యెద్దుల ఈశ్వరరెడ్డి

వై.ఈశ్వరరెడ్డి గా ప్రసిద్ధులైన యెద్దుల ఈశ్వరరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభ, 3వ లోక్‌సభ, 4వ లోక్‌సభ, 5వ లోక్‌సభ లకు ఎన్నికయ్యారు.[1]

ఇతడు 1915 సంవత్సరంలో జన్మించి ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు కారాగార శిక్షను అనుభవించారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

వీరు కొంతకాలం (1958-62) ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా కూడా సేవచేశారు.

మూలాలు మార్చు