రేపల్లె పురపాలక సంఘం

రేపల్లె పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం లోని, రేపల్లె శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

రేపల్లె పురపాలక సంఘం
రేపల్లె
స్థాపన1965
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

రేపల్లె పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ.1965 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 10.97.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.28 ఎన్నికల వార్డులు ఉన్నాయి.[1]

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 50,866 జనాభా ఉండగా అందులో పురుషులు 24,385, మహిళలు 26,481 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 81.32% ఎక్కువ పురుషుల అక్షరాస్యత 85.11%, ఉండగా స్త్రీలు 77.87% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4308 ఉన్నారు.[2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

2019 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా టి. శ్రీనివాసరావు, వైస్ చైర్మన్‌గా టి. విశ్వనాథ్ గుప్తా ఎన్నికయ్యారు.[3]

మూలాలు మార్చు

  1. Manepalli, Jayaraj (4 September 2005). "Differences to the fore in Congress party". The Hindu. Repalle (Guntur district). Retrieved 31 March 2016.
  2. "Repalle Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు