చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
పాఠ్యం సవరించాఉ |
||
పంక్తి 12:
చింతామణి వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి,చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు.ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది.బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు.
నాటకం లోని కొన్ని పద్యాలు.
<poem>
కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితంబునైన సంసార మందు
భార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె
పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు.
</poem>
<poem>
కాలుబెట్టిన తోనె కాంతుని మెడ విరిచి
తన మగడెంత ఆర్జన పరుడైన
ప్రాణేషుడొకటి తెల్ప తా నొకటి సల్పి
విభుడెందులకు నేని విసిగి ఒక్కటి యన్న
</poem>
<poem>
పట్టజాలక పెనిమిటి యిట్టె యన్న
బావికిని యేటికిని వడి పరువులెత్తి
భర్త ఎముకలు కొరికెడి భార్య తోడి
కాపురము కంటే వేరు నరకమ్ము గలదె.
</poem>
<poem>
అర్ధాంగ లక్ష్మి యైనట్టి ఇల్లాలిని
చీటికి మాటికి చిరబుర లాడుచు
పడుపుగత్తెల యిండ్ల బానిసీండ్రై
బయట యెల్లర చేత పడి వచ్చి యింటిలో
</poem>
<poem>
పెట్టుపోతల పట్ల గలట్టి లోటు
తిట్టు కొట్టుల తోడను తీర్చు వారు
ఖలులు కఠినులు హీనులు కలుషమతులు
కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము
</poem>
[[వర్గం:తెలుగు నాటకాలు]]
|