సత్తెనపల్లి
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండల పట్టణం
సత్తెనపల్లి పల్నాడు జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. ఈ నగరం పల్నాడుకు ముఖ ద్వారము వంటిది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప, ప్రత్తి విరివిగా పండిస్తారు.
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
శ్రీ శరభయ్య గుప్తా పాఠశాల.
ప్రముఖులుసవరించు
- వావిలాల గోపాలకృష్ణయ్య
- ఉన్నవ లక్ష్మీనారాయణ
- బ్రహ్మానందం
- మనో (నాగూర్ బాబు)
- గుర్రం హరికృష్ణ
- పుతుంబాక భారతి
- పుతుంబాక వెంకటపతి
- డి.వి.నరసరాజు
ప్రముఖులుసవరించు
- కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ కన్నెగంటి బ్రహ్మానందం సొంతవూరు సత్తెనపల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల.
- జానీ లీవర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' కు సత్తెనపల్లితో అనుబంధమున్నది
- జింకా రామారావు, చిత్రకారుడు, పాత్రికేయుడు.[1]
విద్యుత్తు విశేషాలుసవరించు
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసింది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి, ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]
మూలాలుసవరించు
- ↑ మన తెలంగాణ, దునియా (3 January 2019). "జింకా జీవకళ". Archived from the original on 12 December 2020. Retrieved 12 December 2020.