గోదావరి ఎక్స్‌ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్. ఈ రైలు విశాఖపట్నంహైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుని వాల్తేరు ⇌ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ క్రింద ఫెబ్రవరి 1, 1974 న ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రస్తుత ట్రైన్ నెంబర్లు 12727, 12728. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రైలుకు పూర్తి స్థాయి ఏ.సి సదుపాయం ఉన్న గరీబ్ రథ్, దురోంతో లు ప్రవేశపెట్టటంతో ఈ రైళ్ళలో ప్రజల రద్దీ ఇంకా పెరిగింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం,మర్రిపాలెం లోని, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్న 12727 HYB నంబరు గోదావరి ఎక్స్ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థితినడుస్తుంది
స్థానికతతెలంగాణా, ఆంధ్రప్రదేశ్
తొలి సేవఫెబ్రవరి 1 1974
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యక్లాసిక్ స్లీపర్ - 864
మూడవ క్లాసు - 192
రెండవ క్లాసు - 96
మొదటి క్లాసు - 18
మొత్తం - 1170
మార్గం
మొదలుహైదరాబాద్
ఆగే స్టేషనులు18
గమ్యంవిశాఖపట్నం
ప్రయాణ దూరం710 km (440 mi)
సగటు ప్రయాణ సమయం12 గంటల,25 నిముషాలు
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ లేదు ,చెల్లించిన భోజన సదుపాయం అందుబాటు లో ఉంది.
చూడదగ్గ సదుపాయాలుఅన్ని భోగీలలో పెద్ద కిటికీలు, శుభ్రత.
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద.
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం57 kilometres per hour (35 mph)
మార్గపటం

రైలు నిలుపు చోట్లు, దారి మార్గం చూపించబడ్డ గోదావరి ఎక్స్ప్రెస్ దారి పటం (మ్యాప్) .

రెండు కొత్త రైళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ, ఈ రైలుకి ఇప్పటికి భారి రద్దీ ఉంది . ప్రజల డిమాండ్ మేరకు కొన్నిమార్లు రిజర్వేషన్ లేని జనరల్ భోగీలను స్లీపర్, మూడవ క్లాసు భోగిలతో మారుస్తుంటారు.విశాఖ, హైదరాబాద్ మధ్య వెళ్ళు రైలు మార్గాలలో ఈ రైలు వెళ్ళే మార్గాన్ని ఉత్తమంగా భావిస్తారు. అందుకే అధికారులు దీన్ని శుభ్రంగా ఉంచుతారు. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో ఉంది .ఈ రైలును భుభనేశ్వర్ వరకు పొడిగించలనీ ప్రతిపాదనలు వచ్చిన ప్రజలు, రాజకీయ నాయకులూ దిన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఆ తరువాత విశాఖ ఎక్స్ప్రెస్కి ప్రతిపాదనలు వచ్చాయి, వాటిని ఆమోదించారు. ఇప్పుడు ఆ రైలు ప్రయాణ సమయం గణనీయంగా పెరిగింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్తా ప్రాంతాలని అప్పటి రాజధాని హైదరాబాద్ (ఇప్పుడు తెలంగాణ రాజధాని) కు కలపాలనేదే గోదావరి ఎక్స్‌ప్రెస్ లక్ష్యం. ఈ రైలు విశాఖపట్నం లోని 5 స్టేషన్లు, పశ్చిమ గోదావరి లోని 3 స్టేషన్లు, తూర్పు గోదావరి లోని 6 స్టేషన్లు,, కృష్ణ జిల్లా విజయవాడలో ఆగుతుంది.

చరిత్ర మార్చు

1974 ఫిబ్రవరి 1 న, భారత రైల్వే, విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్యన తన మొదటి రైల్వే సర్వీస్ వాల్తైర్-హైదరాబాద్  రైలును ప్రకటించింది. ఈ రైలును రోజు నడుపుతున్నారు. విశాఖపట్నం నుండి సాయంత్రం 5:30 కి బైలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ల హైదరాబాద్ నుండి సాయంత్రం 5:15 నిమిషాలకు బయిలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 నిమిషాలకు చేరుకుంటుంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ల ఉన్న 9 స్టేషన్లకు ఈ రైలు సదుపాయం ఉండటం వలన దీనికి అధికారికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అని పరు పెట్టారు. 17 భోగిలున్న ఈ రైలను స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ తో నడిపేవారు. సామర్లకోట నుండి రాజముండ్రి మధ్య గంటకు 50 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని చేరుకుంది. 1975 న ఈ రైలును కాకినాడ వరకు నడుపుతూ స్లిప్ సర్వీస్ను ప్రవేశపెట్టారు. దీనికి మరో 5 కోచ్ లు జోడించడం వలన విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్ళే సింహాద్రి ఎక్ష్ప్రెస్స్తో పాటు ఈ రైలు "రెక్ షేరింగ్ అగ్రిమెంట్"లో చేరింది. కానీ 1980 లో సింహాద్రి ఎక్ష్ప్రెస్స్ ని భీమవరం వరకు పొడిగించి, కాకినాడ - సికింద్రాబాద్ మధ్య గౌతమి ఎక్ష్ప్రెస్స్ని ప్రవేశపెట్టటంతో గోదావరి ఎక్ష్ప్రెస్స్ కి రెక్ షేరింగ్, స్లిప్ సర్వీస్ ని రద్దు చేసారు. ఇచ్చిన 5 బోగీలు ఉంచుతూ, డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రవేశపెట్టారు. 1990 నాటికీ, గోదావరి ఎక్ష్ప్రెస్స్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ఈ రైలుకు మరింత రద్దీ పెరిగింది. అధికారులు మరో 2 భోగీలను ఇచ్చారు. దీనితో కలిపి 24 భోగీలతో గోదావరి ఎక్ష్ప్రెస్స్ అప్పట్లో, దేశంలో పొడవైన రైలు సేర్విసుల్లో ఒకటిగా నిలిచింది. విశాఖపట్నం - విజయవాడ , విజయవాడ - కాజీపేట - హైదరాబాద్  లైన్లను విద్యుదీకరణ చేయటంతో గోదావరి ఎక్ష్ప్రెస్ కు WAP-4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ను ప్రవేశపెట్టారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 ఏ.సి. భోగిలతో నడిచే మొదటి రైలుగా గోదావరి ఎక్ష్ప్రెస్ మంచి పేరు సంపాదించుకుంది. జూన్ 1999 న వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో పట్టాలు తప్పటంతో గోదావరి ఎక్ష్ప్రెస్స్ మదటి ప్రమాదాన్ని నమోదు చేసుకుంది.

2000 న, గోదావరి ఎక్స్‌ప్రెస్ తన సొంత ఎయిర్ కండిషన్డ్ మొదటి తరగతి కోచ్ తో అమలు చేయబడిన దక్షిణ మధ్య రైల్వేలో మొదటి రైలు అయ్యింది,, జోన్ లో 6 ఎయిర్ కండిషన్డ్ కోచ్ కలిగి ఉన్న మొదటి రైలు అయ్యింది .

2011 లో, రైలు 12727 ఈ సూపర్ ఫాస్ట్ రైలుకి తిరిగి ప్రారంభించబడింది., విజయవాడ, హైదరాబాద్ మధ్య WAP 7 తో నడపబడుతుంది. ఆ తర్వాత రైలు సమయాలను మళ్ళీ మార్పుచెందాయి,, ప్రయాణ సమయం మరింత 15 నిమిషాల వరకు తగ్గిపోయింది. జూలై, ఆగస్టు 2011 లో, గోదావరి ఎక్స్ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లను ప్రయాణికులు రెండుసార్లు దోచుకున్నారు, బూటకపు కాల్ రైలు ఆరో కోచ్ బాంబు గురించి చేయబడింది.ఫలితంగా, భద్రత విస్తరించింది, రైలు ముగింపు నుండి ఒక WAP 7 తో పూర్తిగా మళ్ళి ప్రారంభించారు. ఈ రైలు అప్పుడు WAP 7 తో విశాఖపట్నం, విజయవాడ మధ్య నడుపుతున్న మొట్టమొదటి రైల్ గా మారింది. 2 ఏప్రిల్ న, భారతీయ రైల్వే అన్ని రైళ్లలో యొక్క రెండవ, మొదటి తరగతులు అద్దెలు పెంచాలని నిర్ణయించింది, నుండి రూపుదిద్దుకుంటున్నాయి, దీని ఫలితంగా రైలు యొక్క రెండవ, మొదటి తరగతులు అద్దెలు, రిజర్వేషన్ ఛార్జీలు, ₹ 1,058 (US $ 16) నుండి ₹ 1,771 (US $ 28) కు పెంపు, 1,510 (US $ 23), వరుసగా ₹ 2,555 (US $ 40) కు పెంచారు.

భోగీల అమరిక మార్చు

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
  SLR UR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 S12 B1 B2 B3 A1 A2 HA1 UR UR SLR

సమయ సారిణి మార్చు

సం కోడ్ స్టేషను పేరు 12727:
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 VSKP విశాఖపట్నం ప్రారంభం 17:25 0.0
2 DVD దువ్వాడ 17:54 17:55 1ని 17.2 1
3 AKP అనకాపల్లి 18:08 18:09 1ని 33.0 1
4 YLM ఎలమంచిలి 18:28 18:29 1ని 56.9 1
5 NRP నర్సీపట్నం రోడ్డు 18:43 18:44 1ని 74.7 1
6 TUNI తుని 18:59 19:00 1ని 96.9 1
7 ANV అన్నవరం 19:13 19:14 1ని 113.6 1
8 PAP పిఠాపురం 19:32 19:33 1ని 138.4 1
9 SLO సామర్ల కోట 19:44 19:46 2ని 150.5 1
10 APT అనపర్తి 20:05 20:06 1ని 177.0 1
11 RJY రాజమండ్రి 2035 2039 4ని 200.6 1
12 NDD నిడదవోలు 20:59 21:00 1ని 223.1 1
13 TPP తాడేపల్లి గూడెం 21:19 21:20 1ని 242.9 1
14 EE ఏలూరు 22:01 22:02 1ని 290.6 1
15 BZA విజయవాడ 23:40 23:55 15ని 350.2 1
16 KMT ఖమ్మం 01:13 01:15 2ని 450.5 2
17 MAMD మహబూబాబాద్ 01:59 02:00 1ని 497.9 2
18 WL వరంగల్లు 02:40 02:42 2ని 558.0 2
19 KZJ ఖాజిపేట్ 03:05 03:07 2ని 568.2 2
20 SEC సికింద్రాబాద్ 05:45 05:50 5ని 699.9 2
21 HYB హైదరాబాద్ 06:15 గమ్యం

వివాదం మార్చు

కరూర్ వైశ్యా బ్యాంక్ మార్చు

30 మార్చి 2012 న, గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘట్కేసర్, సికింద్రాబాద్ జంక్షన్ నుండి కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఒక కొత్త రంగులను దర్శనమిచ్చాయి. వెంటనే, అది రంగులకు కానీ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రకటనలు ఏమీ అని అర్థం అయ్యింది. ప్రయాణీకులు ప్రకటనలు కచ్చితంగా రైల్వే ఆదాయాన్ని అయితే, వారు రైలు యొక్క ఆకర్షణ, అందం పాడు పేర్కొన్నారు. ఒక ప్రయాణీకుడు అది కళ్ళు కోసం ఒక అప్రియమైన దృష్టి ఉంది అన్నారు.

మరింత మార్చు

  • 1993 నుండి సెంట్రల్ రైల్వే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక సూపర్ఫాస్ట్ రైలు 4 గంటల 25 నిమిషాల్లో 245 కిలోమీటర్ల (152 mi) దూరం కవర్ తో, రోజువారీ నడుస్తున్న లోకమాన్య తిలక్ టెర్మినస్ (కుర్లా, ముంబై), మన్మాడ్ జంక్షన్ మధ్య పనిచేశాయి . రైలు ఇప్పటికీ నడుపుతోంది.

బయటి లింకులు మార్చు

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537