మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం 17

మలేషియా ఎయిర్‌లైన్స్ కు చెందిన (MH17/MAS17) విమానం 17 జూలై 2014 న ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇది నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్ డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్లో ఉండగా కూలిపోయింది. ఉక్రెయిన్ దేశం తూర్పు ప్రాంతమైన డొనెష్క్‌లోని హ్రాబోవ్ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది [48°7′56″N 38°39′19″E / 48.13222°N 38.65528°E / 48.13222; 38.65528]. విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల చెల్లాచెదురుగా పడ్డాయి.[1] ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఈ బోయింగ్ 777-200ER విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వైమానిక దళం వినియోగించే క్షిపణిని ఈ విమానంపై ప్రయోగించి ఉక్రెయిన్లో తిరుగుబాటుదారులు కుల్చివేసారు.

మలేషియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777-200ER విమానం

gallery మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-17. Retrieved 2014-07-17.