బూడిద భిక్షమయ్య గౌడ్
బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
బూడిద భిక్షమయ్య గౌడ్ | |||
![]()
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | కుడుదుల నగేష్ | ||
---|---|---|---|
తరువాత | గొంగిడి సునీత | ||
నియోజకవర్గం | ఆలేరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పారుపల్లి గ్రామం, గుండాల మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ | 1969 జూలై 2||
రాజకీయ పార్టీ | భారత రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సువర్ణ | ||
సంతానం | ప్రవీణ్ కుమార్ గౌడ్, ప్రసన్నవాణి | ||
నివాసం | శ్రీ రామ్ నగర్ కాలనీ, పీర్జాదిగూడ, ఉప్పల్, హైదరాబాద్ |
వ్యక్తిగత జీవితం
మార్చుబూడిద భిక్షమయ్య 1969 జూలై 2న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, పారుపల్లి గ్రామంలో బూడిద సోమయ్య, సత్తమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తన ప్రాధమిక విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గుండాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుబూడిద భిక్షమయ్య సువర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ప్రవీణ్, ఒక కూతురు వాణి ప్రసన్న ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చుబూడిద భిక్షమయ్య భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కళ్లెం యాదగిరి రెడ్డిపై 12902 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[1][2] ఆయన 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో 31,477 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బూడిద భిక్షమయ్య 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో 33,086 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 మార్చి 26న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3][4]
భిక్షమయ్య గౌడ్ 2022 ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5] ఆయన ఆ తరువాత బీజేపీ పార్టీలో ఇమడలేక తిరిగి 2022 అక్టోబరు 20న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[6]
పదవులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Budida Bikshamaiah Goud". Archived from the original on 2015-03-17. Retrieved 2015-07-10.
- ↑ Congress names 111 Assembly candidates for Telangana
- ↑ The New Indian Express (27 March 2019). "Former Congress MLA inducted in TRS". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
- ↑ Mana Telangana (26 March 2019). "వంద అబద్ధాలకు నిర్వచనం కోమటిరెడ్డి బ్రదర్స్: బూడిద". Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
- ↑ Andhra Jyothy (5 April 2022). "బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత" (in ఇంగ్లీష్). Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
- ↑ "టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
- ↑ Sakshi (2 December 2013). "డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్?". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.