్యా నాదెళ్ళ, ఈ గ్రామవాసి పి.పెద్దసుబ్బయ్య నాయుడు (సత్యనారాయణ చౌదరి) మనుమడే. పి.పెద్దసుబ్బయ్య నాయుడు ఈ గ్రామంలో 40 ఏళ్ళ క్రితం, నివాసం ఉన్నారు. తరువాత కొంత కాలానికి వీరు రాజంపేటలోని బండ్రాళ్ళ వీధిలో నివాసం ఉన్నారు. వీరి కుమార్తె ప్రభావతి, వివాహానికి పూర్వం ఇక్కడ చదువు పూర్తి చేసుకుని, తిరుపతిలోని ఎస్.వి.కళాశాలలో సంస్కృత అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే ప్రభావతి వివాహం యుగంధర్ తో జరిగింది. వివాహానంతరం ప్రభావతి, భర్తతో కలిసి, హైదరాబాదులో స్థిరపడినారు. అక్కడ ఈ దంపతులకు సత్య నాదెళ్ళ జన్మించారు. ఈ రకంగా జిల్లాలోని ఈ మారుమూల పల్లె బహుళ ప్రచారంలోకి వచ్చింది.

మూలాలు మార్చు

  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.

వెలుపలి లింకులు మార్చు