వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 26వ వారం

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము. ఒకప్పుడు ఎల్లయ్య అనే పశువుల కాపరి అక్కడ పశువులు మేయడానికి మంచి గడ్డి దొరుకుతుందని కనుగొన్నాడు. అలా అక్కడ జనులు స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది. ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్థులు చెప్పుకుంటారు.

1946 ముందే చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, పెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో కూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉన్నాయి. 1946 తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.

గ్రామములోని వివిద ప్రాంతాలు - చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ, చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు.

1933, డిసెంబర్ 30న మహాత్మా గాంధీ, 1935, నవంబర్ 12న బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ వూరిని సందర్శించారు.. ...పూర్తివ్యాసం: పాతవి