అన్నమయ్య జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా

అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాయలసీమ ప్రాంతంలో గల జిల్లా. దీని ముఖ్యపట్టణం రాయచోటి. మదనపల్లె జిల్లాలో అతిపెద్ద నగరం. జిల్లాలోని తాళ్లపాకకు చెందిన ప్రముఖ సంకీర్తనకారుడైన అన్నమాచార్య పేరు జిల్లాకు పెట్టారు. ఆంధ్రా ఊటీగా పేరొందిన హార్సిలీ హిల్స్ ఈ జిల్లాలోనిదే.

అన్నమయ్య జిల్లా
జిల్లా
Saumyanatha temple.JPGBaba Ehsanulla Khan Warsi Dargah, Madanapalle - 1.jpg
Dusk,pileru,A.P - panoramio.jpgPaddy Fields In Kosuvari Palle.jpg
Horsley hills HDR.jpg
ఎడమ, పై నుండి సవ్యదిశలో: రాజంపేట లో సౌమ్యనాథ దేవాలయం, మదనపల్లె లో ఎహ్సానుల్లాఖాన్ వార్సీ దర్గా, హార్సిలీ హిల్స్ లో వరిచేలు, పీలేరు లో సూర్యాస్తమయం.
Location of అన్నమయ్య జిల్లా
నిర్దేశాంకాలు: 14°03′N 78°45′E / 14.05°N 78.75°E / 14.05; 78.75Coordinates: 14°03′N 78°45′E / 14.05°N 78.75°E / 14.05; 78.75
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
స్థాపన2022 ఏప్రిల్ 4
స్థాపించిన వారుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పేరు వచ్చినవిధంఅన్నమయ్య
జిల్లా కేంద్రంరాయచోటి
పరిపాలనా విభాగాలు
  • రెవిన్యూ విభాగాలు : 3
  • మండలాలు : 30
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టరుపి.యస్. గిరీష
విస్తీర్ణం
 • మొత్తం7,954 km2 (3,071 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం16,97,300
 • సాంద్రత210/km2 (550/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిannamayya.ap.gov.in/te

చరిత్రసవరించు

పాత చిత్తూరు జిల్లా, పాత వైఎస్‌ఆర్ జిల్లా లో కొన్ని మండలాలతో ఈ జిల్లా 2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడింది.[1][2][3]

భౌగోళిక స్వరూపంసవరించు

జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో ఉంది. ఇది 13° 43’N - 15° 14’N, 77° 55’E - 79° 29’E మధ్య వ్యాపించివుంది. ప్రాంతాల ఎత్తు సముద్రస్థాయిపై 269 - 3787 మీటర్లు మధ్య వుంటుంది. దీనికి ఉత్తరాన వైఎస్ఆర్, దక్షిణాన చిత్తూరు, పశ్చిమాన అనంతపురం, తూర్పున నెల్లూరు, చిత్తూరు జిల్లాలున్నాయి. [4] జిల్లా విస్తీర్ణం 7,954 కి.మీ.

కొండలుసవరించు

  • పాలకొండలు (శేషాచలంకొండలు): వేంపల్లె దగ్గర వెంపల్లె గుండి అనబడేచోట పాపాఘ్ని నది కొండల మధ్యగా ప్రవహిస్తుంది.
  • నల్లమల, లంకమల కొండలు: ఇవి దట్టమైన అడవులతో వన్యమృగాలతో వున్నాయి. వీటి సగటు ఎత్తు 2500-3500అడుగులు.

నదులుసవరించు

చెయ్యేరు మూడు ఉపనదుల నీటితో బాలరాజుపల్లె లోయలో ప్రవహిస్తుంది. ఇది గుండ్లమడ దగ్గర పెన్నేరులో కలుస్తుంది.

వన్యప్రాణులుసవరించు

బోనెట్ కోతి (MacacaRadiata), మద్రాసు లంగూర్ ఈ జిల్లాలో కనబడతాయి. పులులు కొండలలోని అటవీప్రాంతంలో కనబడతాయి. చిరుతపులి రక్షిత అడవులలో కనబడుతుంది. ఇవేకాక, ముంగీస, నక్క, తోడేలు, అడవి కుక్కలు, ఎలుగుబంటి, మలబారు ఉడుత, ముళ్లపంది, లేడి, మచ్చల లేడి, అడవి పంది నెమలి మొదలైనవి కూడా వున్నాయి. కంజు, క్వెయిల్ పిట్టలు కూడా ప్రముఖమైన పిట్టలు

నేలలుసవరించు

నల్లనేలలు, ఎర్రనేలలున్నాయి.

ఖనిజాలుసవరించు

బేరైట్లు, సున్నపు రాయి, ఆస్బెస్టాస్ ఎక్కువగా లభిస్తాయి. ఇవేకాక నాప బండలు, భవనాలకు వాడే రాళ్లు, చలువరాయి, లాంటివి కూడా తక్కువగా లభ్యమవుతాయి.

వాతావరణంసవరించు

డిసెంబరు నుండి ఫిభ్రవరి వరకు శీతాకాలం. మార్చినుండి మే వరకు వేసవికాలం, దీని తరువాత నైరుతి రుతుపవనాల వర్షాకాలం జూన్ - సెప్టెంబరు వరకుంటుంది. ఆతరువాత ఈశాన్య రుతుపవనాలతో అక్టోబరు -డిసెంబరు మధ్యకాలంలో కొద్దిపాటి వర్షపాతం వుంటుంది.

వర్షపాతంసవరించు

జిల్లా సగటు వార్షిక వర్షపాతం 743.7 mm. నైరుతి ఋతుపవనాల ప్రారంభం కాలంలో వేరుశనగ, కంది నాటుతారు. [5]

జనగణన విషయాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం అన్నమయ్య జిల్లా జనాభా 16,97,308. [6]

జనాభా - మతాలు (2011)[7]
మతం శాతం
హిందూ
  
81.97%
ముస్లిం
  
17.25%
ఇతర, లేక వెల్లడిచేయని
  
0.78%
మతాల విస్తరణ

2011 జనాభా లెక్కల ప్రకారం తొలిభాషగా 81.91% తెలుగు, 16.40% ఉర్దూ, 1.04% లంబాడీ వాడుతారు.[8]

పరిపాలనా విభాగాలుసవరించు

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి రాజంపేట, రాయచోటి, మదనపల్లె. రాయచోటి రెవెన్యూ డివిజన్ పాత చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్, రాజంపేట రెవెన్యూ డివిజన్ ల నుండి, పాత వైఎస్‌ఆర్ జిల్లా లో కొన్ని మండలాలతో కొత్తగా ఏర్పడింది.[1] ఈ రెవెన్యూ డివిజన్లను 30 మండలాలుగా విభజించారు.

మండలాలుసవరించు

రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో 9 మండలాలు, రాయచోటి రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు, మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో 11 మండలాలు ఉన్నాయి .

రాజకీయ విభాగాలుసవరించు

అన్నమయ్య జిల్లాలో ఒక పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

లోకసభ నియోజకవర్గంసవరించు

అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు

  1. కోడూరు
  2. తంబళ్లపల్లె
  3. పీలేరు
  4. మదనపల్లె
  5. రాజంపేట
  6. రాయచోటి

నగరాలు, పట్టణాలుసవరించు

జనగణన పట్టణాలుసవరించు

వ్యవసాయంసవరించు

వరి, వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, ప్రత్తి, తమలపాకులు ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తులు. మామిడి, బొప్పాయి, అరటి, నిమ్మ, బత్తాయి ప్రముఖ ఉద్యానవన పంటలు. [5]

నీటి పారుదలుసవరించు

పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరు సరఫరా జరుగుతుంది.

విద్యాసౌకర్యాలుసవరించు

జిల్లాలో 82 వృత్తి విద్యాకళాశాలలున్నాయి.

పరిశ్రమలుసవరించు

8 భారీ, మధ్యస్థ స్థాయి పరిశ్రమలున్నాయి.

రవాణా సౌకర్యాలుసవరించు

జిల్లాలో 301.59 కి.మీ. జాతీయ రహదారులు, 330.46 కి.మీ. రాష్ట్ర రహదారులు, 831.91 కి.మీ జిల్లా రహదారులు, 4,131.43 పంచాయితీరాజి రహదారులున్నాయి.

జిల్లాలో 195.13 కి.మీ. బ్రాడ్ గేజి రైలుమార్గాలున్నాయి. 13 మండలాలలో 24 రైల్వే స్టేషన్లున్నాయి.

విద్యుత్తుసవరించు

525.2 మిలియన్ కిలో వాట్ సామర్ధ్యం గల భారీ సౌర విద్యుత కేంద్రం వుంది.[9]

పర్యాటక ప్రదేశాలుసవరించు

 
అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య విగ్రహం, తాళ్లపాక
  • హార్సిలీ హిల్స్: ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం మదనపల్లె పట్టణానికి సమీపమున వున్న హార్సిలీ హిల్స్. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ"గా పేరు పొందినది. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.[11]
  • రిషి వ్యాలీ పాఠశాల: హార్స్లీ హిల్స్ వద్ద జిడ్డు క్రిష్ణమూర్తి స్థాపించిన గురుకుల పాఠశాల రిషి వ్యాలీ ఉంది.
  • థియసోఫికల్ కళాశాల, మదనపల్లె: దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాలగా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది.
  • ఆరోగ్యవరం: ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్నది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. Apparasu, Srinivasa Rao (2022-04-05). "Andhra adds 13 new districts with aim to boost governance". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-04-09.
  3. "ANDHRA PRADESH GAZETTE". G.O.Rt.No.60, Revenue (Lands-IV), 25 [ 1 ] th January, 2022: 119. 25 January 2022.
  4. 4.0 4.1 DES 2022, p. 9.
  5. 5.0 5.1 DES 2022, p. 4.
  6. DES 2022, p. 3.
  7. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  8. "Table C-16 Population by Mother Tongue: Andhra Pradesh". Census of India. Registrar General and Census Commissioner of India.
  9. DES 2022, p. 6.
  10. DES 2022, p. 8.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-04-10. Retrieved 2011-04-05.

ఆధార గ్రంథాలుసవరించు

DES (2022). Annamayya district handbook of statistics (draft).