శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము

శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము శ్రీనగర్ స్టేషన్ నుండి కార్గిల్ టౌన్‌ ద్వారా లెహ్ వరకు ప్రతిపాదిత రైల్వే మార్గము. 2013 ఫిబ్రవరి 26 న ఈ జాతీయ పథకాన్ని జాతీయ ప్రణాళికలో చేర్చారు. 2013-14 సంవత్సరంలో శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము సర్వే చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ప్రకటించారు.[1]

శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
అవలోకనం
వ్యవస్థబ్రాడ్ గేజ్
స్థితిప్రపాదితం
లొకేల్శ్రీనగర్, జమ్ము కాశ్మీర్, భారతదేశం
స్టేషన్లుశ్రీనగర్ (ప్రారంభం) నుండి లేహ్ (చివర)
సేవలుశ్రీనగర్కార్గిల్లెహ్
వెబ్సైట్http://www.indianrailways.gov.in
ఆపరేషన్
నిర్వాహకులుభారతీయ రైల్వేలు
సాంకేతికం
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6.0 in)

వ్యూహాత్మక ప్రాముఖ్యత మార్చు

ఈ రైలు మార్గము పూర్తయిన తర్వాత, లెహ్ నుండి నేరుగా జమ్మూ కాశ్మీర్, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే ద్వారా అనుసంధానించబడుతుంది. శ్రీనగర్ , లెహ్ మధ్య రోడ్డు మార్గం 422 కి.మీ. (262 మైళ్ళు) దూరంలో ఉంది. లెహ్ కు రైల్వే లైన్లు పూర్తయినప్పుడు, ఢిల్లీ నుండి లెహ్ చేరుకోవడానికి సమయం తగ్గుతుంది. ఈ రైలు మార్గము సురక్షిత, శీఘ్ర పద్ధతిలో ప్రజా రవాణాకు సేవలు అందిస్తుంది. సైనిక సిబ్బంది, సామగ్రి వ్యూహాత్మక సైనిక స్థావరాలైన లేహ్‌ ప్రాంతానికి మరింత సులభంగా రవాణా చేయబడుతుంది.

సవాళ్లు మార్చు

జమ్మూ-బారాముల్లా రైలు మార్గము తరువాత, శ్రీనగర్-కార్గిల్-లేహ్ మార్గం భారతీయ రైల్వేలో అత్యంత సవాలు రైల్వే ప్రాజెక్టుగా ఉంటుంది. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, పెద్ద సంఖ్యలో సొరంగాలు, ఎత్తైన వంతెనలు, తీవ్రమైన చల్లని వాతావరణం ఇందుకు ముఖ్య కారణం.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Archived copy". Archived from the original on 16 జూలై 2013. Retrieved 29 మే 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)