బ్రాహ్మణుల చరిత్ర

' బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః ' అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు.

శూద్రునికి జన్మించిన వాడు శూద్రుడు కాగలడు కానీ బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మ శాస్త్రం. వేదము, పురాణాలు, శృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి. బ్రాహ్మణున్ని 'ద్విజుడు' అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జమ్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు, బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప. సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.

సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీ రాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీ కృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య - కూర్మ - వరాహ - నారసింహ అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు.

‘‘బ్రాహ్మణులు’’ అనే మాట ‘బ్రాహ్మన్’-అంటే ‘‘యజ్ఞం’’ అనే పదం నుండి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే ‘బ్రహ్మ’ అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని చెప్పుకోవచ్చు. వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అని అర్థం. బ్రాహ్మణ స్ర్తియందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని ‘‘మాత్రులు’’ అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని ‘‘బ్రాహ్మణులు’’ అని, బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని ‘‘శ్రోత్రియులని’’, నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులు,‘‘అనూచానులు’’ అని, ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్నవారిని ‘‘భ్రూణులు’’ అని, ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని ‘‘ఋషికల్పులు’’ అని, రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని ‘‘ఋషులు’’ అని, సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని ‘‘మునులు’’ అని అంటారు. అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచగౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే స్మార్త గౌడ సరస్వతీ బ్రాహ్మణులు (ఆంధ్రా తెలంగాణా ప్రాంతాల్లో గౌడు లేదా గౌడ అని పిలుస్తారు), భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో ‘‘బహున్’’లుగా, మయన్మార్‌లో ‘‘పొన్న’’లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులతో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని, మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగువారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకు వున్నాయి. వారిని తెలగాణ్యులు, మురికినాడు, వెలనాటు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారూ కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగాన్ని నియోగులు అంటారు. వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమై కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని ‘‘వైదికులు’’ అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ ఉంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మిగిలిపోయాయి. వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు ‘‘నియోగులు’’. వీరిలో ఆరువేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్ట కరణాలు, కాసలనాటి, పాకలనాటి, నియోగులని రకరకాల ఉపశాఖలవారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే నియోగించబడిన వారని. పౌరోహిత్యం వృత్తి కాకుండా, లౌకిక ఉద్యోగాలపైన ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరువేల నియోగులనేది పెద్ద ఉపశాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇతమిద్ధంగా తేలలేదు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాథమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పాలనా కాలంలో ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించినందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. మరో కథనం ప్రకారం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు, నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు. వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంతవరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ శాఖల నిర్వహణకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

జనహితం - జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం. బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చేసుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు. సుఖాభిలాష ఉండరాదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం చేయకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశ ప్రయాణం చేయకూడదు. ఇతర దేశ ఆహారపదార్థాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అస్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోను కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్దం చెప్పకూడదు. ధనాన్ని, శుఖాలను అభిలాషించకూడదు. స్త్రీల వంక నిశితంగా చూడకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించారాదు. ప్రాణులను కర్రతో కానీ, రాయితో కానీ కొట్టరాదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం (పిలక) లేకుండా ఉండకూడదు. సినిమాలు, నాటకాలు మున్నగునవి చూడకూడదు. సర్వజన శాంతి సుఖాలకోసం దేవుని ప్రార్థించాలి. దైవప్రార్థనలో తన స్వార్థం విడచి జనాహితాన్ని కోరాలి. మనసు, మాట, శరీరం, పని లోకహితార్థమై ఉండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి. బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మ మూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించాలి, నమస్కరించాలి. ధార్మిక లక్షణాలున్న వారు ఎవరైనా బ్రాహ్మణులే! భీష్మ పితామహుడు శ్రీ కృష్ణుడిని " సుబ్రాహ్మణ్యం" అని అనేవాడు. 'బ్రాహ్మణ్యం' కుల సంకేతపదం కాదు. గుణ సంకేతపదం . . .

  • వేదాలు ""స్మృతి/స్మృతులు"" ("ఇది విన్న అని") గా భావిస్తారు, ఆధునిక బ్రాహ్మణ సంప్రదాయం వీటి ప్రబలమైన ఆధారములతోనే ఆధునిక బ్రాహ్మణ సంప్రదాయం పరిగణించబడుతుంది. ""స్మృతి/స్మృతులు""లో నాలుగు వేదాలు ( ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము ) మాత్రమే కాకుండా కానీ వాటికి సంబంధిత బ్రాహ్మణాలు, అరణ్యకాలు లు, ఉపనిషత్తులు కలిగి ఉన్నాయి.
  • బ్రాహ్మణులు, అనేవారు 19 వ శతాబ్దపు యూరోపియన్ హిందూమతం విద్యార్ధుల ద్వారా ఇరాన్, తూర్పు యురేషియా లేదా మధ్య ఆసియా ఆర్యన్ వలసదారులు లోని భాగంగా ఉండే వారని విభావిస్తారు, షుమారు 2600 BCE సంవత్సరాలలో, వారి ప్రాథమిక మతం, ఆరాధన ఆధారం మయినటువంటి పశుపతి (తరువాత లార్డ్ శివ అని పిలుస్తారు)ని అరాధిస్తున్న వారు/వారిని, దక్షిణ దిశగా స్థానిక జనాభా పంపేసింది. ఆర్యన్ బ్రాహ్మణులు, వివిధ సమూహాల మధ్య కార్మిక, వారి ప్రత్యేకతల ననుసరించి ""కులాలు"" అని ఒక విభాగం ద్వారా, వారికి అత్యధిక గౌరవం కేటాయించి అనుసరించారు. ఈ యూరోపియన్ పండితులు ప్రకారం, వారు హిందువుల మూఢ మత సంప్రదాయాలకు కుల వ్యవస్థ యొక్క "'మూలంగా"', వయస్సు, రోజు అని లేకుండా, ఆధునిక రోజుల్లో ఇప్పటి వరకు జీవించి ఉన్నదని, వర్ణించారు.
  • 1931 సం. జనాభా లెక్కలలో (గత భారత జనాభా లెక్కల కుల రికార్డు), బ్రాహ్మణులు సంఖ్య మొత్తం 9% భారతదేశంలో ఉన్నదని లెక్కించారు. బ్రాహ్మణులు ఉత్తరప్రదేశ్లో అనేక మంది ఉన్నారు. అక్కడ వారి రికార్డు జనాభాలో కేవలం 15%గా ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో, వారు జనాభాలో 2% కంటే తక్కువగాను, తమిళనాడులో వారు 3% కన్నా తక్కువ మంది ఉన్నారు. కేరళలో, నంబూద్రి బ్రాహ్మణులు జనాభాలో 0.7% ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపుగా ఇదే శాతం మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, బ్రాహ్మణులు భారత జనాభాలో 9% కంటే తక్కువగా ఉన్నారు.

బ్రాహ్మణ పూజారులు, ఉపాధ్యాయులు (ఆచార్య) బ్రాహ్మణ అత్యధిక ఆధ్యాత్మిక జ్ఞానం (బ్రహ్మవిద్య) సాధించాలనే నిమగ్నమై, వేదాలు వివిధ శాఖలు (శాఖలు) అధ్యయనం చేస్తారు. బ్రాహ్మణ పూజారికి హిందువుల దేవాలయాలు, ఇళ్లలో మత ఆచారాలు, వేదాలు, పవిత్రమైన ఆచార కఠినమైన శిక్షణ తర్వాత అధికారం ఒక వ్యక్తికి ఆపాదించడం, మానవులు, దేవుని మధ్య సంబంధం వంటివి బాధ్యతతో కూడినవి. సాధారణంగా, కుటుంబం వృత్తుల, వ్యాపారాలు వంటివి వారసత్వంగా సంక్రమిస్తాయి. అర్చకత్వం దాని గురించి ఐదు సంవత్సరాల వయసులో ఉపనయనం అనే మత దీక్షా ద్వారా విద్యార్థి జీవితాన్ని సరైన పరిచయం తర్వాత చిన్ననాటి నుండి వేదాల ఆచరణలో సంవత్సరాలు తరబడి అధ్యయనం అవసరం, ఇలాంటివి బ్రాహ్మణ మత కుటుంబాలలోనే వారసత్వంగా ఉపయోగిస్తారు.

క్లరికల్ స్థానాలు మార్చు

  • స్వామి (పూజారి) - పురోహితుడు (దేశీయ వేడుకలకు ), ఋత్విజుడు (సీజనల్ వేడుకలు)
  • ఆచార్య లేదా ఉపాధ్యాయ (ఆధ్యాత్మిక గురువు)
  • యోగిన్
  • తపస్వి

బ్రాహ్మణుడుగా ఉన్నందుకు కావల్సినవి మార్చు

ఒక బౌద్ధ గ్రంథాలను బట్టి, బుద్ధుడు సమయంలో తూర్పు భారతదేశంలో బ్రాహ్మణుడుగా ఉండటం కోసం ఐదు అవసరాలు ఉన్నాయి:[1]

  1. వర్ణము లేదా బ్రాహ్మణ స్థితి కుటుంబం రెండు వైపులా
  2. జాతి
  3. మంత్రము
  4. శీలము లేదా ధర్మం
  5. పాండిత్యం లేదా నేర్చుకున్నది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Govind Chandra Pande (1991-02-28). Foundations of Indian Culture. ISBN 9788120807129. Retrieved 2013-08-15.