సంగనభట్ల నర్సయ్య

తెలుగు నటుడు

సంగనభట్ల నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, రంగస్థల అధ్యాపకుడు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త కూడా.

సంగనభట్ల నర్సయ్య
జననం (1954-07-23) 1954 జూలై 23 (వయసు 69)
ధర్మపురి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధిరంగస్థల నటుడు, దర్శకుడు, రంగస్థల అధ్యాపకుడు
సంగనభట్ల నర్సయ్యను సత్కరిస్తున్న రసమయి బాలకిషన్

జీవిత విశేషాలు మార్చు

సంగనభట్ల నర్సయ్య 1954, జూలై 23న కరీంనగర్ జిల్లా, ధర్మపురి లో జన్మించాడు. తెలుగు, సంస్కృతంలో ఎం.ఏ., ఎం.ఓ.ఎల్., లింగ్విస్టిక్స్ డిప్లోమా, పిహెచ్.డి. చేశాడు. 37 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలో ప్రిన్సిపాల్ గా 28 సంవత్సరాలు పనిచేసి, 2010, డిసెంబరు 31న పదవీ విరమణ పొందాడు.

రచనలు మార్చు

  1. తెలుగులో దేశిచ్ఛందస్సు (ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా కొరకు సమర్పించబడింది)[1]
  2. ధర్మపురి క్షేత్ర చరిత్ర
  3. చాటు కవిత్వం
  4. తెలివాహ గోదావరి[2]

వంటి 14 గ్రంథాలు

రంగస్థల ప్రస్థానం మార్చు

12 ఏళ్ల వయసులో 1966 డిసెంబరులో సోనేకీ వర్షా అనే హిందీ నాటకంలోని అజుని పాత్ర ద్వారా రంగస్ధలంపై అడుగుపెట్టాడు. 14 ఏళ్ల వయసులో 1968 ఆగస్టు 15న కన్యాశుల్కం నాటకంలోని గిరీశం ఏకాపాత్రాభినయం పాత్ర ద్వారా తెలుగు రంగస్ధలంపై అడుగుపెట్టాడు.

నటించిన నాటకాలు మార్చు

గయోపాఖ్యానం, పాండవోద్యోగం, సోనేకి వర్ష్, భువన విజయం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, నాగమనాయుడు, వీరకాపయ, వేములవాడ మహత్యం, మనిషి మనసు, ఎడ్రస్ లేని మనుషులు, కన్యాశుల్కం, సుందరకాండ, కొత్తచిగురు, రేపేంది ?, వందనోటు, నరకంలో లంచం, అంతర్వాణి, నీతులు గోతులు, మిస్టర్ వైజాగ్, ఇచ్చట సన్మానములు చేయబడును మొదలైన నాటకాలలో నటించాడు.

దర్శకత్వం వహించిన నాటకాలు మార్చు

వీరపాండ్య కట్టబ్రాహ్మణ, గయోపాఖ్యానం, రేపేంది ? మొదలైనవి.

బహుమతులు మార్చు

గయోపాఖ్యానం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ నాటకాలకు వివిధ సందర్భాల్లో బహుమతులు అందుకున్నాడు.

పురస్కారాలు మార్చు

  1. బి.ఎన్. శాస్త్రి స్మారక చరిత్రక పరిశోధన పురస్కారం
  2. గ్రామీణ కళాజ్యోతి అవార్డు (నాటకరంగ సేవకు)
  3. సరస పద్య గాయక అవార్డు (వరంగల్)
  4. అబ్బూరి స్మారక అవార్డు (తెలుగు విశ్వవిద్యాలయం)[2]
  5. పర్యావర ప్రదూషణ సంరక్షణ పురస్కారం (గోదావరిఖని)
  6. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013, 13 జూలై 2016 (తెలివాహ గోదావరి పుస్తకానికి)[3][4]
  7. శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం నుండి రావిచెట్టు రంగారావు తెలుగు భాషా వికాస పురస్కారం- 2022 (2022 డిసెంబరు 10)[5]

మూలాలు మార్చు

  1. తెలుగు థీసిస్.కాం. "తెలుగులో దేశీచ్ఛందస్సు". www.teluguthesis.com. Retrieved 5 February 2017.
  2. 2.0 2.1 సురేష్ బ్లాగ్ స్పాట్. "పొట్టి శ్రీరాము తొగు విశ్వవిద్యాయం సాహితీ పురస్కారాు`2013". sureshgk2gs.blogspot.in. Retrieved 5 February 2017.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  4. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
  5. telugu, NT News (2022-12-11). "డాక్టర్‌ సంగనభట్లకు రావిచెట్టు రంగారావు పురస్కారం". www.ntnews.com. Archived from the original on 2022-12-11. Retrieved 2022-12-11.