సత్తెనపల్లి పురపాలక సంఘం

సత్తెనపల్లి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం లోని, సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

సత్తెనపల్లి పురపాలక సంఘం
సత్తెనపల్లి
సత్తెనపల్లి పురపాలక సంఘం
స్థాపన1984
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

సత్తెనపల్లి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. ఈ పురపాలక సంఘం రాజధాని ప్రాంతంలో ఉంది. 1984 సంవత్సరంలో III గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది. 2010 సంవత్సరంలో II గ్రేడ్ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.30 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 56,721 జనాభా ఉండగా అందులో పురుషులు 28,350, మహిళలు 28,371 మంది ఉన్నారు. అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 73.58% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 81.07% కాగా, మహిళా జనాభాలో 66.18% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5827 ఉన్నారు.[1]

సత్తెనపల్లి ప్ర స్తుత చైర్మన్ గా శ్రీమతి చల్లంచర్ల లక్ష్మీ తులసి సాంబశివరావు, వైస్ చైర్మన్ గా షేక్ నాగుల్ మీరా వున్నారు

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘం 21.88.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.11 రెవెన్యూ వార్డులు,30 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 24 మురికివాడలు ఉండగా అందులో జనాభా 23364.ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,11 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Sattenapalle Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.

వెలుపలి లంకెలు మార్చు