మన్ ప్రీత్ సింగ్

భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు

మన్ ప్రీత్ సింగ్ సంధు (జననం 1992 జూన్ 26) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2017 మే నుండి భారత జాతీయ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత మైదాన హాకీ జట్టులో కాంస్య పతక విజయానికి కెప్టెన్‌గా తనదైన పాత్ర పోషించాడు.[1][2]

మన్ ప్రీత్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1992-06-26) 1992 జూన్ 26 (వయసు 31)
జలంధర్, పంజాబ్
ఎత్తు 1.71 m
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
Infobox last updated on: 5 August 2021

తొలినాళ్ళ జీవితం

మార్చు

మన్ ప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ పట్టణం దగ్గరలోని మితాపూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.

కెరీర్

మార్చు

మన్ ప్రీత్ సింగ్  తన గ్రామనికి  చెందిన మాజీ మైదాన హాకీ  క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్గత్ సింగ్ నుండి ప్రేరణ పొంది హాకీ ఆటలో రాణించడం మొదలెట్టాడు.

జూనియర్ హాకీలో

మార్చు

2013లో భారత మైదాన హాకీ పురుషుల జట్టుకు కెప్టెన్ గా అతనిని ఎంపిక చేసారు.   2013  పురుషుల హాకీ కప్(జూనియర్) లో భారత జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ పోటీలో భారత జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.

మూలాలు

మార్చు
  1. "Manpreet Singh". Hockey India. Archived from the original on 8 August 2016. Retrieved 13 July 2016.
  2. "Manpreet Singh Profile". Glasgow 2014. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 13 July 2016.

బయటి లంకెలు

మార్చు