భీమవరం
భీమవరం పేరుతో ఇతర వ్యాసాలకొరకు చూడండి. భీమవరం (అయోమయ నివృత్తి)
భీమవరం | |
---|---|
![]() సోమేశ్వరస్వామి దేవాలయం | |
నిర్దేశాంకాలు: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°ECoordinates: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | స్థానిక స్వపరిపాలన |
• నిర్వహణ | భీమవరం పురపాలక సంఘం |
విస్తీర్ణం | |
• నగరం | 24.68 కి.మీ2 (9.53 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 34th (in state) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 1.5 మీ (4.9 అ.) |
జనాభా వివరాలు (2011) | |
• నగరం | 1,04,216 |
• ర్యాంకు | ఆంధ్రప్రదేశ్ లో 34వ |
• సాంద్రత | 10,939/కి.మీ2 (28,330/చ. మై.) |
• మెట్రో ప్రాంతం | 1,10,075 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 534201 |
టెలిఫోన్ కోడ్ | +91–8816 |
వాహనాల నమోదు కోడ్ | ఎపి–37 |
జాలస్థలి | {{URL|example.com|optional display text}} |
భీమవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ముఖ్య పట్టణాలలో ఇది ఒకటి. ఇది భీమవరం మండలానికి పరిపాలనా కేంద్రం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పిదప అతి పెద్ద పట్టణం. ఏలూరు పట్టణాభివృద్థి సంస్థలోని ఒక ఊరు. పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి; ఆ వ్యాపారమే ఈ పట్టణ ముఖ్య ఆదాయ వనరు. అది గాక రైస్ మిల్లులు, వరి/వ్యవసాయ-సంబంధిత కర్మాగారాలు కూడా ఇచట పెక్కు. చుట్టుప్రక్కలనున్న దగ్గర దగ్గర 150 గ్రామాలకు ఇది వాణిజ్య రాజధానిగా వర్ధిల్లుతుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, గుళ్లు-గోపురాలు, ఉద్యానవనాలు, భోజన హోటళ్లు మొదలయిన ఎన్నో సదుపాయాలు ఈ పట్టణాన్ని నివాసయోగ్యం గానూ ఆహ్లాదకరంగా గానూ మార్చాయి.
చరిత్రసవరించు
పంచారామములలో ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ సా.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు. ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడిలో ఉంది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. సా.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు, ఉండి, పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రధానం చేశారు.
దేవాలయాలు/పర్యాటక ప్రదేశాలుసవరించు
మావుళ్ళమ్మ దేవస్థానంసవరించు
భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం ఉత్సవాల కొరకు విద్యుత్ చార్జీలే లక్షలు చెల్లిస్తారు. దేవస్థాన ఆవరణలో కల కొటికలపూడి గోవిందరావు కళా వేదికపై సినీ నటులచే పలు సాంస్కౄతిక ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు. ఇక్కద నిత్య అన్నదానం జరుగును.
సోమేశ్వరస్వామి దేవాలయంసవరించు
భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో ఉంది. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం లో చెప్పబడుతుంది; చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. చంద్ర-ప్రతిష్ఠ అగుటచే పొర్ణమికి శ్వేతవర్ణంతోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంతోనూ ప్రకాశించుట ఈ లింగ మహత్యం. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద/గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో దర్శనమిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉపస్థితమై ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారమును దర్శించవచ్చును. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
స్థలపురాణంసవరించు
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్రప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
సంక్రాంతి ఉత్సవాలుసవరించు
తెలుగువారికి అన్ని పండగల కంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ రైతులు ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు కర్నాటక రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు.ముఖ్యంగా గోదావరి జిల్లాల్లు అయిన తూర్పు,పశ్చిమలో సంప్రదాయ రీతిలో ఉంటాయి. సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.
రాజకీయంసవరించు
శాసనసభ నియోజకవర్గంసవరించు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో భీమవరం ఒక నియోజకవర్గం. ప్రస్తుత శాసన సభ్యు గ్రంధి శ్రీనివాస్.
లోకసభ నియోజకవర్గంసవరించు
భీమవరం నర్సాపురం నియోజకవర్గం కిందికి వచ్చును. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘరామ కృష్ణం రాజు
జీవన ప్రమాణంసవరించు
ఆంధ్ర క్షత్రియ రాజులు , కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొద్దిగా భట్టు రాజులు, బ్రాహ్మణ, కమ్మ,రెడ్డి, దళిత వర్గాలవారు కనిపిస్తారు.భీమవరం పట్టణంలో ఎక్కువగా పెద్ద-చిన్నా వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవన విధానం కనిపిస్తుంది. అందువల్ల భీమవరం పట్టణానికి ఆంధ్రా లాస్వేగాస్ అని పేరు కూడా ఉంది.
సంస్కృతిసవరించు
సాహిత్యంసవరించు
పశ్చిమగోదావరి జిల్లాలో మరే పట్టణంలోనూ లేనన్ని సాహిత్య సంస్థలు భీమవరంలో విలసిల్లాయి. 1990ల నాటికి కళాస్రవంతి, కళాసమాఖ్య, భాగవతి విజ్ఞానసమితి, రసచంద్రిక, సాహితీ సంపత్, వసంత భారతి, కవితా ప్రభాస, రవీంద్ర సారస్వత సమాజం, శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్, జాషువా సాహితీ సమితి, శ్రీనివాస భారతి వంటి సాహితీ సంస్థలు నెలకొన్నాయి.[1] శ్రీరామరాజభూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో వసుచరిత్ర కావ్యం పుట్టి 400 ఏళ్ళయిన సందర్భంగా వసుచరిత్ర చతుశ్శతజయంతి,[2] రవీంద్ర సారస్వత సమాజం వారి వార్షికోత్సవాలు,[3] కవితా ప్రభాస సంస్థ నిర్వహణలో కవితా ప్రభాస కార్యక్రమాలు,[4] ఆరుబయట పండువెన్నెల్లో రసచంద్రిక సాహిత్య సభలు,[5] దక్షిణాంధ్రయుగంలోని రఘునాథ నాయకుల సభను కళ్ళకు కడుతూ కళాస్రవంతి నిర్వహించిన ఇందిరా మందిర సభ, వసంత భారతి నిర్వహించిన వసంత రాత్రుల కవితా గానాలు [6] వంటివి భీమవరం సాహిత్య చరిత్రలో గుర్తుంచుకోదగిన పలు విశిష్టమైన కార్యక్రమాలు.
ప్రముఖులుసవరించు
- అడవి బాపిరాజు
- అల్లూరి సీతారామరాజు - భీమవరం దగ్గరలొని మోగల్లు గ్రామానికి చెందినవారు
- భూపతిరాజు రామకృష్ణంరాజు- విద్యావేత్త, రాజకీయవేత్త, మాజీ ఏ.పి.పి.యస్సీ సభ్యులు
- డా.యల్లాప్రగడ సుబ్బారావు - శాస్త్ర వేత్త
- బి.వి రాజు పద్మభూషణ్
- గన్నాబత్తుల పెదతాత - సామాజిక వేత్త
- దంతులూరి నారాయణరాజు
- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు - సినీ నటులు
- పెన్మెత్స రాంగొపాల్ వర్మ - సినీ దర్శకుడు
- త్రివిక్రం శ్రీనివాస్ - సిని దర్షకుడు
- ఇందుకూరి సునీల్ వర్మ -సినిహీరో, హాస్య నటుడు
- రాజా రవీంద్ర - టాలీవుడ్ సినీ యాక్టర్
- శివాజీ రాజా - టాలీవుడ్ సినీ యాక్టర్
- రాశి - టాలీవుడ్ కథానాయిక
- ఎం.వి.రఘు
గ్రేటర్ భీమవరంసవరించు
పురపాలక సంఘానికి రాయలం (పాక్షికంగా) చినఅమిరం (పాక్షికంగా) గ్రామాలను విలీనం చేస్తున్నట్లు వచ్చిన ప్రతిపాదనల తీర్మానం కౌన్సిల్ ఆమోదించింది. ప్రస్తుతం 39వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.4 (2011 జనాభా లెక్కలు ప్రకారం) లక్షల మంది జనాభాను కలిగి ఉంది. పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది అని అంచనా పైన పేర్కొన్న విషయం కార్య రూపం దాల్చకున్నా, 2019 జనవరి 1న ఇది ఏలూరు పట్టణాభివృద్ధిసంస్థలో చేర్చబడింది.
రవాణా సౌకర్యాలుసవరించు
రైలు వసతిసవరించు
భీమవరంలో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. భీమవరం జంక్షను నర్సాపురం , విజయవాడ , నిడదవోలు బ్రాంచి లైన్లకు కూడలి. కాని భీమవరం లోని లైన్ బైపాస్ ఏర్పాటు వల్ల, చాలా రైళ్ళు భీమవరం టౌన్ స్టేషనుకు మాత్రమే వస్తాయి. దీని వల్ల ఇంజిన్ జంక్షను వద్ద తిప్పే అవసరము లేదు. భీమవరం టౌన్ స్టేషను దీని వల్ల గ్రేడ్-ఎ స్టేషను గా మారడానికి అవకాశం కలిగింది. ఈ లైన్ల యొక్కట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు రైల్వే విజన్-2020 లో భాగము[7].
భీమవరం టౌన్ స్టేషనుసవరించు
- గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
- గుడివాడ - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
భీమవరం జంక్షను స్టేషనుసవరించు
- గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
- గుడివాడ - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202
- విశాఖపట్నం - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
- రాజమహేంద్రవరం - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57260
- విశాఖపట్నం - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57265
ఇవికూడా చూడండిసవరించు
మూలాలు, వనరులుసవరించు
- ↑ ద్వానా శాస్త్రి, p. 151.
- ↑ ద్వానా శాస్త్రి, p. 152.
- ↑ ద్వానా శాస్త్రి, p. 156.
- ↑ ద్వానా శాస్త్రి, p. 157.
- ↑ ద్వానా శాస్త్రి, p. 158.
- ↑ ద్వానా శాస్త్రి, p. 159.
- ↑ "విజన్ 2020" (PDF).
ఆధార గ్రంథాలుసవరించు
- ద్వానా శాస్త్రి, సాహిత్య సంస్థలు