వీరమాచనేని విమల దేవి
డా. వీరమాచనేని విమలా దేవి (Dr. Viramachaneni Vimla Devi) భారత పార్లమెంటు సభ్యురాలు.[1]
వీరమాచనేని విమలా దేవి | |||
వీరమాచనేని విమల దేవి
| |||
పదవీ కాలం 1962 - 1967 | |||
ముందు | మోతే వేదకుమారి | ||
---|---|---|---|
తరువాత | కొమ్మారెడ్డి సుర్యనారాయణ | ||
నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వరాహపట్నం, ఆంధ్రప్రదేశ్, India | 1928 జూలై 15||
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిష్టు పార్టీ |
ఈమె 1928 లో కృష్ణా జిల్లాలోని వరాహపట్నంలో జన్మించింది. ఈమె తండ్రి కె. పట్టాభిరామయ్య.
ఈమె ఋషి వాలీ పాఠశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, స్కాటిష్ చర్చి కళాశాలలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టా పొందినది.
ఈమె డా. వి.వి.జి. తిలక్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి..
ఈమె సాంఘిక సేవలో చురుకుగా పాల్గొని, ఏలూరు మునిసిపాలిటీకి ఉప సభాపతి గాను తర్వాత కౌన్సిలర్ గాను సేవలందించారు.
ఈమె 1962లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి 3వ లోక్సభకు భారత కమ్యూనిష్టు పార్టీ సభ్యురాలిగా పోటీచేసి గెలుపొందింది.