హోలోకాస్ట్

యూదులపై నాజీ జర్మనీ జరిపిన మారణహోమం

రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపాలో యూదులపై జరిపిన మారణహోమాన్ని హోలోకాస్ట్ అంటారు. 1941, 1945 మధ్య నాజీ జర్మనీ, దానికి సహకరించిన వివిధ దేశాల ప్రభుత్వాలు కలిసి జర్మనీ-ఆక్రమిత ఐరోపా అంతటా దాదాపు 60 లక్షల మంది యూదులను ఒక క్రమపద్ధతిలో హత్య చేశారు. ఇది ఐరోపాలో అప్పుడున్న యూదు జనాభాలో మూడింట రెండు వంతులు. హత్యలు ప్రధానంగా ఆక్రమిత పోలాండ్‌లోని ఆష్విట్జ్-బిర్కెనౌ, ట్రెబ్లింకా, బెల్జెక్, సోబిబోర్, చెల్మ్నో వంటి నిర్మూలన శిబిరాల్లో, సామూహిక కాల్పులు జరపడం, విషవాయువు ప్రయోగించడం ద్వారా జరిగాయి.

హోలోకాస్ట్
Part of రెండవ ప్రపంచ యుద్ధం
రైలు కట్ట పక్కనే పెద్ద సంఖ్యలో నిలబడ్డ ప్రజలు - నేపథ్యంలో శిబిరం గేటు
ఆక్రమిత పోలండు (1939–1945) లోని ఆష్విట్జ్ కాన్సెంట్రేషను క్యాంపుకు యూదుల రాక -1944 మే. వీరిలో చాలామందిని గ్యాస్ ఛాంబరు లోకి పంపారు.
ప్రదేశంఐరోపా. ముఖ్యంగా జర్మనీ ఆక్రమిత పోలండు,సోవియట్ యూనియన్
తేదీ1941–1945[1]
దాడి రకం
మారణహోమం, సామూహిక కాల్చివేత, విష వాయువు
మరణాలుదాదాపు 60 లక్షల యూదులు
నేరస్తులునాజీ జర్మనీ, దాని సహకుట్రదారులు, మిత్ర పక్షాలు

నాజీలు జాత్యహంకార రాజకీయాలను, తూర్పు ఐరోపాలో జర్మన్ వలసరాజ్యాలనూ ఆధారంగా చేసుకుని తమ భావజాలాన్ని అభివృద్ధి చేశారు. 1933 ప్రారంభంలో వారు జర్మనీలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జర్మన్ యూదులందరినీ బలవంతంగా వలస పంపించే ప్రయత్నంలో భాగంగా నాజీ పాలనా వ్యవస్థ, యూదు వ్యతిరేక చట్టాలు చేసి 1938 నవంబరులో దేశవ్యాప్తంగా హింస జరిపింది. 1939 సెప్టెంబరులో జర్మనీ పోలండ్‌ను ఆక్రమించుకున్నాక, అక్కడి అధికారులు యూదులను వేరు చేయడానికి ఘెట్టోలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. 1941 జూన్ లో సోవియట్ యూనియన్‌ను ఆక్రమించుకున్నాక, ఆ దేశంలో దాదాపు 15 నుండి 20 లక్షల మంది యూదులను జర్మనీ దళాలు, వారి స్థానిక సహకారులూ కాల్చి చంపారు.

తర్వాత 1941 లో లేదా 1942 ప్రారంభంలో జర్మనీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు ఐరోపా‌లోని యూదులందరినీ హత్య చేయాలని నిర్ణయించారు. బాధితులను రైళ్ళ ద్వారా నిర్మూలన శిబిరాలకు పంపారు. ప్రయాణంలోనే చనిపోకుండా బయటపడినవారిని విషవాయువుతో చంపారు. ఇతర యూదులను బలవంతపు కార్మిక శిబిరాల్లో పని చేయించడం కొనసాగించారు. అక్కడ చాలామంది ఆకలితోనో నీరసం, బలహీనలతల తోనో మరణించారు. చాలా మంది యూదులు తప్పించుకున్నప్పటికీ, తగినంత డబ్బు లేకపోవడం, దొరికిపోయే అవకాశం వంటి కారణాల వల్ల అజ్ఞాతంలో జీవించడం చాలా కష్టమయ్యేది. హత్యకు గురైన యూదుల ఆస్తి, గృహాలు, ఉద్యోగాలను జర్మన్ ఆక్రమణదారులకు, ఇతర యూదేతరులకూ పంపిణీ చేసారు. హోలోకాస్ట్ బాధితుల్లో ఎక్కువ మంది 1942 లో మరణించినప్పటికీ, 1945 మేలో యుద్ధం ముగిసే వరకు హత్యలు, తక్కువ స్థాయిలో నైనా, కొనసాగుతూనే ఉన్నాయి.

కొన్ని ఐరోపా దేశాలలో యుద్ధ సంబంధ పౌర మరణాలలో యూదులే మెజారిటీగా ఉన్నప్పటికీ, నాజీ ప్రభుత్వం, దాని మిత్రదేశాలు లక్షలాది మంది యూదేతరులను కూడా చంపాయి. చావు నుండి తప్పించుకున్న యూదులు చాలా మంది యుద్ధం తర్వాత ఐరోపా నుండి వలస వెళ్ళారు. కొంతమంది హోలోకాస్ట్ నేరస్థులు నేర విచారణలను ఎదుర్కొన్నారు. బిలియన్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించబడ్డాయి. ఎంతైనా, యూదులకు జరిగిన నష్టాల కంటే ఇవి తక్కువే. మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, సంస్కృతిలో హోలోకాస్ట్ జ్ఞాపకాలు భద్రమయ్యాయి. మానవ క్రూరత్వానికి పరాకాష్ఠగా ఇది, పాశ్చాత్య చారిత్రక స్పృహకు కేంద్రంగా మారింది.

ఈ మారణహోమాన్ని ఒకప్పుడు "జెవిష్ హోలోకాస్ట్" అని అనేవారు. ఆ తరువాత జెవిష్ అనే విశేషణాన్ని తీసివేసి హోలోకాస్ట్ అని మాత్రమే పిలుస్తున్నారు. హీబ్రూ భాషలో దీన్ని షోవా అంటారు.

నాజీ జర్మనీ ఆవిర్భావం మార్చు

 
1933 నుండి 1941 వరకు జర్మనీ రాజ్య విస్తరణ

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ విచ్ఛిన్నాల నేపథ్యంలో నాజీ పార్టీ తన మద్దతును వేగంగా పెంచుకుంది, 1932 మధ్యలో జరిగిన ఎన్నికలలో 37 శాతం వోట్లు పొందే స్థాయికి చేరుకుంది,[2][3] కమ్యూనిజం వ్యతిరేకత, ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రచారం చేసి దీన్ని సాధించింది. 1933 జనవరిలో మితవాద రాజకీయ నాయకుల మద్దతుతో, తెరవెనక జరిగిన ఒప్పందంలో హిట్లర్, జర్మనీ ఛాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[2] కొన్ని నెలల్లోనే అతను అన్ని ఇతర రాజకీయ పార్టీలను నిషేధించాడు. మీడియాపై ప్రభుత్వం నియంత్రణ సాధించింది.[4] పదివేల మంది రాజకీయ ప్రత్యర్థులను-ముఖ్యంగా కమ్యూనిస్టులను-అరెస్టు చేసారు. చట్టవిరుద్ధమైన ఖైదు కోసం శిబిరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు.[5] నాజీ ప్రభుత్వం, నేరాలు సంఘ బహిష్కృతుల పైన - రోమా సింటి, స్వలింగ సంపర్కులు, పనిదొంగలు మొదలైన వారు - వివిధ చర్యలతో నిర్బంధ శిబిరాల్లో ఖైదు చేసింది.[6] నాజీలు 4,00,000 మందిపై బలవంతంగా కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశారు. మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఉన్నాయని చెప్పి గర్భస్రావాలు చేయించారు.[7][8][9]

నాజీలు పబ్లిక్, ప్రైవేట్ జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రించాలని ప్రయత్నించినప్పటికీ,[10] వారి అణచివేత పద్ధతులను, జాతీయ సమాజానికి సంబంధించి బయటివారుగా భావించిన సమూహాలపైననే పూర్తిగా కేంద్రీకరించారు. చాలామంది జర్మన్లు - కొత్త ప్రభుత్వాన్ని వ్యతిరేకించనట్లయితే - భయపడాల్సిన అవసరం లేదు.[11][12] కొత్త పాలన ఆర్థిక వృద్ధి ద్వారా ప్రజా మద్దతును సాధించింది. ఇది పాక్షికంగా పునరాయుధీకరణ వంటి ప్రభుత్వ చర్యల ద్వారా సంభవించింది.[4] ఆస్ట్రియా (1938), సుడేటెన్‌ల్యాండ్ (1938), బోహేమియా, మొరావియా (1939)ల విలీనాలు కూడా నాజీల ప్రజాదరణను పెంచాయి.[13] నాజీలు యూదుల పైన,[4] తాము లక్ష్యంగా పెట్టుకున్న ఇతర సమూహాల పైనా చేసిన వ్యతిరేక ప్రచారం జర్మనీ ప్రజల్ని ముంచెత్తింది.[8]

యూదులపై హింస మార్చు

1933లో జర్మనీ దేశ జనాభాలో యూదులు 1 శాతం కంటే తక్కువగా, దాదాపు 5,00,000 మంది ఉన్నారు. వారు సగటున ఇతర జర్మన్‌ల కంటే సంపన్నులు. వారిలో కొందరు ఇతరులతో మైనారిటీ తూర్పు ఐరోపా నుండి ఇటీవల వలస వచ్చినప్పటికీ బాగా కలిసిపోయారు.[14][15][16] వివిధ జర్మన్ ప్రభుత్వ సంస్థలు, నాజీ పార్టీ సంస్థలు, స్థానిక అధికారులూ దాదాపు 1,500 యూదు వ్యతిరేక చట్టాలు చేసారు.[17] 1933లో, యూదులు అనేక వృత్తులు, పౌర సేవల నుండి నిషేధించబడ్డారు లేదా పరిమితం చేయబడ్డారు.[13] 1934 చివరినాటికి జర్మన్ యూదులను ప్రజా జీవితం నుండి వేటాడిన తర్వాత, ప్రభుత్వం 1935లో నూరెంబర్గ్ చట్టాలను ఆమోదించింది.[18] ఈ చట్టాలు "జర్మన్ లేదా సంబంధిత రక్తం కలిగిన" వారికి పూర్తి పౌరసత్వ హక్కులను కేటాయిస్తూ, యూదుల ఆర్థిక నియంత్రణను పరిమితం చేసింది. యూదులు, యూదుయేతర జర్మన్‌ల మధ్య వివాహాలు, లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించారు.[19][20] ముగ్గురు లేదా నలుగురు యూదు తాతలు ఉన్నవారు యూదులు అని నిర్వచించారు; పాక్షిక యూదు సంతతికి చెందిన వారిలో చాలా మంది వివిధ హక్కులతో మిష్లింగేగా వర్గీకరించబడ్డారు.[21] దేశం నుండి అంతిమంగా అదృశ్యమయ్యే ఉద్దేశంతో యూదులను వేరుచేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించింది.[18] యూదు విద్యార్థులు క్రమంగా పాఠశాల వ్యవస్థ నుండి బయటకు నెట్టబడ్డారు. కొన్ని మునిసిపాలిటీలు యూదులు నివసించడానికి లేదా వ్యాపారాలు చేసుకోవడానికీ పరిమితులను విధించాయి.[22] 1938, 1939లో, యూదులు అదనపు వృత్తులు చేపట్టకుండా నిరోధించారు. ఆర్థిక వ్యవస్థ నుండి వారిని బలవంతంగా బయటకు నెట్టడానికి వారి వ్యాపారాలను వెలివేసారు.[20]

 
క్రిస్టల్‌నాచ్ట్ సమయంలో నాశనం చేయబడిన తర్వాత ఆచెన్‌లోని పాత ప్రార్థనా మందిర దృశ్యం

స్థానికంగా నాజీ పార్టీ సంస్థల సభ్యులే ఎక్కువగా యూదు వ్యతిరేక హింస చేసారు. 1933 నుండి 1939 వరకు అది ప్రాణాంతకం కాని రూపాల్లో ఉండేది.[23] యూదు దుకాణాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, బహిష్కరించారు లేదా ధ్వంసం చేసారు.[24] స్థానికంగా లభించిన ప్రజాదరణ, ఒత్తిడి ఫలితంగా, అనేక చిన్న పట్టణాల నుండి యూదులను పూర్తిగా వెళ్ళగొట్టారు. యూదుల వ్యాపారాలలో మూడింట ఒక వంతును మూసివేయవలసి వచ్చింది.[25] నాజీ జర్మనీ స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో యూదు వ్యతిరేక హింస మరింత దారుణంగా ఉంది.[26] 1938 నవంబరు 9-10 న, నాజీలు క్రిస్టల్‌నాచ్ట్ (నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్)ని దేశవ్యాప్తంగా హింసాత్మకంగా నిర్వహించారు. మొత్తం 9,000 యూదుల దుకాణాల్లో 7,500 పైగా దుకాణాలను దోచుకున్నారు. 1,000 కంటే ఎక్కువ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసారు.[27] కనీసం 90 మంది యూదులను హత్య చేసారు,[28] 30,000 మంది యూదు పురుషులను అరెస్టు చేసారు.[29][30] అయితే కొద్ది వారాల్లోనే చాలా మంది విడుదల చేసారు.[31] జర్మన్ యూదులపై ప్రత్యేక పన్ను విధించారు. దీని వలన 1 బిలియన్ రీచ్‌మార్క్‌ల (RM) మొత్తం వసూలైంది.[32]

యూదులందరినీ జర్మనీ నుండి వెలివెయ్యాలని నాజీ ప్రభుత్వం భావించింది.[33] 1939 చివరి నాటికి, వలస వెళ్ళగలిగే చాలా మంది యూదులు అప్పటికే వెళ్ళిపోయారు; వెళ్ళకుండా ఉండిపోయినవారు బాగా వృద్ధులు, పేదలు లేదా స్త్రీలు, వీసా పొందలేని వారు.[34] దాదాపు 1,10,000 మంది అమెరికాకు వెళ్లిపోగా, కొద్ది సంఖ్యలో దక్షిణ అమెరికా, షాంఘై, పాలస్తీనా, దక్షిణాఫ్రికాలకు వలస వెళ్లారు.[35] జర్మనీ దాదాపు 1 బిలియన్ RM వలస పన్నులను వసూలు చేసింది. ఇందులో ఎక్కువగా యూదుల నుండే.[36][37] ఈ బలవంతపు వలస విధానం 1940 వరకు కొనసాగింది.

జర్మనీతో పాటు, గణనీయమైన సంఖ్యలో ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం పోయి, ఏదో ఒక విధమైన నియంతృత్వ లేదా ఫాసిస్ట్ పాలన ఏర్పడింది.[38] బల్గేరియా, హంగేరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియాతో సహా అనేక దేశాలు 1930, 1940లలో సెమిటిక్ వ్యతిరేక చట్టాలను ఆమోదించాయి.[39] 1938 అక్టోబరులో, విదేశాల్లో నివసిస్తున్న పోలిష్ యూదుల పౌరసత్వాన్ని రద్దు చేసే పోలిష్ చట్టానికి ప్రతిస్పందనగా జర్మనీ చాలా మంది పోలిష్ యూదులను బహిష్కరించింది.[40][41]

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం మార్చు

 
జర్మనీలో స్వేచ్ఛా నగరం విలీనమైన కొద్దిసేపటికే హిట్లర్ కోసం డాన్జిగర్లు ర్యాలీ చేస్తున్నారు

జర్మనీ వెర్మాక్ట్ (సాయుధ దళాలు) 1939 సెప్టెంబరు 1 న పోలాండ్‌పై దాడి చేసింది.[42] ఐదు వారాల పోరాటంలో, దాదాపు 16,000 మంది పౌరులు, బందీలు, యుద్ధ ఖైదీలను జర్మన్ ఆక్రమణదారులు కాల్చివేసి ఉండవచ్చు;[43] పెద్ద మొత్తంలో దోపిడీ కూడా జరిగింది.[44] ఏదైనా ప్రతిఘటన ఎదురైతే తొలగించడానికి ఐన్సాట్జ్‌గ్రుప్పెన్ అనే ప్రత్యేక విభాగాలు సైన్యాన్ని అనుసరించాయి.[45] దాదాపు 50,000 మంది పోలిష్, పోలిష్ యూదు నాయకులు, మేధావులను అరెస్టు చేసారు లేదా ఉరితీసారు.[46][47] ఈ ఏరివేతల్లో చంపబడని పోలిష్ మేధావులను ఉంచడానికి ఆష్విట్జ్ నిర్బంధ శిబిరాన్ని స్థాపించారు.[48] 1939 నుండి 1941 వరకు పశ్చిమ పోలాండ్‌లోని వార్తేలాండ్ నుండి దాదాపు 400,000 పోలిషు ప్రజలను జనరల్ గవర్నరేట్ ఆక్రమణ జోన్‌కు బహిష్కరించారు. తూర్పు ఐరోపా నుండి జర్మను జాతీయులను రప్పించి ఈ ప్రాంతంలో పునరావాసం కల్పించారు.[49]

పోలాండ్‌లోని మిగిలిన భాగాన్ని సోవియట్ యూనియన్ ఆక్రమించింది. జర్మనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్ సెప్టెంబరు 17న తూర్పు నుండి పోలాండ్‌పై దాడి చేసింది.[50] సోవియట్ యూనియన్ వందల వేల మంది పోలిష్ పౌరులను సోవియట్ ఇంటీరియర్‌కు బహిష్కరించింది. వీరిలో దాదాపు 2,60,000 మంది యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడ్డ యూదులు.[51][52] చాలా మంది యూదులు, స్వయంగా తాము కమ్యూనిస్టులు కానప్పటికీ, సోవియట్ ప్రభుత్వంలో పదవులు స్వీకరించారు. సోవియట్ పాలన అనేది యూదుల కుట్ర ఫలితమే అనే నాజీ ప్రచారాన్ని యూదేతరులు నమ్మడానికి ఇది దోహదపడింది.[53] జర్మనీ 1940 లో నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, డెన్మార్క్, నార్వేలతో సహా పశ్చిమ ఐరోపాలో చాలా వరకు ఆక్రమించింది.[42] 1941లో యుగోస్లేవియా, గ్రీస్‌లను ఆక్రమించింది.[42] ఈ కొత్త రాజ్యాలలో కొన్నిటిని పూర్తిగా లేదా పాక్షికంగా జర్మనీలో విలీనం చేసారు. మరికొన్నిటిని పౌర లేదా సైనిక పాలనలో ఉంచారు.[43]


మానసిక, శారీరక వైకల్యాలు ఉన్న దాదాపు 70,000 మంది జర్మన్‌లను ప్రత్యేక హత్యా కేంద్రాలలో విష వాయువులు ఉపయోగించి హత్య చేసేందుకు ఈ యుద్ధాన్ని ఒక ముసుగు లాగా వాడుకున్నారు.[49][54][55] బాధితుల్లో మొత్తం 4,000 నుండి 5,000 మంది యూదులు ఉన్నారు.[56] గోప్యతను కాపాడే ప్రయత్నాలు చేసినప్పటికీ, హత్యల గురించిన జ్ఞానం బయటకు పొక్కడంతో హిట్లర్, 1941 ఆగస్టులో కేంద్రీకృత హత్యల కార్యక్రమాన్ని నిలిపివేయమని ఆదేశించాడు.[57][58][59] వైద్య సంరక్షణ, ఆకలి చావులు, విషప్రయోగం ద్వారా చేసిన వికేంద్రీకృత హత్యలు, యుద్ధం ముగిసే సమయానికి మరో 1,20,000 మంది మరణాలకు కారణమయ్యాయి.[58][60] అవే సాంకేతికతలను తదనంతర కాలంలో యూదుల సామూహిక హత్యల కోసం వాడారు.[61][62]

ఘెట్టోలు, పునరావాసం మార్చు

 
ఫ్రైజ్‌టాక్ ఘెట్టో, క్రాకోవ్ జిల్లాలోని చదును చేయని వీధి
 
జనరల్ గవర్నరేట్‌లోని వార్సా ఘెట్టో వీధిలో మృతదేహం పడి ఉంది

జర్మనీ, పోలాండ్‌లో 17 లక్షల మంది యూదులపై నియంత్రణ సాధించింది.[16][63] నాజీలు జనరల్ గవర్నరేట్‌లోని లుబ్లిన్ జిల్లాలో యూదులను కేంద్రీకరించడానికి ప్రయత్నించారు. నవంబరు నాటికి 45,000 మంది యూదులను బహిష్కరించారు. నాజీలు అనేక మంది మరణాలకు కారణమయ్యారు.[64] జనరల్ గవర్నరేట్ నాయకుడు హన్స్ ఫ్రాంక్ వ్యతిరేకించడంతో 1940 ప్రారంభంలో అక్కడికి బహిష్కరించడం ఆగిపోయింది. తన రాజ్యం వెలివేసిన యూదులకు డంపింగ్ గ్రౌండ్‌గా మారడం అతనికి ఇష్టం లేదు.[65][66] ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, నాజీలు యూదులను ఫ్రెంచ్ మడగాస్కర్‌కు బహిష్కరించాలని భావించారు గానీ, ఇది సాధ్యపడదని తేలింది.[67][68] అక్కడి కఠినమైన పరిస్థితుల వలన చాలా మంది యూదులు మరణిస్తారని నాజీలు ప్లాన్ చేశారు.[67][66]

దండయాత్ర సమయంలో, యూదుల ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు. వేలాది మంది యూదులు పారిపోయారు. లేదా వారిని నాజీలు సోవియట్ ఆక్రమిత పోలండు ప్రాంతంలోకి వెళ్ళగొట్టారు.[69] వివిధ యూదు వ్యతిరేక నిబంధనలను జారీ చేసారు. 1939 అక్టోబరులో, జనరల్ గవర్నరేట్‌లోని వయోజన యూదులు బలవంతంగా పని చేయవలసి వచ్చింది.[70] వారు తెల్లటి గుడ్డను భుజానికి కట్టుకోవాలని 1939 నవంబరులో ఆదేశించారు.[71] చాలామంది యూదుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, యూదుల యాజమాన్యంలోని వ్యాపారాలను స్వాధీనం చేసుకోవాలనీ చట్టాలు చేసారు. యూదులను ఘెట్టోలలోకి బలవంతంగా వెళ్ళగొట్టినప్పుడు, వారి ఇళ్లు, సామాన్లను ఆక్రమించుకున్నారు.[70]

స్థానిక జర్మన్ నిర్వాహకుల చొరవతో 1939, 1940లో వార్తేల్యాండ్, జనరల్ గవర్నరేట్‌లో మొదటి నాజీ ఘెట్టోలను స్థాపించారు.[72][73] వార్సా, లోడ్జ్ వంటి అతిపెద్ద ఘెట్టోలు ఇప్పటికే ఉన్న నివాస పరిసరాల్లో స్థాపించారు. వాటి చుట్టూ కంచెలు లేదా గోడలు నిర్మించారు. బలవంతపు కార్మిక కార్యక్రమాలు చాలా మంది ఘెట్టో నివాసులకు జీవనోపాధిని అందించాయి. కొన్ని సందర్భాల్లో వారిని బహిష్కరణ నుండి రక్షించాయి. కొన్ని ఘెట్టోల లోపల వర్క్‌షాప్‌లు, కర్మాగారాలు ఉండేవి. మరికొన్ని సందర్భాల్లో యూదులు ఘెట్టో వెలుపల పని చేయడానికి వెళ్ళేవారు.[74] ఘెట్టోల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసే ఉండనిచ్చేవారు కాబట్టి కొన్ని కుటుంబాలు కలిసి జీవించేవారు.[75] ఒక యూదు సంఘం నాయకత్వం (జుడెన్‌రాట్) జర్మన్ డిమాండ్లను అనుసరిస్తూనే కొంత అధికారాన్ని వినియోగించుకుని యూదు సమాజాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది. మనుగడ సాగించే వ్యూహంలో భాగంగా కొందరు, చాలా మంది ఘెట్టోలను జర్మన్ల కోసం పనిచేసే కార్మికుల స్థావరాలుగా మార్చేందుకు ప్రయత్నించారు.[76][77] పశ్చిమ ఐరోపాలోని యూదులను ఘెట్టోలలోకి బలవంతంగా పంపనప్పటికీ, వారిపై వివక్షాపూరిత చట్టాలు, ఆస్తుల జప్తులు వగైరాలు జరిగాయి.[78][79][80]

తూర్పు ఐరోపాలో యూదు, యూదుయేతర మహిళలపై అత్యాచారాలు, లైంగిక దోపిడీలు జరగడం సర్వసాధారణంగా ఉండేది.[81]

సోవియట్ యూనియన్‌ను ఆక్రమించారు మార్చు

జర్మనీ, దాని మిత్రదేశాలు స్లోవేకియా, హంగరీ, రొమేనియా, ఇటలీలు 1941 జూన్ 22 న సోవియట్ యూనియన్‌పై దండయాత్ర చేశాయి.[82][66] సైద్ధాంతిక కారణాల కంటే వ్యూహాత్మక కారణాల వల్లనే హిట్లర్ ఆ యుద్ధాన్ని ప్రారంభించాడు.[83] యూదుల బోల్షెవిజం[84] శక్తులను నిర్మూలించే వినాశకరయుద్ధమని చెప్పాడు. యుద్ధ చట్టాలు, ఆచారాలను పూర్తిగా పల్లనపెట్టాడు.[85][86] త్వరగా గెలిచేస్తామని భావించాడు.[87] 3.1 కోట్ల మంది ప్రజలను తొలగించి వారి స్థానంలో జర్మన్లను తీసుకువచ్చే భారీ జనాభా ఇంజనీరింగ్ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రణాళిక చేసారు.[88] ఆక్రమణ వేగాన్ని పెంచే క్రమంలో జర్మన్లు తమ సైన్యానికి ఆహారం కోసం, దోచుకోవడం, జర్మనీకి అదనపు ఆహారాన్ని ఎగుమతి చేయడం, హత్యలతో స్థానిక నివాసులను భయభ్రాంతులకు గురిచేయడాం వంటి ప్రణాళికలు వేశారు.[89][90] దండయాత్ర వల్ల ఆహార కొరత ఏర్పడుతుందని జర్మన్‌లు ముందే ఊహించారు. సోవియట్ నగరాలు, కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు సామూహికంగా ఆకలితో అలమటించేలా చేయాలని ప్రణాళిక వేశారు.[91][92][93] ఈ ఆకలి విధానం ప్లానర్లు ఆశించిన దానికంటే తక్కువ విజయవంతమైనప్పటికీ,[94] కొన్ని నగరాల్లోని ప్రజలు, ముఖ్యంగా ఉక్రెయిన్ లోని నగరాల్లో, ముట్టడిలో ఉన్న లెనిన్‌గ్రాడ్‌లో, యూదుల ఘెట్టోల్లో, కృత్రిమ కరువు వ్యాపించింది. ఆ సమయంలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో చనిపోయారు.[95][96]

 
సోవియట్ ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన బెలారసియన్ యూదుడు మాషా బ్రస్కినాకు బహిరంగ మరణశిక్ష విధించారు

జర్మన్ సైన్యం వద్ద బందీలుగా ఉన్న సోవియట్ యుద్ధ ఖైదీలను పెద్ద సంఖ్యలో చంపాలని భావించారు. అరవై శాతం—33 లక్షల మంది—ప్రాథమికంగా ఆకలితో చనిపోయారు.[97][98] ఐరోపా యూదుల తర్వాత నాజీ సామూహిక హత్యల బాధితుల్లో రెండవ అతిపెద్ద సమూహం వారు.[99][100] యూదుల యుద్ధ ఖైదీలు, కమిస్సార్లను క్రమపద్ధతిలో ఉరితీసారు.[101][102] బేలారస్‌లో 3,00,000 కంటే పైచిలుకు ప్రజలతో సహా సుమారు పది లక్షల మంది పౌరులను నాజీలు చంపారు.[103][104] 1942 నుండి, జర్మన్లు, వారి మిత్రదేశాలూ పక్షపాతులకు మద్దతు ఇస్తున్నట్లు అనుమానించిన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తగలబెట్టి, అక్కడి ప్రజలను చంపడం లేదా పారదోలడం చేసారు.[105] ఈ కార్యకలాపాల సమయంలో, సమీపంలోని చిన్న ఘెట్టోలను మూసేసి, అక్కడి నివాసులను కాల్చి చంపారు.[106] 1943 నాటికి, పక్షపాత వ్యతిరేక కార్యకలాపాలు బెలారస్ లోని పెద్ద ప్రాంతాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.[107][108] యూదులను, పనికి చేయలేనివారినీ సాధారణంగా అక్కడికక్కడే కాల్చివేసేవారు. ఇతరులను బహిష్కరించేవారు.[106][109] చంపబడిన వారిలో ఎక్కువ మంది యూదులు కానప్పటికీ,[104][107] పక్షపాత వ్యతిరేక యుద్ధంలో తరచూ యూదులే ఎక్కువగా మరణించేవారు.[110]

యూదులపై సామూహిక కాల్పులు మార్చు

 
1941 ఎల్వివ్ హింసాకాండలో కనీసం 3,000 మంది యూదులు చంపబడ్డారు, ప్రధానంగా స్థానిక ఉక్రేనియన్లు.[111]

సోవియట్ యూనియన్‌లో యూదుల క్రమబద్ధమైన హత్య ప్రారంభమైంది.[112] దండయాత్ర సమయంలో, చాలా మంది యూదులు ఎర్ర సైన్యంలోకి నిర్బంధ నియామకాలు చేసారు. తూర్పు వైపు సోవియట్ అంతర్గత ప్రాంతానికి పారిపోయిన కోటి-కోటిన్నర సోవియట్ పౌరులలో 16 లక్షల మంది యూదులు.[113][76] లాట్వియా, లిథువేనియా, తూర్పు పోలాండ్, ఉక్రెయిన్, రొమేనియన్ సరిహద్దు ప్రాంతాలలో జరిగిన హింసాకాండలో స్థానిక నివాసులు దాదాపు 50,000 మంది యూదులను చంపారు.[114][115] జర్మన్ దళాలు హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పటికీ, హింస చెయ్యడంలో వారి పాత్ర వివాదాస్పదమైంది.[116][117] రొమేనియన్ సైనికులు 1942 ఏప్రిల్ నాటికి ఒడెస్సాకు చెందిన పదివేల మంది యూదులను చంపారు[118][119]

దండయాత్రకు ముందు, సామూహిక హత్యలకు సన్నాహకంగా ఐన్‌స్ట్‌గ్రుప్పెన్ ను పునర్వ్యవస్థీకరించారు. సోవియట్ అధికారులను, ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న యూదు ఉద్యోగులను కాల్చివేయమని ఆదేశించారు.[120] కమ్యూనిస్టు వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో యూదులు ప్రధాన పాత్ర పోషించారనే భావన ఆధారంగా కాల్పులు సమర్థించబడ్డాయి. అయితే సోవియట్ యూదులందరినీ చంపాలని మొదట్లో అనుకోలేదు.[121][122] ఆక్రమణదారులు యూదులను లక్ష్యంగా చేసుకోవడానికి స్థానికులపై ఆధారపడ్డారు.[123] జర్మన్లు మొదట్లో చేసిన సామూహిక హత్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు లేదా చదువుకున్నవారు మాత్రమే చెయ్యగలిగే ఉద్యోగాలలో పనిచేస్తున్న యూదు పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు. జూలై చివరి నాటికి పదివేల మందిని కాల్చి చంపారు. బాధితుల్లో అత్యధికులు యూదులు.[118] జూలై, ఆగస్టులలో SS ( షుట్జ్‌స్టాఫెల్ ) నాయకుడు హీన్రిచ్ హిమ్లర్, డెత్ స్క్వాడ్స్ ఆపరేషన్ జోన్‌లను అనేకసార్లు సందర్శించి, మరింత మంది యూదులను చంపాలని ఆదేశాలు జారీ చేశాడు.[124] ఈ సమయంలో, హంతకులు యూదు స్త్రీలు, పిల్లలను కూడా హత్య చేయడం ప్రారంభించారు.[124][125] లిథువేనియాలో ఆగస్టు, సెప్టెంబరుల్లో అమలు చేసిన మరణశిక్షలు నెలకు 40,000కి చేరుకున్నాయి. అక్టోబరు, నవంబరులో బెలారస్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.[126]

 
ఒరిజినల్ నాజీ ప్రచార శీర్షిక: "బుల్లెట్‌ కూడా దండగే.. ఇక్కడ చూపిన యూదులందరినీ ఒకేసారి కాల్చి చంపారు." 1941 జూన్ 28 న బెలారస్ లోని రోజాంకాలో
 
హంతకులు వారి బాధితుల ముఖాలను చూడనవసరం లేకుండాను, చనిపోయినవారు సమాధిలో పడేటట్లు గానూ వెనుక నుండి కాల్చే పద్ధతి[127]

మరణశిక్షలు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగేవి. బాధితులను చుట్టుముట్టి శిక్షాప్రదేశానికి తరలించి, బలవంతంగా బట్టలు విప్పించి, కాల్చి, ముందే తవ్విపెట్టిన గుంటలలోకి పడేసేవారు.[128] ఒకే బుల్లెట్‌తో మెడ వెనుక భాగంలో కాల్చడం వాళ్ళకు నచ్చిన పద్ధతి.[129] ఈ కాల్పుల సమయంలో రేగే గందరగోళంలో, చాలా మంది బాధితులు తుపాకీ కాల్పుల్లో మరణించేవారు కాదు. వారిని సజీవంగానే పాతిపెట్టేవారు. సాధారణంగా, ఈ హత్యల తర్వాత గుంటలవద్ద కాపలాగా ఉంటుంది గానీ కొన్నిసార్లు కొంతమంది బాధితులు తప్పించుకోగలిగారు.[128] మరణశిక్షలు బహిరంగంగా జరిగేవి. బాధితుల ఆస్తులను ఆక్రమణదారులు, స్థానిక నివాసులు దోచుకునేవారు.[130] ఆక్రమిత సోవియట్ యూనియన్‌లో దాదాపు 200 ఘెట్టోలు స్థాపించారు. వాటిలో చాలావరకు నివాసులను చంపెయ్యగానే మూసేసారు. విల్నా, కోవ్నో, రిగా, బియాలిస్టోక్, ల్వో వంటి కొన్ని పెద్ద ఘెట్టోలు 1943 వరకు కొనసాగాయి. ఎందుకంటే అవి ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి.[76]

మొత్తం సోవియట్ యూదు జనాభాను లక్ష్యంగా చేసుకుని హత్యలు విస్తరించిన తర్వాత, ఐన్‌సాట్జ్‌గ్రుప్పెన్‌లోని 3,000 మంది సైనికులు సరిపోలేదు. హిమ్లర్ వారికి సహాయంగా ఆర్డర్ పోలీస్ కు చెందిన 21 బెటాలియన్లను సమీకరించాడు.[124] అదనంగా, వెర్మాక్ట్ సైనికులు, వాఫెన్-SS బ్రిగేడ్‌లు, స్థానిక సహాయకులు అనేక మంది యూదులను కాల్చిచంపారు.[128][131][132] 1941 చివరి నాటికి, మధ్య ఉక్రెయిన్, తూర్పు బెలారస్, రష్యా, లాట్వియా, లిథువేనియాల్లో 80 శాతం కంటే ఎక్కువ మంది యూదులను కాల్చి చంపారు.[133] యుద్ధం ముగిసే సమయానికి, దాదాపు 15 నుండి 20 లక్షల మంది యూదులను 2,25,000 మంది రోమాలనూ కాల్చిచంపారు.[112][134] ఈ హత్యలు శ్రమగానూ, రవాణాపరంగా అసౌకర్యంగానూ ఉన్నాయని హంతకులు భావించారు. అందుకని వారు ఇతర హత్యా పద్ధతులను కనిపెట్టాలని భావించారు.[135]

ఐరోపా అంతటా క్రమబద్ధమైన వెలివేతలు మార్చు

యూరోప్ అంతటా ఉన్న యూదులందరినీ చంపాలని హిట్లర్ స్పష్టమైన ఆజ్ఞను జారీ చేశాడని చాలా మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు,[136] అయితే ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయి.[137][138] కొంతమంది చరిత్రకారులు హిట్లర్, ఇతర నాజీ నాయకులు చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలు, సెర్బియా యూదులపై జరిపిన సామూహిక కాల్పులు, పోలాండ్‌లో నిర్మూలన శిబిరాలు నిర్మించే ప్రణాళికలు, జర్మన్ యూదుల బహిష్కరణలు మొదలైనవి 1941 డిసెంబరుకు ముందు తీసుకున్న తుది నిర్ణయానికి సూచికలు అని ఉదహరిస్తారు.[137][139] మరి కొందరు, ఇవి స్థానిక నాయకులు తీసుకున్న నిర్ణయాలేననీ, తుది నిర్ణయం తీసుకున్నది ఆ తరువాతనేననీ వాదిస్తారు.[137] 1941 డిసెంబరు 5 న సోవియట్ యూనియన్ తన మొదటి పెద్ద ఎదురుదాడిని ప్రారంభించింది. డిసెంబరు 11 న జపాన్ పెరల్ హార్బర్‌పై దాడి చేసిన తర్వాత హిట్లర్ యునైటెడ్ స్టేట్స్‌పై యుద్ధం ప్రకటించాడు.[140][141] మరుసటి రోజున, అతను 1939 నాటి తన ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ, "ప్రపంచ యుద్ధం వచ్చేసింది; యూదుల వినాశనమే దీనికి ఆవశ్యక పర్యవసానం." అని నాజీ పార్టీ నేతలతో అన్నాడు.[141][142]

యావత్తు ఖండమంతా వ్యాపించిన మారణహోమాన్ని నిర్వహించడానికి నాజీలకు దీని తర్వాత చాలా నెలలు పట్టింది.[141] రీచ్ మెయిన్ సెక్యూరిటీ ఆఫీస్ (RSHA) అధిపతి అయిన రీన్‌హార్డ్ హేడ్రిచ్ 1942 జనవరి 20 న వాన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఉన్నత స్థాయి సమావేశం యూదు వ్యతిరేక విధానాన్ని సమన్వయం చేయడానికి ఉద్దేశించాడు.[143] హోలోకాస్ట్ హత్యలలో ఎక్కువ భాగం 1942 లోనే జరిగాయి. హోలోకాస్ట్ బాధితుల్లో 20 లేదా 25 శాతం మంది 1942 ప్రారంభంలో మరణించగా, సంవత్సరం చివరి నాటికి అంతే సంఖ్యలో జీవించి ఉన్నారు.[144][145]

నిర్మూలన శిబిరాలు మార్చు

 
చెల్మ్నోకు బహిష్కరణ

1939 నుండి మానసిక రోగులను చంపడానికి ఉపయోగించే వ్యానుల నుండి అభివృద్ధి చేసిన గ్యాస్ వ్యాన్‌లను ఐన్‌సాట్జ్‌గ్రుప్పెన్‌కు కేటాయించారు. వాటిని మొదటగా 1941 నవంబరులో ఉపయోగించారు; బాధితులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి ఇంజిన్ ఎగ్జాస్ట్‌తో చంపారు.[146] హిమ్లర్ ఆమోదంతో స్థానిక సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్థర్ గ్రీజర్ చొరవతో స్థాపించబడిన వార్తేల్యాండ్‌లోని చెల్మ్నో, మొదటి నిర్మూలన శిబిరం; ఇది 1941 డిసెంబరులో గ్యాస్ వ్యాన్‌లను ఉపయోగించి కార్యకలాపాలను ప్రారంభించింది.[147][148][149] 1941 అక్టోబరులో హయ్యర్ SS, లుబ్లిన్ పోలీస్ లీడర్ ఒడిలో గ్లోబోక్నిక్ లు[150] నిర్మూలన కోసమే ప్రత్యేకంగా నిర్మించదలచిన బెల్జెక్ గ్యాస్‌ చాంబరు నిర్మాణంపై ప్రణాళికలు మొదలుపెట్టారు. ఇలాంటి గ్యాసు చాంబర్లలో ఇదే మొదటిది. జర్మన్ నిర్వాహకుల పెద్ద ఎత్తున యూదులను హత్య చేయబోతున్నారని పోలాండ్‌లో జరుగుతున్న ప్రచారం మధ్య ఈ పని మొదలైంది.[151][147] 1941 చివరలో ఈస్ట్ అప్పర్ సైలేసియాలో, ష్మెల్ట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న బలవంతపు-కార్మిక శిబిరాల్లో ఉన్న యూదులను "పనికి అనర్హులు"గా భావించి ఆష్విట్జ్‌కు గుంపులుగా పంపడం ప్రారంభించారు. అక్కడ వారిని హత్య చేసారు.[152][153]

యూదులను తరలించడం తేలిగ్గా ఉండేందుకు రైలు మార్గాలకు దగ్గర్లో, కానీ ఎవరికీ తెలియకుండా ఉండేలా మారుమూల ప్రాంతాలలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసారు.[150] సామూహిక హత్యల వల్ల వచ్చే దుర్వాసనను సమీపంలోని వారి దృష్టికి రావచ్చు.[154] పశ్చిమ, మధ్య ఐరోపా నుండి వచ్చేవారు మినహా, ఇతర ప్రజలను సాధారణంగా రద్దీగా ఉండే పశువుల బోగీలో శిబిరాలకు తోలేవారు. ఒకే పెట్టెలో 150 మంది బలవంతంగా కుక్కేవారు. చాలా మంది మార్గమధ్యంలోనే మరణించేవారు.[155][156] రైలు రవాణా కొరత వల్ల కొన్నిసార్లు ఈ వెలివేతలను వాయిదా వేయడం, రద్దు చేయడం చేయాల్సి వచ్చేది.[157] బాధితులు అక్కడికి చేరుకున్న తర్వాత, వారి దగ్గర మిగిలి ఉన్న ఆస్తులను దోచుకుని, బలవంతంగా బట్టలు విప్పదీసి, జుట్టు కత్తిరించి, గ్యాస్ ఛాంబరు లోకి తోలేవారు.[158] విష వాయువు వల్ల కలిగే మరణం చాలా బాధాకరంగా ఉండేది. దాదాపు 30 నిమిషాల దాకా సమయం పట్టేది.[159][141] గ్యాస్ ఛాంబర్‌లు ప్రాచీనమైనవి, కొన్నిసార్లు పనిచేసేవి కావు. అలాంటప్పుడు కొందరు ఖైదీలను కాల్చిచంపేవారు.[160]సాధారణంగా నిర్మూలన శిబిరాల్లో, వెలివేసిన వారిని దాదాపు అందరినీ వచ్చీరాగానే చంపేసేవారు. ఆష్విట్జ్‌లో మాత్రం దాదాపు 20-25 శాతం మందిని పని చేసేందుకు వేరు చేసేవారు.[161] అయితే ఈ ఖైదీలలో కూడా చాలామంది తరువాత మరణించారు.[162]

బెల్జెక్, సోబిబోర్, ట్రెబ్లింకాల్లో బాధితుల నుండి కాజేసిన వస్తువుల విలువ RM 17.87 కోట్లు ఉంటుంది. ఇది, వాళ్ళకు అయిన ఖర్చు కంటే చాలా ఎక్కువ.[163][164] ఆ క్యాంపుల్లో పనుల కోసం అంతా కలిపి 3,000 మంది యూదు ఖైదీలు, 1,000 మంది ట్రావింకీ పురుషులు (యుక్రెయిన్‌కి చెందిన వారు), కొద్దిమంది జర్మను గార్డులూ అవసరమయ్యారు.[165][156] హోలోకాస్ట్‌లో చంపేసిన యూదుల్లో సగం మందిని విష వాయువుకే బలిపెట్టారు.[166] మరణ శిబిరాల్లో వేలది మంది రొమానీ ప్రజలను కూడా హత్య చేసారు.[167] ట్రెబ్లింకా, సోబిబోర్ లలో ఖైదీల తిరుగుబాటు కారణంగా అనుకున్నదాని కంటే ముందే వాటిని మూసేసారు.[168][169]

ప్రధాన నిర్మూలన శిబిరాలు[170]
శిబిరం స్థానం చంపబడిన యూదుల సంఖ్య కిల్లింగ్ టెక్నాలజీ ప్లానింగ్ మొదలైంది మాస్ గ్యాస్సింగ్ వ్యవధి
చెల్మ్నో వార్తేల్యాండ్[170] 1,50,000[170] గ్యాస్ వ్యాన్లు[170] 1941 జూలై[170] 1941 డిసెంబరు 8 –1943 ఏప్రిల్, 1944 ఏప్రిల్-జూలై[171]
బెల్జెక్ లుబ్లిన్ జిల్లా[170] 4,40,823–5,96,200[172] స్టేషనరీ గ్యాస్ చాంబర్, ఇంజిన్ ఎగ్జాస్ట్[170] 1941 అక్టోబరు[171] 1942 మార్చి 17–1942 డిసెంబరు[171]
సోబిబోర్ లుబ్లిన్ జిల్లా[170] 1,70,618–2,38,900[172] స్టేషనరీ గ్యాస్ చాంబర్, ఇంజిన్ ఎగ్జాస్ట్[170] 1941 చివరి లేదా 1942 మార్చి[173] 1942 మే–1942 అక్టోబరు[173]
ట్రెబ్లింకా వార్సా జిల్లా[170] 7,80,863–9,51,800[172] స్టేషనరీ గ్యాస్ చాంబర్, ఇంజిన్ ఎగ్జాస్ట్[170] 1942 ఏప్రిల్[170] 1942 జూలై 23–1943 అక్టోబరు[170]
ఆష్విట్జ్ II-బిర్కెనౌ తూర్పు ఎగువ సిలేసియా[170] 9,00,000–10,00,000[170] స్టేషనరీ గ్యాస్ చాంబర్, హైడ్రోజన్ సైనైడ్[170] 1941 సెప్టెంబరు
(POW క్యాంపుగా నిర్మించారు)[174][170]
1942 ఫిబ్రవరి–1944 అక్టోబరు[170]

యుద్ధం మలి భాగం మార్చు

కొనసాగిన హత్యలు మార్చు

 
1938లో[175] హంగేరీ ఆక్రమించిన కార్పాతియన్ రుథేనియాకు చెందిన యూదులు, 1944 మే / జూన్ ఆష్విట్జ్ II వద్ద. పురుషులు కుడివైపు, మహిళలు పిల్లలు ఎడమవైపు వరుసలో ఉన్నారు. దాదాపు 25 శాతం మందిని పని కోసం ఎంపిక చేసుకుని, మిగిలినవారిని విషవాయువుకు బలిపెట్టారు.[161]

1943లో మిలిటరీ పరాజయాల తర్వాత, జర్మనీ యుద్ధంలో ఓడిపోతుందనేది మరింత స్పష్టంగా కనిపించింది.[176][177] 1943 ప్రారంభంలో, 45,000 మంది యూదులను జర్మన్-ఆక్రమిత ఉత్తర గ్రీస్, నుండి ఆష్విట్జ్ కు బహిష్కరించారు. అక్కడ దాదాపు అందరినీ చంపేసారు.[178] 1943 చివరలో ఇటలీ, జర్మనీతో చేతులు కలిపాక, జర్మనీ ఇటలీ నుండి, ఫ్రాన్స్, యుగోస్లేవియా, అల్బేనియా, గ్రీస్ లోని పూర్వపు ఇటాలియన్ ఆక్రమణ ప్రాంతాల నుండి అనేక వేల మంది యూదులను బహిష్కరించింది.[179][180] 1942 తర్వాత పశ్చిమ ఐరోపాలో బహిష్కరణలను కొనసాగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమౌతూ వచ్చాయి. యూదులు అజ్ఞాతంలోకి వెళ్లడం, స్థానిక అధికారుల వ్యతిరేకతలు దీనికి కారణం.[181] చాలా మంది డేనిష్ యూదులు 1943 చివరలో జర్మన్ బహిష్కరణ ప్రయత్నాన్ని ఎదుర్కొని డేనిష్ ప్రతిఘటన సహాయంతో స్వీడన్‌కు పారిపోయారు.[182] 1943, 1944 లలో జరిగిన హత్యలతో తూర్పు ఐరోపాలో మిగిలిన అన్ని ఘెట్టోలనూ, జీవించి ఉన్న యూదులను చాలావరకు నిర్మూలించినట్లైంది.[112] బెల్జెక్, సోబిబోర్, ట్రెబ్లింకా లను మూసివేసి, నాశనం చేసారు.[183][184]

1942 తర్వాత జరిగిన హత్యల్లో అతిపెద్ద సంఖ్యలో హంగేరియన్ యూదులపై జరిగాయి.[185] 1944లో హంగరీపై జర్మన్ దండయాత్ర తర్వాత, 4,37,000 మంది యూదులను ఎనిమిది వారాల్లో ఆష్విట్జ్‌కు బహిష్కరించడంలో హంగేరియన్ ప్రభుత్వం జర్మన్లకు చాలా సన్నిహితంగా సహకరించింది.[186][175][187] హంగేరియన్ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి యూదుల ఆస్తిని స్వాధీనపరచుకున్నారు. యూదులను బలవంతంగా కార్మికులుగా పంపడం వల్ల యూదుయేతర హంగేరియన్లను పంపాల్సిన అవసరం లేకుండా పోయింది.[188] ఎంపిక కాకుండా బయటపడిన యూదులను యుద్ధ విమానాల ఉత్పత్తిని పెంచే చివరి ప్రయత్నంలో భాగంగా నిర్మాణ, తయారీ కార్మికులుగా మార్చారు.[189][190] జర్మనీ నుండి యూదు జనాభాను తొలగించాలనే తమ లక్ష్యాన్ని నాజీలు 1943 లో చాలా వరకు సాధించినప్పటికీ, ఈ యూదు కార్మికులను దిగుమతి చేసుకోవడం వలన 1944 లో అది తారుమారైంది.[191]

మృతుల సంఖ్య మార్చు

 
హోలోకాస్ట్ మరణాలు 1939 యూదు జనాభాలో శాతంగా ఉన్నాయి. ముదురు ఎరుపు రంగు అధిక మరణాల రేటును సూచిస్తుంది, ముదురు రంగు 90 శాతం ఉంటుంది.

దాదాపు ఆరు లక్షల మంది యూదులను చంపేసారు.[192] వారిలో ఎక్కువ మంది తూర్పు ఐరోపాకు చెందినవారు. పోలాండ్ కు చెందినవారే సగం మంది ఉన్నారు.[193][194] ఒకప్పుడు నాజీ పాలనలో గానీ, జర్మనీ మిత్రదేశాలలో గానీ నివసించిన దాదాపు 13 లక్షల మంది యూదులు యుద్ధకాలంలో మరణించకుండా బయటపడ్డారు.[192] ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు జనాభాలో మూడింట ఒక వంతు, యూరోపియన్ యూదులలో మూడింట రెండు వంతులు తుడిచిపెట్టుకుపోయారు. [195] వివిధ కారణాల వల్ల మరణాల రేటు విస్తృతంగా మారుతూ కొన్ని ప్రాంతాల్లో 100 శాతానికి చేరుకుంది.[196] మనుగడలో తేడా ఉండడానికి కారణాలు వలస వెళ్ళే సౌలభ్యం ఉండడం,[197] జర్మనీ మిత్రదేశాలలో లభించిన రక్షణ. వీటి వలన దాదాపు 6,00,000 మంది యూదులు భద్రంగా బయటపడ్డారు.[198] యూదు పిల్లలు, వృద్ధులు ఇతరుల కంటే ఎక్కువగా మరణాల పాలయ్యారు.[199]

అదే విధంగా పెద్ద సంఖ్యలో యూదుయేతర పౌరులు, యుద్ధ ఖైదీలు-గెర్లాచ్ అంచనా ప్రకారం 60 నుండి 80 లక్షల మంది, గిల్బర్ట్ అంచనా ప్రకారం కోటికి పైగా, [200] అమెరికా హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం [201] ప్రకారం 1.1 కోటి మందికి పైగా-జర్మనీ దాని మిత్రదేశాల చేతిలో హతులయ్యారు. హంగరీ వంటి కొన్ని దేశాల్లో, యుద్ధానికి సంబంధించిన పౌర మరణాలలో యూదులు అత్యధికంగా ఉన్నారు; పోలాండ్‌లో నైతే, మరణించినవారిలో వారే మెజారిటీ[202] లేదా దాదాపు సగం మంది ఉన్నారు.[194] సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, గ్రీస్, యుగోస్లావియా వంటి ఇతర దేశాలలో మాత్రం, యూదుయేతర పౌరుల నష్టాలు యూదుల మరణాల కంటే ఎక్కువగా ఉన్నాయి.[202]

అనంతర పరిణామాలు, వారసత్వం మార్చు

స్వదేశానికి తిరిగి వెళ్లడం, మళ్ళీ వలస మార్చు

విముక్తి తర్వాత, చాలా మంది యూదులు తిరిగి వెనక్కి రావడానికి ప్రయత్నించారు. తమ బంధువులు పెద్దగా కనిపించకపోవడం, యూదేతరుల చేతికి చిక్కిన తమ ఆస్తిని వెనక్కి ఇవ్వడానికి చాలా మంది నిరాకరించడం,[203] కీల్స్ హింసాకాండ వంటి దాడులు వగైరా కారణాల వల్ల చాలామంది యూదులు తూర్పు ఐరోపాను విడిచిపెట్ట వలసి వచ్చింది.[204][205] యుద్ధం తర్వాత, ఆస్తిని వెనక్కి ఇవ్వడంపై విభేదాల కారణంగా అనేక దేశాల్లో యాంటిసెమిటిజం పెరిగినట్లు వెల్లడైంది.[206] యుద్ధం ముగిసేటప్పటికి, జర్మనీలో 28,000 మంది లోపు జర్మన్ యూదులు, 60,000 మంది జర్మనేతర యూదులు ఉన్నారు. 1947 నాటికి, తూర్పు ఐరోపా నుండి వలస పోవడానికి కమ్యూనిస్టు అధికారులు అనుమతించిన కారణంగా జర్మనీలో యూదుల సంఖ్య 2,50,000 కి పెరిగింది; కాందిశీకుల శిబిరాల్లో ఉన్న జనాభాలో యూదులు దాదాపు 25 శాతం ఉన్నారు.[207] ప్రాణాలతో బయటపడిన చాలా మందికి ఆరోగ్యం సరిగా లేనప్పటికీ, విద్య, పునరావాస ప్రయత్నాలతో సహా ఈ శిబిరాల్లో స్వీయ-ప్రభుత్వాన్ని నిర్వహించడానికి వారు ప్రయత్నించారు.[208] ఇతర దేశాలు తమ ఇమ్మిగ్రేషన్‌ను అనుమతించడంలో చూపించిన విముఖత కారణంగా, 1948 లో ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించే వరకు చాలా మంది జర్మనీలోనే ఉన్నారు.[207] ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు సడలించడం వల్ల 1950 లో కొందరు అమెరికా వెళ్లారు.[209]

క్రిమినల్ విచారణలు మార్చు

 
అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ వద్ద డాక్లో ప్రతివాదులు. 1945 నవంబరు

చాలా మంది హోలోకాస్ట్ నేరస్థులపై అసలు విచారణ జరిగిందే లేదు.[210] రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోను, ఆ తరువాత, అనేక యూరోపియన్ దేశాలు నిజమైన నేరస్తులను, నేరస్తులని తాము భావించిన వారినీ ఏరివేయడం ప్రారంభించాయి. ఇది ఐరోపా జనాభాలో 2-3 శాతం మందిని ప్రభావితం చేసినప్పటికీ, వారిపై జరిగిన విచారణల్లో వారు యూదులపై నేరాలను నొక్కి చెప్పలేదు.[211] నాజీ దురాగతాలు 1948లో యునైటెడ్ నేషన్స్ జెనోసైడ్ కన్వెన్షన్‌కు దారితీశాయి, అయితే క్రిమినల్ చట్టాల పునరాలోచన కారణంగా హోలోకాస్ట్ ట్రయల్స్‌లో దీనిని ఉపయోగించలేదు.[212]

1945, 1946 లలో, ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ 23 మంది నాజీ నాయకులను ప్రధానంగా దురాక్రమణలు చేసినందుకు విచారించింది. నాజీ నేరాలకు ఇదే మూలకారణమని ప్రాసిక్యూషన్ వాదించింది;[213] అయినప్పటికీ, యూదులను క్రమపద్ధతిలో హత్య చేయడం ప్రముఖంగా వేదిక పైకి వచ్చింది.[214] దీన్నీ, ఆక్రమిత జర్మనీలో మిత్రరాజ్యాలు నిర్వహించిన ఇతర విచారణలనూ రాజకీయ ప్రతీకారానికి రూపంగా జర్మన్ ప్రజలు భావించారు.[215] యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఒక్కటే 462 యుద్ధ నేరాల విచారణలలో 1,676 మంది నిందితులపై అభియోగాలు మోపింది.[216] ఆ తరువాత పశ్చిమ జర్మనీ 1,00,000 మందిని విచారించింది, 6,000 కంటే ఎక్కువ మంది నిందితులను, ప్రధానంగా తక్కువ స్థాయి నేరస్థులను శిక్షించింది.[217][218] ఉన్నత స్థాయి నిర్వాహకుడు అడాల్ఫ్ ఐచ్‌మాన్‌ను 1961లో కిడ్నాప్ చేసి, ఇజ్రాయెల్‌లో విచారణ జరిపారు. డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా ఐచ్‌మాన్‌ను దోషిగా నిర్ధారించే బదులు, ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్లు చాలా మంది హోలోకాస్ట్‌లో ప్రాణాలతో బయటపడిన వారిని సాక్ష్యం చెప్పమని కోరారు. ఈ వ్యూహం ప్రచారాన్ని తెచ్చిపెట్టింది గానీ వివాదాస్పదమైంది.[219][220]

నష్టపరిహారాలు మార్చు

జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, పోలాండ్, హంగేరీలకు చెందిన యూదులకు ఆస్తి నష్టం 1944 నాటి డాలరు విలువలో దాదాపు 1000 కోట్లు,[221] 2013 నాటి విలువలో అది $17,000 కోట్లు అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలో కార్మికుల శ్రమ విలువను చేర్చలేదు.[222] మొత్తంమీద, నాజీలు దోచుకున్న యూదుల ఆస్తి మొత్తం ఆక్రమిత దేశాల నుండి దోచుకున్న మొత్తంలో దాదాపు 10 శాతం.[222] ప్రాణాలతో బయటపడిన వారి నష్టాలకు పరిహారం చెల్లించే ప్రయత్నాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వెంటనే ప్రారంభమయ్యాయి. తూర్పు ఐరోపాలో కమ్యూనిజం పతనంతో 1990లలో పునరుద్ధరణ ప్రయత్నాలు మరో తరంగం లాగా జరిగాయి.[223]

1945 - 2018 మధ్య, హోలోకాస్ట్‌లో ప్రాణాలతో బయటపడిన వారికి, వారి వారసులకూ జర్మనీ, $8680 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. 1952లో, పశ్చిమ జర్మనీ ఇజ్రాయెల్‌కు DM 300 కోట్లు (దాదాపు $71.4 కోట్లు), క్లెయిమ్స్ కాన్ఫరెన్స్‌కు DM 45 కోట్లు (దాదాపు $10.7 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. [224] హోలోకాస్ట్ ప్రాణాలతో బయటపడిన కొంతమందికి జరిగిన హాని కోసం జర్మనీ, పెన్షన్లు, ఇతర నష్టపరిహారాలను చెల్లించింది.[225] ఈ దేశాల నుండి తాము దొంగిలించిన యూదు ఆస్తులకు గాను ఇతర దేశాలు పరిహారం చెల్లించాయి. చాలా పశ్చిమ ఐరోపా దేశాలు యుద్ధం తర్వాత యూదులకు కొంత ఆస్తిని పునరుద్ధరించాయి. అయితే కమ్యూనిస్టు దేశాల్లో యూదుల ఆస్తులను ముందే జాతీయం చేశాయి. అంచేత ఆ దేశాల్లో యూదులకు చెల్లించిన మొత్తం తక్కువగా ఉంది.[226][227] యూరోపియన్ యూనియన్‌లో పోలాండ్ మాత్రమే ఎటువంటి పునరుద్ధరణ చట్టాన్ని ఆమోదించలేదు.[228] అనేక పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధానికి పూర్వం ఉన్న ఆస్తులలో చాలా కొద్దిగానే పునరుద్ధరించాయి. ప్రత్యేకించి, పెద్ద మొత్తంలో స్థిరాస్తులను ప్రాణాలతో బయటపడినవారికి లేదా వారి వారసులకు తిరిగి ఇవ్వలేదు.[229][230]

స్మారకాలు మార్చు

 
2016లో బెర్లిన్‌లో ఐరోపా‌లోని హత్యకు గురైన యూదులకు స్మారక చిహ్నం

యుద్ధం తర్వాతి దశాబ్దాలలో, హోలోకాస్ట్ జ్ఞాపకాలు ఎక్కువగా ప్రాణాలతో బయటపడిన వారికి, వారి సంఘాలకు మాత్రమే పరిమితమయ్యాయి.[231] కమ్యూనిజం పతనం తర్వాత 1990 లలో హోలోకాస్ట్ జ్ఞాపకాలకు ఆదరణ పెరిగింది. మానవ దుష్టత్వానికి పరాకాష్ఠగా, పాశ్చాత్య చారిత్రక స్పృహకు కేంద్రంగా మారింది.[232][233][234] హోలోకాస్ట్ విద్య, సాధారణంగా పక్షపాతాన్ని తగ్గించడంతోపాటు పౌరతత్వాన్ని ప్రోత్సహిస్తుందని దాని సమర్థకులు వాదించారు. హోలోకాస్ట్ విద్య విస్తృతంగా వ్యాపించింది.[235][236] అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ప్రతి సంవత్సరం జనవరి 27న జరుపుకుంటారు. మరికొన్ని దేశాలు వేరే స్మారక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.[237] స్మారక చిహ్నాలు, సంగ్రహాలయాలు, ప్రసంగాలు, అలాగే నవలలు, పద్యాలు, చలనచిత్రాలు, నాటకాలు వంటి సంస్కృతికి సంబంధించిన కృతులలో హోలోకాస్ట్ జ్ఞాపకాలు పదిలమయ్యాయి.[238] హోలోకాస్ట్‌ను తిరస్కరించడం కొన్ని దేశాలు నేరంగా పరిగణిస్తాయి.[239]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Kay 2021, pp. 13–14.
  2. 2.0 2.1 Bloxham 2009, pp. 138–139.
  3. Beorn 2018, p. 33.
  4. 4.0 4.1 4.2 Gerlach 2016, p. 39.
  5. Wachsmann 2015, pp. 32–38.
  6. Stone 2020, p. 66.
  7. Stone 2020, p. 67.
  8. 8.0 8.1 Gerlach 2016, p. 55.
  9. Longerich 2010, pp. 47–48.
  10. Beorn 2018, p. 35.
  11. Bloxham 2009, p. 148.
  12. Stone 2020, p. 65.
  13. 13.0 13.1 Gerlach 2016, p. 40.
  14. Cesarani 2016, p. 7.
  15. Longerich 2010, p. 43.
  16. 16.0 16.1 Beorn 2018, p. 96.
  17. Gerlach 2016, pp. 39, 41.
  18. 18.0 18.1 Longerich 2010, p. 52.
  19. Longerich 2010, pp. 52, 60.
  20. 20.0 20.1 Gerlach 2016, p. 41.
  21. Cesarani 2016, p. 106.
  22. Gerlach 2016, p. 42.
  23. Gerlach 2016, pp. 43–44.
  24. Gerlach 2016, pp. 44–45.
  25. Gerlach 2016, p. 45.
  26. Gerlach 2016, p. 46.
  27. Cesarani 2016, pp. 184–185.
  28. Cesarani 2016, pp. 184, 187.
  29. Gerlach 2016, p. 44.
  30. Longerich 2010, p. 112.
  31. Cesarani 2016, p. 200.
  32. Longerich 2010, pp. 117, 119.
  33. Gerlach 2016, p. 48.
  34. Gerlach 2016, pp. 49, 53.
  35. Gerlach 2016, p. 52.
  36. Gerlach 2016, p. 51.
  37. Gerlach 2016, p. 50.
  38. Stone 2010, p. 17.
  39. Gerlach 2016, pp. 332–334.
  40. Gerlach 2016, p. 49.
  41. Longerich 2010, pp. 109–110.
  42. 42.0 42.1 42.2 Gerlach 2016, p. 56.
  43. 43.0 43.1 Gerlach 2016, p. 57.
  44. Beorn 2018, p. 98.
  45. Beorn 2018, pp. 99, 101.
  46. Gerlach 2016, pp. 57–58.
  47. Beorn 2018, pp. 102–103.
  48. Hayes 2017, p. 241.
  49. 49.0 49.1 Gerlach 2016, p. 58.
  50. Beorn 2018, pp. 46, 73.
  51. Beorn 2018, p. 86.
  52. Cesarani 2016, p. 362.
  53. Beorn 2018, pp. 89–90.
  54. Kay 2021, p. 38.
  55. Bergen 2016, p. 162.
  56. Kay 2021, p. 37.
  57. Cesarani 2016, p. 284.
  58. 58.0 58.1 Gerlach 2016, p. 59.
  59. Kay 2021, pp. 37–38.
  60. Kay 2021, p. 254.
  61. Beorn 2018, p. 207.
  62. Kay 2021, p. 40.
  63. Longerich 2010, p. 148.
  64. Beorn 2018, p. 108.
  65. Beorn 2018, pp. 107–109.
  66. 66.0 66.1 66.2 Bartov 2023, p. 201.
  67. 67.0 67.1 Longerich 2010, p. 164.
  68. Beorn 2018, pp. 109, 117.
  69. Beorn 2018, pp. 87, 103.
  70. 70.0 70.1 Beorn 2018, p. 116.
  71. Beorn 2018, p. 115.
  72. Miron 2020, pp. 247, 251, 254.
  73. Beorn 2018, p. 117.
  74. Miron 2020, p. 253.
  75. Miron 2020, pp. 253–254.
  76. 76.0 76.1 76.2 Miron 2020, p. 254.
  77. Engel 2020, p. 240.
  78. Longerich 2010, p. 272.
  79. Cesarani 2016, pp. 314–315.
  80. Miron 2020, pp. 247–248.
  81. Westermann 2020, pp. 127–128.
  82. Gerlach 2016, p. 67.
  83. Cesarani 2016, p. 351.
  84. Gerlach 2016, p. 172.
  85. Beorn 2018, pp. 121–122.
  86. Bartov 2023, pp. 201–202.
  87. Longerich 2010, p. 179.
  88. Beorn 2018, pp. 63–64.
  89. Gerlach 2016, p. 68.
  90. Longerich 2010, p. 180.
  91. Gerlach 2016, pp. 67–68.
  92. Beorn 2018, p. 67.
  93. Longerich 2010, pp. 181–182.
  94. Gerlach 2016, pp. 221–222.
  95. Bloxham 2009, pp. 182–183.
  96. Kay 2021, pp. 142, 294.
  97. Beorn 2018, p. 125.
  98. Gerlach 2016, p. 72.
  99. Gerlach 2016, p. 5.
  100. Kay 2021, p. 294.
  101. Gerlach 2016, pp. 231–232.
  102. Kay 2021, p. 161.
  103. Gerlach 2016, p. 288.
  104. 104.0 104.1 Kay 2021, p. 190.
  105. Gerlach 2016, pp. 297–298.
  106. 106.0 106.1 Gerlach 2016, pp. 298–299.
  107. 107.0 107.1 Gerlach 2016, p. 298.
  108. Kay 2021, pp. 182–183.
  109. Kay 2021, p. 182.
  110. Gerlach 2016, pp. 300, 310.
  111. Beorn 2020, pp. 162–163.
  112. 112.0 112.1 112.2 Beorn 2018, p. 128.
  113. Gerlach 2016, pp. 72–73.
  114. Gerlach 2016, pp. 69, 440.
  115. Kopstein 2023, pp. 105, 107–108.
  116. Kopstein 2023, p. 107.
  117. Bartov 2023, p. 202.
  118. 118.0 118.1 Gerlach 2016, p. 69.
  119. Beorn 2018, p. 185.
  120. Beorn 2018, p. 129.
  121. Longerich 2010, p. 190.
  122. Gerlach 2016, p. 66.
  123. Beorn 2018, pp. 259–260.
  124. 124.0 124.1 124.2 Beorn 2018, p. 132.
  125. Longerich 2010, p. 207.
  126. Gerlach 2016, pp. 69–70.
  127. Russell 2018, pp. 135–136.
  128. 128.0 128.1 128.2 Gerlach 2016, p. 70.
  129. Bloxham 2009, p. 203.
  130. Bartov 2023, p. 203.
  131. Beorn 2018, p. 142.
  132. Bartov 2023, pp. 205–206.
  133. Gerlach 2016, p. 71.
  134. Bergen 2016, p. 200.
  135. Beorn 2018, pp. 146–147.
  136. Evans 2019, p. 120.
  137. 137.0 137.1 137.2 Gerlach 2016, p. 78.
  138. Bartov 2023, p. 204.
  139. Longerich 2010, p. 303.
  140. Gerlach 2016, pp. 79–80.
  141. 141.0 141.1 141.2 141.3 Kay 2021, p. 199.
  142. Longerich 2010, p. 306.
  143. Gerlach 2016, pp. 84–85.
  144. Beorn 2018, p. 202.
  145. Gerlach 2016, p. 99.
  146. Longerich 2010, p. 279.
  147. 147.0 147.1 Gerlach 2016, p. 74.
  148. Beorn 2018, p. 209.
  149. Longerich 2010, pp. 290–291.
  150. 150.0 150.1 Beorn 2018, p. 210.
  151. Longerich 2010, pp. 280, 293–294, 302.
  152. Longerich 2010, pp. 280–281, 292.
  153. Gerlach 2016, pp. 208–209.
  154. Bergen 2016, pp. 247, 251.
  155. Gerlach 2016, pp. 286–287.
  156. 156.0 156.1 Kay 2021, p. 204.
  157. Gerlach 2016, p. 283.
  158. Kay 2021, pp. 204–205.
  159. Longerich 2010, p. 330.
  160. Stone 2010, pp. 153–154.
  161. 161.0 161.1 Gerlach 2016, p. 199.
  162. Gerlach 2016, p. 211.
  163. Gerlach 2016, p. 273.
  164. Kay 2021, p. 209.
  165. Gerlach 2016, p. 274.
  166. Gerlach 2016, p. 121.
  167. Kay 2021, p. 247.
  168. Gerlach 2016, p. 111.
  169. Kay 2021, p. 208.
  170. 170.00 170.01 170.02 170.03 170.04 170.05 170.06 170.07 170.08 170.09 170.10 170.11 170.12 170.13 170.14 170.15 170.16 170.17 Gerlach 2016, p. 120.
  171. 171.0 171.1 171.2 Gerlach 2016, pp. 74, 120.
  172. 172.0 172.1 172.2 Lehnstaedt 2021, p. 63.
  173. 173.0 173.1 Gerlach 2016, pp. 93–94, 120.
  174. Longerich 2010, pp. 281–282.
  175. 175.0 175.1 Longerich 2010, p. 408.
  176. Bergen 2016, p. 266.
  177. Gerlach 2016, p. 196.
  178. Longerich 2010, p. 391.
  179. Longerich 2010, pp. 402–403.
  180. Gerlach 2016, p. 113.
  181. Gerlach 2016, p. 102.
  182. Gerlach 2016, p. 302.
  183. Longerich 2010, pp. 410–412.
  184. Beorn 2018, p. 221.
  185. Gerlach 2016, p. 103.
  186. Gerlach 2016, pp. 114, 368.
  187. Beorn 2018, p. 193.
  188. Gerlach 2016, p. 114.
  189. Spoerer 2020, p. 142.
  190. Wachsmann 2015, p. 457.
  191. Gerlach 2016, p. 188.
  192. 192.0 192.1 Gerlach 2016, p. 404.
  193. Beorn 2018, p. 1.
  194. 194.0 194.1 Bergen 2016, p. 155.
  195. "Jewish Population of Europe in 1945". United States Holocaust Memorial Museum (in ఇంగ్లీష్). Retrieved 10 May 2023.
  196. Gerlach 2016, p. 407.
  197. Gerlach 2016, pp. 407–408.
  198. Gerlach 2016, pp. 118, 409–410.
  199. Gerlach 2016, pp. 428–429.
  200. Martin Gilbert (2014). "Epilogue - "I will tell the world"". The Holocaust: The Human Tragedy. Rosetta Books. ISBN 9780795337192. As well as the six million Jews who were murdered, more than ten million other non-combatants were killed by the Nazis.
  201. United States Holocaust Memorial Museum: Documenting numbers of victims of the Holocaust and Nazi persecution; Niewyk & Nicosia 2000 give a total of 17 million (including more than 5 million Jews)
  202. 202.0 202.1 Gerlach 2016, p. 3.
  203. Beorn 2018, pp. 273–274.
  204. Beorn 2018, pp. 275–276.
  205. Bartov 2023, p. 215.
  206. Gerlach 2016, pp. 353–355.
  207. 207.0 207.1 Kochavi 2010, p. 509.
  208. Kochavi 2010, pp. 512–513.
  209. Kochavi 2010, p. 521.
  210. Bartov 2023, p. 214.
  211. Priemel 2020, p. 174.
  212. Wittmann 2010, p. 524.
  213. Priemel 2020, p. 176.
  214. Priemel 2020, p. 177.
  215. Wittmann 2010, p. 534.
  216. Wittmann 2010, p. 525.
  217. Priemel 2020, p. 184.
  218. Wittmann 2010, pp. 534–535.
  219. Priemel 2020, pp. 182–183.
  220. Bartov 2023, pp. 215–216.
  221. Goschler & Ther 2007, p. 7.
  222. 222.0 222.1 Hayes 2010, p. 548.
  223. Goschler & Ther 2007, pp. 13–14.
  224. "The JUST Act Report: Germany". United States Department of State. Retrieved 2 May 2023.
  225. Hayes 2010, pp. 549–550.
  226. Bazyler et al. 2019, pp. 482–483.
  227. Hayes 2010, p. 552.
  228. Bazyler et al. 2019, p. 487.
  229. Bazyler et al. 2019, p. 485.
  230. Hayes 2010, p. 556.
  231. Assmann 2010, p. 97.
  232. Assmann 2010, pp. 98, 107.
  233. Rosenfeld 2015, pp. 15, 346.
  234. Assmann 2010, p. 110.
  235. Stone 2010, p. 288.
  236. Sutcliffe 2022, p. 8.
  237. Assmann 2010, p. 104.
  238. Rosenfeld 2015, p. 14.
  239. Priemel 2020, p. 185.

కృతులు మార్చు

పుస్తకాలు మార్చు

పుస్తక అధ్యాయాలు మార్చు

  • Assmann, Aleida (2010). "The Holocaust – a Global Memory? Extensions and Limits of a New Memory Community". Memory in a Global Age: Discourses, Practices and Trajectories (in ఇంగ్లీష్). Palgrave Macmillan UK. pp. 97–117. ISBN 978-0-230-28336-7.
  • Bartov, Omer (2023). "The Holocaust". The Oxford History of the Third Reich (in ఇంగ్లీష్). Oxford University Press. pp. 190–216. ISBN 978-0-19-288683-5.
  • Beorn, Waitman Wade (2020). "All the Other Neighbors: Communal Genocide in Eastern Europe". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 153–172. ISBN 978-1-118-97052-2.
  • Dean, Martin C. (2020). "Survivors of the Holocaust within the Nazi Universe of Camps". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). John Wiley & Sons. pp. 263–277. ISBN 978-1-118-97049-2.
  • Engel, David (2020). "A Sustained Civilian Struggle: Rethinking Jewish Responses to the Nazi Regime". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 233–245. ISBN 978-1-118-97052-2.
  • Evans, Richard J. (2019). "The Decision to Exterminate the Jews of Europe". The Jews, the Holocaust, and the Public: The Legacies of David Cesarani (in ఇంగ్లీష్). Springer International Publishing. pp. 117–143. ISBN 978-3-030-28675-0.
  • Goschler, Constantin; Ther, Philipp (2007). "Introduction: A History Without Boundaries: the Robbery and Restitution of Jewish Property in Europe". Robbery and Restitution: The Conflict over Jewish Property in Europe (in ఇంగ్లీష్). Berghahn Books. pp. 1–18. ISBN 978-0-85745-564-2.
  • Hayes, Peter; Roth, John K. (2010). "Introduction". The Oxford Handbook of Holocaust Studies. Oxford University Press. pp. 1–20. ISBN 978-0-19-921186-9.
  • Hayes, Peter (2010). "Plunder and Restitution". The Oxford Handbook of Holocaust Studies. Oxford University Press. pp. 540–559. ISBN 978-0-19-921186-9.
  • Kansteiner, Wulf (2017). "Transnational Holocaust Memory, Digital Culture and the End of Reception Studies". The Twentieth Century in European Memory: Transcultural Mediation and Reception (in ఇంగ్లీష్). Brill. pp. 305–343. ISBN 978-90-04-35235-3.
  • Kochavi, Arieh J. (2010). "Liberation and Dispersal". The Oxford Handbook of Holocaust Studies. Oxford University Press. pp. 509–523. ISBN 978-0-19-921186-9.
  • Kopstein, Jeffrey S. (2023). "A Common History of Violence?: The Pogroms of Summer 1941 in Comparative Perspective". Politics, Violence, Memory: The New Social Science of the Holocaust (in ఇంగ్లీష్). Cornell University Press. pp. 104–123. ISBN 978-1-5017-6676-3.
  • Messenger, David A. (2020). "The Geopolitics of Neutrality: Diplomacy, Refuge, and Rescue during the Holocaust". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 381–396. ISBN 978-1-118-97052-2.
  • Miron, Guy (2020). "Ghettos and Ghettoization – History and Historiography". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 247–261. ISBN 978-1-118-97052-2.
  • Priemel, Kim Christian (2020). "War Crimes Trials, the Holocaust, and Historiography, 1943–2011". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 173–189. ISBN 978-1-118-97052-2.
  • Spoerer, Mark (2020). "The Nazi War Economy, the Forced Labor System, and the Murder of Jewish and Non‐Jewish Workers". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley. pp. 135–151. ISBN 978-1-118-97052-2.
  • Stone, Dan (2020). "Ideologies of Race: The Construction and Suppression of Otherness in Nazi Germany". A Companion to the Holocaust (in ఇంగ్లీష్). Wiley: 59–74. doi:10.1002/9781118970492.ch3.
  • Weitz, Eric D. (2010). "Nationalism". The Oxford Handbook of Holocaust Studies. Oxford University Press. pp. 54–67. ISBN 978-0-19-921186-9.
  • Westermann, Edward B. (2020). "Old Nazis, Ordinary Men, and New Killers: Synthetic and Divergent Histories of Perpetrators". A Companion to the Holocaust. Wiley. pp. 117–133. ISBN 978-1-118-97052-2.
  • Wittmann, Rebecca (2010). "Punishment". The Oxford Handbook of Holocaust Studies. Oxford University Press. pp. 524–539. ISBN 978-0-19-921186-9.

పత్రికల్లో వచ్చిన వ్యాసాలు మార్చు